E-Paper
Advertisement

India – UAE: యుఎఇ టూరిస్టులకు భారత్ గుడ్ న్యూస్, ఇక వీసా లేకుండానే..

India – UAE: యుఎఇ టూరిస్టులకు భారత్ గుడ్ న్యూస్, ఇక వీసా లేకుండానే..

భారత్- యుఎఇ మధ్య దశాబ్దాలుగా మంచి సంబంధాలు కొనసాగుతున్నాయి. ప్రధానిగా నరేంద్రమోడీ అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ సంబంధాలు మరింత బలోపేతం అయ్యాయి. ఈ నేపథ్యంలో కీలకమైన పర్యాటక, వ్యాపార మార్కెట్ అయిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి వచ్చే సందర్శకుల ప్రయాణ నిబంధనలను మరింత సులభతరం చేసింది. ఇందులో భాగంగానే వీసా ఆన్ అరైవల్ (VoA) సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే 6 విమానాశ్రయాల్లో  ఈ సౌకర్యం ఉండగా, ఇప్పుడు మరో మూడు విమానాశ్రయాలకు విస్తరించింది. టూరిజం, వైద్యం, వ్యాపార పర్యటనలకు వచ్చే యుఎఇ ప్రయాణికులకు ఈజీ ఎంట్రీ, తక్కువ ఫార్మాలిటీలు, మరింత సౌలభ్యం ఉండేలా ఈ నిర్ణయం తీసుకుంది.  రెండు దేశాల మధ్య పర్యాటకం, విమాన కనెక్టివిటీ పెరుగుతున్నందున.. VoA నెట్‌ వర్క్ ను విస్తరించింది. చివరి నిమిషంలో హాలీడేస్, వీకెండ్ ట్రిప్స్, కల్చరల్ ఎక్స్ ప్లొరేషన్ ను మరింత పోత్సహించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తుంది. భారత్, యుఎఇ మధ్య ట్రావెల్ కారిడార్ బలోపేతం కానుంది.

మరో మూడు విమానాశ్రయాలకు వీసా ఆన్ అరైవల్ సౌకర్యం

ఇప్పటికే ఆరు ఎయిర్ పోర్టులలో యుఎఇ టూరిస్టులకు వీసా ఆన్ అరైవల్ సౌకర్యం ఉండగా, ఇప్పుడు మరో మూడు ఎయిర్ పోర్టులకు విస్తరించింది. కొచ్చి, కాలికట్, అహ్మదాబాద్ ఎయిర్ పోర్టులలోనూ ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే ఈ లిస్టులో న్యూఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు,  హైదరాబాద్ ఉన్నాయి. మొత్తంగా ఇప్పుడు వీసా ఆన్ అరై వల్ సౌకర్యం ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుల సంఖ్య మొత్తం తొమ్మిదికి చేరింది.

వీసా ఆన్ అరైవల్‌ సౌకర్యాన్ని ఎవరు పొందవచ్చంటే?

వీసా ఆన్ అరైవల్ సౌకర్యాన్ని పొందడానికి యుఎఇ ప్రయాణికులు కొన్ని కండీషన్స్ కు లోబడి ఉండాలి.

⦿ ఇండియన్ ఇ-వీసా, రెగ్యులర్/పేపర్ వీసాను గతంలో పొంది ఉండాలి. వారు దానిని ఉపయోగించి ప్రయాణించకపోయినా ఫర్వాలేదు.

⦿ కనీసం ఆరు నెలల పాటు చెల్లుబాటు అయ్యే పాస్‌ పోర్ట్‌ ను కలిగి ఉండాలి. రెండు ఖాళీ పేజీలతో ఉండాలి.

⦿ పర్యాటకం, వ్యాపారం, సమావేశాలు, మెడికల్ ప్రయోజనాల కోసం, 60 రోజులకు మించకుండా ఉండేందుకు భారత్ కు వచ్చేవారికి అవకాశం ఉంటుంది.

⦿ తల్లిదండ్రులు, తాతా, మామల వ్యక్తులు పాకిస్తాన్‌ లో జన్మించినవారు, శాశ్వత నివాసితులు కాకూడదు. అటువంటి ప్రయాణికులు అబుదాబిలోని భారత రాయబార కార్యాలయం లేదంటే దుబాయ్‌ లోని భారత కాన్సులేట్ జనరల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

⦿ భారత్ కు మొదటిసారి వచ్చే సందర్శకులు రాకముందే ఇ-వీసా కోసం దరఖాస్తు చేసుకోవడం మంచిది.

వీసా ఫీజు, వ్యాలిడిటీ   

భారత వీసా కోసం ప్రయణీకుడికి రూ. 2000 చెల్లించాల్సి ఉంటుంది. పెద్దలు, పిల్లలకు కూడా ఇదే ఛార్జీ విధిస్తారు. ఈ వీసా 60 రోజుల వరకు వ్యాలిడిటీ ఉంటుంది. డబుల్-ఎంట్రీ VoA 60 రోజుల వరకు చెల్లుబాటు అవుతుంది. 60 రోజులలోపు రెండు విజిట్స్ చెయ్యొచ్చు. ఒక వ్యక్తి ఈ సౌకర్యాన్ని ఎన్నిసార్లు పొందవచ్చనే దానిపై ఎటువంటి పరిమితి లేదు.

Read Also: జస్ట్, 7 గంటల్లో ప్రపంచాన్ని చుట్టేసే విమానాన్ని సిద్ధం చేస్తున్న చైనా.. టికెట్ ధర ఎంతంటే?

Related News

సముద్ర గర్భంలో సైకిల్ సవారీ.. విశాఖలో అరుదైన సాహసం!

రైల్వే స్టేషన్ బోర్డుపై ‘సముద్ర మట్టం ఎత్తు’ ఎందుకు రాస్తారో తెలుసా? దీని వెనుక రహస్యం ఇదే!

రిటైర్మెంట్ తర్వాత.. పాత రైళ్లను ఏం చేస్తారో తెలుసా? రూ. కోట్ల బిజినెస్ భయ్యా!

రైలు పట్టాలపై కంకర రాళ్లు ఎందుకు ఉంటాయో తెలుసా? వాటి బెనిఫిట్స్ తెలిస్తే షాకే!

వెయిటింగ్‌ లిస్ట్‌పై కీలక అప్‌డేట్‌… ఇకపై అలా కుదరదు.. ఇవాళ్టి నుంచి మారనున్న రూల్స్

టాయిలెట్ లో ప్లేట్లు కడిగిన రైల్వే సిబ్బంది.. FSSAI సీరియస్, IRCTCకి నోటీసులు!

స్విట్జర్లాండ్‌ ట్రిప్.. తస్మాత్ జాగ్రత్త-లక్ష రెడీ చేసుకోండి.. ఏడాది తర్వాత భారతీయ మహిళకు లక్షన్నర ఫైన్

అక్కడ పెట్రోల్ కంటే వాటర్ బాటిల్ ధర ఎక్కువ.. జీవితంలో ఒక్కసారైనా ఆ అందమైన దేశానికి వెళ్లి రావాల్సిందే!

Big Stories

×