E-Paper
Advertisement

First Hydrogen-Powered Train: ఫస్ట్ హైడ్రోజన్ ట్రైన్ వచ్చేస్తోంది, ఒకేసారి ఎంత మందిని తీసుకెళ్తుందంటే?

First Hydrogen-Powered Train: ఫస్ట్ హైడ్రోజన్ ట్రైన్ వచ్చేస్తోంది, ఒకేసారి ఎంత మందిని తీసుకెళ్తుందంటే?

Next-Gen Indian Railways: భారతీయ రైల్వేలోకి వందేభారత్ స్లీపర్ రైళ్లు ఎంట్రీ ఇవ్వబోతున్న నేపథ్యంలో, మరో గుడ్ న్యూస్ వినిపిస్తోంది. ఇండియన్ రైల్వే లో గ్రీన్ రెవల్యూషన్ మొదలు కాబోతోంది. దేశంలో హైడ్రోజన్ తో నడిచే రైలు అందుబాటులోకి రాబోతోంది. జింద్- సోనిపట్ మార్గంలో ఈ రైలు తొలిసారి తన సర్వీసులను అందించబోతోంది. పర్యావరణ హితమైన ప్రయాణాన్ని అందించబోతోంది. నెక్ట్స్ జనరేషన్ రైల్వేకు పునాది వేయబోతోంది. హైడ్రోజన్ రైలుకు సంబంధించిన ఫైనల్ లోడింగ్ టెస్ట్ ఈ వారం జింద్ రైల్వే స్టేషన్‌లో జరుగుతుంది.

జనవరి 26న ట్రయల్ రన్ ప్రారంభం

జనవరి 26 గణతంత్ర దినోవత్సవం సందర్భంగా జింద్- సోనిపట్ మధ్య 90 కి.మీ మార్గంలో ట్రయల్ రన్ ప్రారంభం కానుంది. ట్రయల్ రన్ కోసం రైలు కాన్ఫిగరేషన్‌లో రెండు డ్రైవర్ పవర్ కార్లు, ఎనిమిది ప్యాసింజర్ కోచ్‌లు ఉంటాయి. ట్రయల్ పూర్తయిన తర్వాత, ఇండియన్ రైల్వే, RDSO, స్పానిష్ భాగస్వామి అయిన గ్రీన్ H కంపెనీ కలిసి సంయుక్తంగా ఓ నివేదికను ప్రభుత్వానికి సమర్పించేందుకు రెడీ అవుతున్నాయి. టెస్ట్ పూర్తి అయిన తర్వాత ఈ నివేదిక రెడీ కానుంది. హైడ్రోజన్ పవర్ తో నడిచే రైళ్లు సాంప్రదాయ డీజిల్ తో నడిచే ఇంజిన్ల కంటే మరింత పవర్ తో రెడీ అయ్యాయి. హైడ్రోజన్ పవర్ తో నడిచే రైళ్లు మరింత వేగంగా, పర్యావరణ అనుకూలమైనవిగా ఉంటాయి.

గంటకు 150 కిలో మీటర్ల గరిష్ట వేగంతో..            

హైడ్రోజన్ రైళ్లు గంటకు 150 కి.మీ గరిష్ట వేగంతో నడవనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. హైడ్రోజన్ పవర్ కు సంబంధించి  ఆసక్తికర విషయం చెప్పారు. ఇటీవలి పరీక్షలో ఎలక్ట్రోకెమికల్ టెక్నాలజీని ఉపయోగించి, 9 లీటర్ల వాటర్ 900 గ్రాముల హైడ్రోజన్‌ ను  తయారు చేసినట్లు తెలిపారు. ఇది రైలును ఒక కిలోమీటరు నడపడానికి సరిపోతుంది. రైల్లో   3000 కిలోల హైడ్రోజన్ తీసుకెళ్లే సామర్థ్యం ఉంటుంది. 7,680 కిలోల ఆక్సిజన్‌ను కలిగి ఉంటుంది.

