Indian Railway: పొగమంచు ఎఫెక్ట్ తో పలు రైళ్లను రద్దు చేసినట్లు భారతీయ రైల్వే ప్రకటించింది. రెండు మూడు రోజులుగా తీవ్రంగా పొగమంచు కురవడంతో విజుబులిటీ బాగా తగ్గింది. ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. రైలు నెంబర్. 54327/28 (సీతాపూర్ ప్యాసింజర్), రైలు నెంబర్. 54329/30 (బాలమౌ ప్యాసింజర్), రైలు నెంబర్ 54337/38 (లక్నో ప్యాసింజర్), రైలు నెంబర్ 64175/76 (రోజా-బరేలీ ప్యాసింజర్)ను ఇవాళ క్యాన్సిల్ చేశారు. పొగ మంచు పెరిగిన నేపథ్యంలో ప్రయాణీకులు స్టేషన్ కు వెళ్లే ముందు క్యాన్సిల్ చేసిన రైళ్ల వివరాలను తెలుసుకోవాలని అధికారులు సూచించారు. .
రోజు రోజుకు ఉష్ణోగ్రతలు తగ్గడం, పొగ మంచు పెరగడంతో ముందుజాగ్రత్త చర్యగా ఇండియన్ రైల్వే కీలక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా పలు రైళ్లను డిసెంబర్ 1, 2025 నుంచి ఫిబ్రవరి 28, 2026 వరకు నిలిపివేయనున్నట్ఉల అధికారులుత ఎలిపారు.
⦿ రద్దు చేయబడిన రైళ్లలో సీతాపూర్ ప్యాసింజర్ (54327/28), బాలమౌ ప్యాసింజర్ (54329/30), లక్నో ప్యాసింజర్ (54337/38), రోజా-బరేలీ ప్యాసింజర్ (64175/76) ఉన్నాయి.
⦿ రెండు వీక్లీ రైళ్లు క్యాన్సిల్: కాన్పూర్-కాంతగోడం (12209/10) గరీబ్ రథ్, దిబ్రూగఢ్-చండీగఢ్ రైలు (15903/04) కూడా రెండు నెలల పాటు తన సర్వీసులను నిలిపివేస్తుంది.
⦿ అవధ్ అస్సాం ఎక్స్ ప్రెస్ షెడ్యూల్లో మార్పులు చేశారు. పొగమంచు కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు ప్రకటించారు. రైలు షెడ్యూల్ లో మార్పులను ప్రయాణీకులు గమనించాలని అధికారులు సూచించారు. ఈ రైలు 15909 సోమవారం అందుబాటులో ఉండదు. రైలు 15910 బుధవారం షాజహాన్ పూర్ కు వెళ్లదు. ఈ విషయాన్ని ప్రయాణీకులు గమనించి, అందుకు అనుగుణంగా ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
Read Also: ప్రయాణీకులకు గుడ్ న్యూస్, తిరుపతికి అదనపు రైళ్లు!
దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తగ్గి, పొగమంచు తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రయాణీకులకు రైల్వే అధికారులు కీలక సూచనలు చేశారు. ప్రయాణీకులు రైల్వే స్టేషన్ కు వచ్చే ముందు, తాము వెళ్లే రైళ్ల స్టేటస్ ను తెలుసుకోవాలని సూచించారు. అవసరమైతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
Read Also: సంక్రాంతి స్పెషల్ రైళ్లపై నో అనౌన్స్ మెంట్, ప్రయాణీకుల ఆగ్రహం!