E-Paper

బుల్లెట్ రైలు ప్రాజెక్టులో కొత్త టెక్నాలజీ.. తొలిసారిగా టన్నెల్ హుడ్స్ ఏర్పాటు!

బుల్లెట్ రైలు ప్రాజెక్టులో కొత్త టెక్నాలజీ.. తొలిసారిగా టన్నెల్ హుడ్స్ ఏర్పాటు!
Advertisement

Mumbai-Ahmedabad Bullet Train Project: దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టులో సరికొత్త సాంకేతికతను అమలు చేస్తున్నారు. పర్వత ప్రాంతాల్లో నిర్మించే టన్నెల్స్ దగ్గర ప్రత్యేకంగా రూపొందించిన టన్నెల్ హుడ్స్ ను ఏర్పాటు చేస్తున్నారు. భారతీయ రైల్వే ప్రాజెక్టులో ఈ టెక్నాలజీని ఉపయోగించడం ఇదే తొలిసారి కావడం విశేషం.

ఇంతకీ ఏంటీ టన్నెల్ హుడ్స్?

ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు మార్గం మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో ఉంటుంది. ఈ మార్గంలో మహారాష్ట్రలో ఏడు టన్నెల్స్, గుజరాత్‌ ఓ టన్నెల్ నిర్మిస్తున్నారు. ఈ సొరంగాల రెండు వైపులా టన్నెల్ హుడ్స్‌ ను ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కువ వేగంతో ప్రయాణించే బుల్లెట్ రైలు సొరంగంలోకి వెళ్లినప్పుడు దాని ముందు భాగంలో ఉన్న గాలి ఒక్కసారిగా నెట్టబడుతుంది. దీంతో సొరంగం లోపల గాలి ఒత్తిడి వేగంగా పెరిగి ప్రెజర్ ఏర్పడుతుంది. ఈ తరంగాలు సరైన రీతిలో నియంత్రించకపోతే రైలు సొరంగం నుంచి బయటకు వచ్చినప్పుడు పెద్ద శబ్దం వస్తుంది. ఈ శబ్దాన్ని తగ్గించడంలో టన్నెల్ హుడ్స్ కీలక పాత్ర పోషిస్తాయి. గాలి ఒక్కసారిగా కాకుండా నెమ్మదిగా లోపలికి, బయటికి వెళ్లేలా సహాయపడతాయి. దీంతో గాలి ఒత్తిడిలో వచ్చే ఆకస్మిక మార్పులు తగ్గుతాయి.

Advertisement

టన్నెల్ హుడ్స్‌ లో ప్రత్యేకంగా రూపొందించిన వెంటిలేషన్ ఓపెనింగ్స్, ప్రెజర్ రిలీఫ్ వెంట్స్ ఉంటాయి. రైలు సొరంగంలోకి ప్రవేశించే సమయంలో గాలిలో కొంత భాగం ఈ ఓపెనింగ్స్ ద్వారా బయటకు వెళ్లిపోతుంది. ఫలితంగా పీడన తరంగాల ప్రభావం తగ్గి శబ్దం కూడా కంట్రోల్ లో ఉంటుంది. ప్రయాణికుల సౌకర్యం, భద్రత, చుట్టుపక్కల ప్రాంతాలపై ప్రభావాన్ని తగ్గించడంలో ఈ టన్నెల్ హుడ్స్ కీలకం పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా టన్నెల్స్ నుంచి రైళ్లు బయటకు వచ్చే సమయంలో ఏర్పడే  టన్నెల్ బూమ్ అనే భారీ శబ్దాన్ని తగ్గించడంలో సాయపడుతాయి.

బుల్లెట్ రైళ్లకు వాడే  అడ్వాన్స్ డ్ టెక్నాలజీ

Advertisement

ప్రపంచంలోని జపాన్, ఫ్రాన్స్, చైనా వంటి హై-స్పీడ్ రైలు నెట్‌ వర్క్‌ లు ఉన్న దేశాల్లో ఈ టెక్నాలజీ ఇప్పటికే విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. గంటకు 300 కిలోమీటర్లకు పైగా వేగంతో నడిచే రైళ్లకు టన్నెల్ హుడ్స్ అనేవి కచ్చితంగా ఉండాల్సిందే. ఇప్పుడు ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టులో కూడా ఈ ఆధునిక సాంకేతికతను అమలు చేయడం ద్వారా అంతర్జాతీయ ప్రమాణాలను అనుగుణంగా నిర్మాణం జరుగుతుంది. దీంతో బుల్లెట్ రైలు ప్రయాణం మరింత సురక్షితంగా, నిశ్శబ్దంగా, సౌకర్యవంతంగా మారనుంది.

Read Also: టాటా నుంచి మరో రెండు ఎలక్ట్రిక్ SUVలు.. ప్లాన్ అదిరింది మాస్టారూ!

Related News

రైలు ప్రమాదాల్లో బలవుతున్న గజరాజులు.. ఏడాదిలో ఎన్ని ప్రాణాలు కోల్పోయాయంటే?

రైల్వే స్టేషన్ లో పోలీస్ పరీక్ష అభ్యర్థుల రచ్చ రచ్చ.. టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసు!

టాయిలెట్ దగ్గర నిద్ర నుంచి.. వందేభారత్ ప్రయాణం దాకా.. నెట్టింట సోనూసూద్ వీడియో వైరల్!

విమానం టేకాఫ్ ముందు లైట్లు ఆపేస్తారు.. ఎందుకో తెలుసా?

హైదరాబాద్ To తిరుమల కారవాన్ జర్నీ.. ఒక్కొక్కరికి ఎంత ఖర్చు అవుతుందంటే?

రైలు టికెట్లు బుక్ చేసేవారికి గుడ్ న్యూస్.. కొత్త IRCTC వెబ్‌ సైట్ వస్తోంది!

పనస మొక్క వల్ల రూ.90 వేలు జరిమానా కట్టిన ఎయిర్ ఏషియా, ఎందుకంటే?

×