స్పానిష్ సంస్థతో కలిసి హైడ్రోజన్ తయారీ

దేశంలోనే అతిపెద్ద హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రాన్ని జింద్ లో ఏర్పాటు చేశారు. స్పానిష్ సంస్థతో కలిసి భారత ప్రభుత్వం హైడ్రోజన్ ఉత్పత్తి ప్రారంభించింది. 1.5 మెగావాట్ల విద్యుత్ సరఫరాతో, ప్లాంట్ పూర్తిగా పని చేస్తోంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా హడ్రోజన్ ను ఉత్పత్తి చేసేందుకు రెడీ అయ్యింది. ఇప్పటికే ఈ రైలు కోచ్‌లు షకూర్ బస్తీ స్టేషన్‌కు చేరుకున్నాయి. వాటిలో పదహారు ప్యాసింజర్ కోచ్‌లు, నాలుగు డ్రైవర్ పవర్ కార్ కోచ్‌లు ఉన్నాయి. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఈ రైలు బోగీలను తయారు చేసింది.  హైడ్రోజన్ రైలు ఆధునిక మెట్రో వ్యవస్థ మాదిరిగా సేవలు అందించనుంది. ఈ రైల్లో ముందు, వెనుక డ్యూయల్ పవర్ డ్రైవర్ పవర్ కార్లు ఉంటాయి. ఒక్కోటి 1200 HP మోటార్ ఇంజిన్‌ను కలిగి ఉంటాయి. లైట్లు, ఫ్యాన్లు, ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్‌లతో సహా అన్ని ఆన్‌బోర్డ్ సౌకర్యాలకు హైడ్రోజన్ పవర్ నుంచే పని చేస్తాయి. రైలుకు రెండు వైపులా ఆటోమేటిక్ డోర్లు, కంప్యూటరైజ్డ్ ప్యాసింజర్ డిస్ ప్లే సిస్టమ్‌లు ఉంటాయి. స్మార్ట్ డిజైన్‌ తో ఈ రైళ్లు రూపొందాయి.

Read Also: దేశ వ్యాప్తంగా వందేభారత్ స్లీపర్ పరుగులు, ఆ ఒక్క రాష్ట్రంలో తప్ప!

Related News

రైల్వే స్టేషన్ బోర్డుపై ‘సముద్ర మట్టం ఎత్తు’ ఎందుకు రాస్తారో తెలుసా? దీని వెనుక రహస్యం ఇదే!

రిటైర్మెంట్ తర్వాత.. పాత రైళ్లను ఏం చేస్తారో తెలుసా? రూ. కోట్ల బిజినెస్ భయ్యా!

రైలు పట్టాలపై కంకర రాళ్లు ఎందుకు ఉంటాయో తెలుసా? వాటి బెనిఫిట్స్ తెలిస్తే షాకే!

వెయిటింగ్‌ లిస్ట్‌పై కీలక అప్‌డేట్‌… ఇకపై అలా కుదరదు.. ఇవాళ్టి నుంచి మారనున్న రూల్స్

టాయిలెట్ లో ప్లేట్లు కడిగిన రైల్వే సిబ్బంది.. FSSAI సీరియస్, IRCTCకి నోటీసులు!

స్విట్జర్లాండ్‌ ట్రిప్.. తస్మాత్ జాగ్రత్త-లక్ష రెడీ చేసుకోండి.. ఏడాది తర్వాత భారతీయ మహిళకు లక్షన్నర ఫైన్

అక్కడ పెట్రోల్ కంటే వాటర్ బాటిల్ ధర ఎక్కువ.. జీవితంలో ఒక్కసారైనా ఆ అందమైన దేశానికి వెళ్లి రావాల్సిందే!

మీరు వెళ్లాల్సిన రైలు లేటయ్యిందా? డోంట్ వర్రీ.. హ్యాపీగా రైల్వే స్టేషన్ లో ఏసీ రూమ్ బుక్ చేసుకోండి!

Big Stories

×