E-Paper
Advertisement

రైల్వే ప్రయాణికులు గుడ్ న్యూస్.. నర్సాపుర్-తిరుపతి మధ్య వీక్లీ ఎక్స్‌ప్రెస్

రైల్వే ప్రయాణికులు గుడ్ న్యూస్.. నర్సాపుర్-తిరుపతి మధ్య వీక్లీ ఎక్స్‌ప్రెస్
Advertisement

Narsapur Tirupati Express: రైల్వే శాఖ ప్రయాణికులు గుడ్ న్యూస్ చెప్పింది. ఏప్రిల్ 27వ తేదీ నుంచి నర్సాపూర్–తిరుపతి–నర్సాపూర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించనున్నారు. దీంతో ఏపీలో రైలు కనెక్టివిటీని మరింత పెంచనున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతికి నర్సాపూర్ నుంచి వారానికి ఒకసారి నడిచే కొత్త సర్వీసును ప్రారంభించనున్నారు. కొత్త సర్వీస్ తో రైళ్లు మారాల్సిన అవసరాన్ని, ఎక్కువసేపు వేచి ఉండాల్సిన సమయాన్ని తగ్గించి, ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది. ఈ రూట్ లో ప్రయాణికుల డిమాండ్ పెరుగుతున్నందున.. తిరుపతి వెళ్లే యాత్రికుల కోసం ఈ సర్వీస్ ను ప్రారంభిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

వీక్లీ ఎక్స్‌ప్రెస్ సర్వీస్

నర్సాపూర్-తిరుపతి వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు.. ఏపీలోని ముఖ్య పట్టణాలను కలుపుతూ వారానికి ఒకసారి రెండు వైపులా నడవనుంది. ఈ సర్వీసు ముఖ్యంగా తిరుపతికి వెళ్లే భక్తులకు సేవలు అందించడంతో పాటు, ఈ మార్గంలో సాధారణ ప్రయాణికులకు సౌలభ్యంగా ఉంటుంది.

షెడ్యూల్ ఇదే

Advertisement

ఏప్రిల్ 27న నర్సాపూర్ నుంచి రైలు బయలుదేరుతుంది. అనంతరం ప్రతి ఆదివారం ఈ సర్వీస్ అందుబాటులో ఉంటుంది. తిరుపతి నుంచి తిరుగు ప్రయాణంలో ప్రతి సోమవారం నడపనున్నారు. ఈ ట్రైన్ వీకెండ్ ప్రయాణాలకు అనువుగా ఉంటుంది. కోస్తాంధ్ర నుంచి రాయలసీమ ప్రాంతాలకు డెరెక్ట్ కనెక్టివిటీ పెరిగి, ప్రయాణికులు సులభంగా ప్రయాణాలు సాగించవచ్చు.

తీర్థయాత్రలకు ప్రోత్సాహం

ప్రతి సంవత్సరం తిరుమలకు లక్షలాది మంది భక్తులు ఈ ప్రాంతం నుంచి వెళ్తుంటారు. నర్సాపూర్ నుంచి తిరుపతి వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలుతో.. పశ్చిమ గోదావరి, సమీప ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులు రైళ్లు మారకుండానే తిరుపతి పట్టణానికి చేరుకోవడం సులభతరం అవుతుంది.

Advertisement

Also Read:  టూరిస్టులకు గుడ్ న్యూస్, ఐదేళ్ల తర్వాత వనరాణి మళ్లీ ప్రారంభం!

Related News

పిల్లల చదువుల కోసం పర్వతానికి లిఫ్ట్.. 3 గంటల ప్రయాణం ఇక 30 నిమిషాలే!

జస్ట్ 4.5 గంటల్లో 1,170 కిమీ ప్రయాణం.. బుల్లెట్ రైలు జోష్ మామూలుగా లేదుగా!

నమో భారత్‌కు ఇక సూర్యుడి పవర్.. ఇండియన్ రైల్వే ప్లాన్ అదిరింది భయ్యా!

ఎక్స్‌ ప్రెస్‌ వేపై ఫ్యామిలీ పిక్నిక్.. అసలు అక్కడ ఏం జరిగిందంటే?

జొన్నగిరిలో రూ.లక్షల కోట్ల విలువైన బంగారం.. ఏపీ దశ తిరిగినట్టేనా?

అమరావతిలో మినీ అమెజాన్.. ఐదు ఎకరాల్లో అద్భుత వర్షారణ్యం!

మహాభారత ఆనవాళ్లు.. బౌద్ధ మహాస్తూపం.. రామదాసు జన్మస్థలం.. ఈ ఊరి కథ తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఎలాన్ మస్క్ ఫ్లయింగ్ ప్యాలెస్.. ఈ జెట్‌లోని ఫీచర్లు తెలిస్తే పరేషాన్ కావాల్సిందే!

Big Stories

Advertisement
×