E-Paper
Advertisement

‘లండన్ ఐ’ తరహాలో ‘అమరావతి ఐ’.. కృష్ణా తీరంలో కళ్లు చెదిరే జెయింట్ వీల్ నిర్మాణం!

‘లండన్ ఐ’ తరహాలో ‘అమరావతి ఐ’.. కృష్ణా తీరంలో కళ్లు చెదిరే జెయింట్ వీల్ నిర్మాణం!

Amaravati Giant Observation Wheel: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేస్తోంది. ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ అయిన లండన్ ఐ తరహాలో అమరావతి ఐ పేరుతో భారీ అబ్జర్వేషన్ వీల్ నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి టెండర్ల ప్రక్రియ ప్రారంభించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదం తెలిపింది.

లండన్ ఐ తరహాలో డిజైన్..

లండన్ నగరానికి ప్రత్యేక గుర్తింపుగా నిలిచిన లండన్ ఐ ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తోంది. అదే తరహా డిజైన్‌ తో అమరావతిలో కూడా భారీ వీల్ నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే అమరావతికి కొత్త ఆకర్షణగా మారే అవకాశం ఉంది.

కృష్ణానది తీరంలో నిర్మాణం

అమరావతి ఐను కృష్ణా నది తీరంలో నిర్మించనున్నారు. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (APCRDA) పరిధిలోని సుమారు ఆరు ఎకరాల భూమిని కేటాయించనున్నారు. నది ఒడ్డున ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేయడం వల్ల సందర్శకులకు అద్భుతమైన దృశ్యాలను ఆస్వాదించే అవకాశం లభించనుంది. ఈ భారీ అబ్జర్వేషన్ వీల్‌ లో ప్రత్యేక క్యాప్సూల్స్ ఏర్పాటు చేస్తారు. వీటిలో కూర్చొని సందర్శకులు ఎత్తుకు వెళ్లి అమరావతి నగర అందాలు, కృష్ణా నది ప్రవాహం, పరిసర ప్రాంతాల సహజ సౌందర్యాన్ని వీక్షించవచ్చు. ముఖ్యంగా రాత్రి వేళల్లో నగర లైటింగ్ మధ్య ఈ ఎక్స్ పీరియెన్స్ మరింత ఆకర్షణీయంగా ఉండే అవకాశముంది.

డీబీఎఫ్‌వోటీ విధానంలో నిర్మాణం

ప్రభుత్వం ఈ ప్రాజెక్టును డీబీఎఫ్‌వోటీ (Design, Build, Finance, Operate and Transfer) విధానంలో అమలు చేయాలని నిర్ణయించింది. ఈ విధానంలో ప్రైవేట్ సంస్థలు ప్రాజెక్టును రూపొందించి, నిర్మాణానికి అవసరమైన పెట్టుబడులు సమకూర్చి, నిర్ణీత కాలం పాటు మెయింటెనెన్స్ చేస్తాయి. ఆ తర్వాత ప్రభుత్వానికి అప్పగిస్తాయి. అమరావతి ఐ ప్రాజెక్టును 30 ఏళ్ల కాలపరిమితితో అమలు చేసేలా టెండర్లు పిలవనున్నారు.

అమరావతిలో పర్యాటక రంగానికి కొత్త ఊపు

ఈ ప్రాజెక్టు ద్వారా అమరావతిలో పర్యాటక రంగానికి కొత్త ఊపు తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దేశ, విదేశాల నుంచి ఎక్కువ మంది సందర్శకులను ఆకర్షించడం, స్థానికంగా ఉపాధి అవకాశాలు పెంచడం, పర్యాటక ఆదాయాన్ని పెంపొందించడం వంటి ప్రయోజనాలు ఈ ప్రాజెక్టు ద్వారా లభిస్తాయని అధికారులు భావిస్తున్నారు. అమరావతి రాజధాని నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇలాంటి ప్రతిష్టాత్మక పర్యాటక ప్రాజెక్టులు నగర అభివృద్ధికి తోడ్పడతాయని ప్రభుత్వం భావిస్తోంది. లండన్ ఐ తరహాలో రూపొందనున్న అమరావతి ఐ పూర్తయితే,  కేవలం వినోద కేంద్రంగా మాత్రమే కాకుండా అమరావతి నగరానికి ప్రత్యేక గుర్తింపుగా నిలిచే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌ లో ప్రముఖ పర్యాటక ఆకర్షణగా మారుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది.

Read Also: 443 అడుగుల ఎత్తులో లండన్ అందాలు.. యూకే వెళ్లే వాళ్లు అస్సలు మిస్సవ్వొద్దు!

Related News

ఎసీ లేకుండానే చల్లని రైలు ప్రయాణం.. మొట్ట మొదటి ఏసీ బోగిని ఎలా తయారు చేశారంటే?

443 అడుగుల ఎత్తులో లండన్ అందాలు.. యూకే వెళ్లే వాళ్లు అస్సలు మిస్సవ్వొద్దు!

కళ్లు చెదిరేలా సికింద్రాబాద్ స్టేషన్ మేకోవర్, వరల్డ్ క్లాస్ ట్రాన్స్‌ పోర్ట్ హబ్‌ గా అభివృద్ధి!

ఫ్రీ ఎంఎంటీఎస్ ట్రావెల్ కు నో.. ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించిన రైల్వే బోర్డు!

మెట్రో వ్యవస్థ సేఫ్.. అమీర్ పేట ఫైర్ యాక్సిడెంట్ తర్వాత హెచ్‌ఎంఆర్‌ఎల్ క్లారిటీ!

సముద్ర గర్భంలో సైకిల్ సవారీ.. విశాఖలో అరుదైన సాహసం!

రైల్వే స్టేషన్ బోర్డుపై ‘సముద్ర మట్టం ఎత్తు’ ఎందుకు రాస్తారో తెలుసా? దీని వెనుక రహస్యం ఇదే!

Big Stories

×