E-Paper
Advertisement

రాజధాని ఎక్స్‌ప్రెస్‌లోమంటలు.. బెంబేలెత్తిపోయిన ప్రయాణికులు, అసలేం జరిగింది?

రాజధాని ఎక్స్‌ప్రెస్‌లోమంటలు.. బెంబేలెత్తిపోయిన ప్రయాణికులు, అసలేం జరిగింది?
Advertisement

Rajdhani Express: మధ్యప్రదేశ్‌లోని రత్లాం జిల్లాలో త్రివేండ్రం-నిజాముద్దీన్‌ రాజధాని ఎక్స్‌ప్రెస్‌ లో మంటలు చెలరేగాయి. ఏసీ కోచ్‌ నుంచి భారీగా మంటలు ఎగిసి పడ్డాయి. వెంటనే గమనించిన రైల్వే సిబ్బంది రంగంలోకి దిగారు. మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటన వెనుక అసలేం జరిగింది?

రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు

Advertisement

తిరువనంతపురం–హజ్రత్ నిజాముద్దీన్ రాజధాని ఎక్స్‌ప్రెస్ (12431)లోని ఓ ఏసీ కోచ్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. తొలుత కంపార్ట్‌మెంట్ నుండి పెద్ద ఎత్తున మంటలు రావడం గమనించాడు రైలు గార్డు. వెంటనే లోకో పైలట్‌ను అప్రమత్తం చేశాడు. దీంతో రైలును నిలిపి వేశాడు. ఆ తర్వాత ప్రయాణికులను ఆ బోగీ నుంచి సురక్షితంగా బయటకు తరలించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని రత్లాం జిల్లాలో చోటు చేసుకుంది.

ఘటన సమయంలో ఆ కోచ్‌లో 68 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆదివారం తెల్లవారుజామున దాదాపు ఐదున్నర గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. పశ్చిమ మధ్య రైల్వే కోటా డివిజన్ పరిధిలోని లూని రిచా-విక్రమ్‌గఢ్ అలోట్ స్టేషన్ల మధ్య ఈ ఘటన జరిగింది. ఫైర్ యాక్సిడెంట్ ఘటన గురించి తెలియగానే రైల్వే పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.

Advertisement

బెంబేలెత్తిపోయిన ప్రయాణికులు.. అలర్ట్ అయిన రైల్వే సిబ్బంది

బోగీల్లోని ప్రయాణికులను కిందకు దించి మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. అంతకముందు మంటల బోగీలను రైలు నుంచి వేరు చేశారు రైల్వే సిబ్బంది. అయితే ఎలాంటి ప్రాణనష్టానికి సంబంధించిన వివరాలు తెలియలేదు. ఈ ఘటన నేపథ్యంలో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని అధికారులు చెప్పారు.

షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ప్రమాదం జరిగినట్లు రైల్వే పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై రైల్వే శాఖ విచారణకు ఆదేశించింది. కోటా వరకు ప్రయాణం కోసం ప్రయాణికులకు ఇతర కోచ్‌లలో ఏర్పాట్లు చేసినట్లు రైల్వే శాఖ తెలిపింది. కోటా స్టేషన్‌లో ఒక అదనపు కోచ్‌ను జత చేస్తామని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

ALSO READ:  వాష్‌ రూమ్ పక్కనే భోజనం చేస్తున్న రైల్వే అటెండెంట్.. నిజంగా దారుణం భయ్యా!

 

Related News

విదేశాల్లో పెళ్లిళ్లు వద్దంటూ పిలుపునిచ్చిన మోదీ.. ఇండియాలో సెలెబ్రిటీ వెడ్డింగ్ డెస్టినేషన్స్ ఇవే

అమరావతి ఓవైపు.. ఫ్యూచర్ సిటీ మరోవైపు.. దక్షిణ భారత ముఖచిత్రాన్ని మార్చబోతున్న రెండు మెగా నగరాలు!

రాత్రి 9 తర్వాత నో ఎంట్రీకి చెక్.. శ్రీశైలానికి 24/7 రూట్ క్లియర్!

కారు, మెట్రో కాదు.. ఇంటికి వెళ్లాలంటే నదిలో దూకాల్సిందే!

నేపాల్ వరదల్లో నమ్మశక్యం కాని ఘటనలు.. ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచిన 6 అద్భుతాలు..!

ఒకే బిల్డింగ్‌లో ఊరంతా.. ఈ వింత చూస్తే షాక్ అవ్వాల్సిందే!

గాల్లో తేలే పుస్తకాలు.. చుట్టూ అద్దాల మాయ.. ప్రపంచాన్ని అబ్బురపరుస్తున్న ఫ్యూచరిస్టిక్ లైబ్రరీ!

27 సార్లు గర్భం.. 69 మంది పిల్లలు.. ప్రపంచంలోనే ఎక్కువ మంది పిల్లల్ని కన్న తల్లి ఈమే!

Big Stories

Advertisement
×