E-Paper
Advertisement

Sankranti Trains: సంక్రాంతి స్పెషల్ రైళ్లపై నో అనౌన్స్ మెంట్, ప్రయాణీకుల ఆగ్రహం!

Sankranti Trains: సంక్రాంతి స్పెషల్ రైళ్లపై నో అనౌన్స్ మెంట్, ప్రయాణీకుల ఆగ్రహం!

సంక్రాంతి పండుగ ఆంధ్ర ప్రదేశ్ లో అత్యంత వైభవంగా జరుగుతుంది. మూడు రోజుల పాటు కన్నుల పండువగా జరిగే వేడుకల కోసం తెలంగాణ ప్రజలు కూడా ఆంధ్రాకు వెళ్తుంటారు. హైదరాబాద్ లో ఉండే ఆంధ్రా ప్రజలు పండుగకు సొంతూళ్లకు బయల్దేరుతారు. సంక్రాంతికి సమయం దగ్గర పడుతున్నా, జంట నగరాల నుంచి వారి స్వస్థలాలకు కుటుంబాలతో వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నా, సంక్రాంతి రైళ్ల గురించి రైల్వే ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రత్యేక రైళ్లను ప్రకటించడంలో సౌత్ సెంట్రల్ రైల్వే నిర్లక్ష్యంగా వ్వవహరిస్తుందని ప్రయాణీకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సికింద్రాబాద్- విశాఖ మధ్య నో స్పెషల్ ట్రైన్స్

ముందస్తు టికెట్ రిజర్వేషన్ వ్యవధి ఇప్పుడు 60 రోజులకు తగ్గించబడింది. సికింద్రాబాద్, విశాఖపట్నం మధ్య చాలా రైళ్లకు భారీ  వెయిట్‌ లిస్ట్ కనిపిస్తోంది. ఈ రైళ్లలో బెర్త్ పొందడం సాధ్యంకావడం లేదు.  అటు SCR విశాఖపట్నంను కాదని,  సికింద్రాబాద్- అనకాపల్లి మధ్య ప్రత్యేక రైళ్లను నడపడం పట్ల ప్రయాణికులు అసంతృప్తి చెందుతున్నారు. ఈ ప్రత్యేక రైళ్లకు తక్కువ ఆదరణ లభిస్తుందని, విశాఖపట్నం జంక్షన్ నుంచి సికింద్రాబాద్ మధ్య రైళ్లు నడిపిస్తే, 100 శాతం ఆక్యుపెన్సీని కలిగి ఉంటాయని చెప్తున్నారు.

Read Also: 300 టన్నుల బంగారంతో సొరంగంలోకి వెళ్లి మాయమైన రైలు, 80 ఏళ్లుగా వెతుకుతూనే ఉన్నారు!

దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్-అనకాపల్లి, చర్లపల్లి-బెర్హంపూర్,  చర్లపల్లి-భువనేశ్వర్ మధ్య ప్రత్యేక రైళ్లను సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌ కు ప్రత్యేక రైళ్లను నడపాలనే డిమాండ్‌ ను పట్టించుకోకపోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే (ECoR) విశాఖపట్నం- సికింద్రాబాద్, తిరుపతి, బెంగళూరుకు ఉన్న ప్రత్యేక రైళ్లను మాత్రమే పొడిగించింది. కానీ, సంక్రాంతికి అదనపు రద్దీ తగ్గించేందుకు  కొత్త స్పెషల్ రైళ్లను ప్రకటించలేదు.

ప్రత్యేక రైళ్లను ముందుగా ప్రకటించాలని లేఖ

పండుగ సీజన్ కు ముందే హైదరాబాద్ నుంచి విశాఖపట్నం జంక్షన్ కు ప్రత్యేక రైళ్లను, సంక్రాంతి తర్వాత తిరిగి వచ్చే రైళ్లను ప్రకటించాలని కోరుతూ.. జోనల్ రైల్వే వినియోగదారుల సంప్రదింపుల కమిటీ (ZRUCC), తూర్పు కోస్ట్ రైల్వే (ECoR) సభ్యుడు కంచుమూర్తి ఈశ్వర్  రైల్వే బోర్డు ఛైర్మన్ కు లేఖ రాశారు.  జనవరి 9 నుంచి 13 వరకు సాధారణ రైళ్లలో ఖాళీలు లేవని చూపించే ఆధారాలను ఆయన సమర్పించారు. రైళ్లలో ఖాళీలు లేనందున, ప్రయాణీకులు అధిక ఛార్జీలు చెల్లించి, తరచుగా రోడ్డు ప్రమాదాల కారణంగా తమ ప్రాణాలను కోల్పోతున్నారని చెప్పారు. ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఆయన లేఖ కాపీలను దక్షిణ మధ్య రైల్వే (SCR), ఈస్ట్ కోస్ట్ రైల్వే (ECoR) జనరల్ మేనేజర్లు,  విశాఖపట్నం ఎంపీ ఎం. శ్రీభరత్ కు కూడా పంపారు. సంక్రాంతి రద్దీకి అనుగుణంగా రైళ్లను నడపడంతో పాటు ఏ రైళ్లు ఎప్పుడు నడుపుతారో ముందే ప్రకటించాలని ఈశ్వర్ కోరారు.

Read Also:  మెట్రో రైలు పైకెక్కి కూర్చున్న కుర్రాడు, గంటల తరబడి సర్వీసులు బంద్..

Related News

రైల్వే స్టేషన్ బోర్డుపై ‘సముద్ర మట్టం ఎత్తు’ ఎందుకు రాస్తారో తెలుసా? దీని వెనుక రహస్యం ఇదే!

రిటైర్మెంట్ తర్వాత.. పాత రైళ్లను ఏం చేస్తారో తెలుసా? రూ. కోట్ల బిజినెస్ భయ్యా!

రైలు పట్టాలపై కంకర రాళ్లు ఎందుకు ఉంటాయో తెలుసా? వాటి బెనిఫిట్స్ తెలిస్తే షాకే!

వెయిటింగ్‌ లిస్ట్‌పై కీలక అప్‌డేట్‌… ఇకపై అలా కుదరదు.. ఇవాళ్టి నుంచి మారనున్న రూల్స్

టాయిలెట్ లో ప్లేట్లు కడిగిన రైల్వే సిబ్బంది.. FSSAI సీరియస్, IRCTCకి నోటీసులు!

స్విట్జర్లాండ్‌ ట్రిప్.. తస్మాత్ జాగ్రత్త-లక్ష రెడీ చేసుకోండి.. ఏడాది తర్వాత భారతీయ మహిళకు లక్షన్నర ఫైన్

అక్కడ పెట్రోల్ కంటే వాటర్ బాటిల్ ధర ఎక్కువ.. జీవితంలో ఒక్కసారైనా ఆ అందమైన దేశానికి వెళ్లి రావాల్సిందే!

మీరు వెళ్లాల్సిన రైలు లేటయ్యిందా? డోంట్ వర్రీ.. హ్యాపీగా రైల్వే స్టేషన్ లో ఏసీ రూమ్ బుక్ చేసుకోండి!

Big Stories

×