Narsapur Tirupati Express: రైల్వే శాఖ ప్రయాణికులు గుడ్ న్యూస్ చెప్పింది. ఏప్రిల్ 27వ తేదీ నుంచి నర్సాపూర్–తిరుపతి–నర్సాపూర్ వీక్లీ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించనున్నారు. దీంతో ఏపీలో రైలు కనెక్టివిటీని మరింత పెంచనున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతికి నర్సాపూర్ నుంచి వారానికి ఒకసారి నడిచే కొత్త సర్వీసును ప్రారంభించనున్నారు. కొత్త సర్వీస్ తో రైళ్లు మారాల్సిన అవసరాన్ని, ఎక్కువసేపు వేచి ఉండాల్సిన సమయాన్ని తగ్గించి, ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది. ఈ రూట్ లో ప్రయాణికుల డిమాండ్ పెరుగుతున్నందున.. తిరుపతి వెళ్లే యాత్రికుల కోసం ఈ సర్వీస్ ను ప్రారంభిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
నర్సాపూర్-తిరుపతి వీక్లీ ఎక్స్ప్రెస్ రైలు.. ఏపీలోని ముఖ్య పట్టణాలను కలుపుతూ వారానికి ఒకసారి రెండు వైపులా నడవనుంది. ఈ సర్వీసు ముఖ్యంగా తిరుపతికి వెళ్లే భక్తులకు సేవలు అందించడంతో పాటు, ఈ మార్గంలో సాధారణ ప్రయాణికులకు సౌలభ్యంగా ఉంటుంది.
ఏప్రిల్ 27న నర్సాపూర్ నుంచి రైలు బయలుదేరుతుంది. అనంతరం ప్రతి ఆదివారం ఈ సర్వీస్ అందుబాటులో ఉంటుంది. తిరుపతి నుంచి తిరుగు ప్రయాణంలో ప్రతి సోమవారం నడపనున్నారు. ఈ ట్రైన్ వీకెండ్ ప్రయాణాలకు అనువుగా ఉంటుంది. కోస్తాంధ్ర నుంచి రాయలసీమ ప్రాంతాలకు డెరెక్ట్ కనెక్టివిటీ పెరిగి, ప్రయాణికులు సులభంగా ప్రయాణాలు సాగించవచ్చు.
ప్రతి సంవత్సరం తిరుమలకు లక్షలాది మంది భక్తులు ఈ ప్రాంతం నుంచి వెళ్తుంటారు. నర్సాపూర్ నుంచి తిరుపతి వీక్లీ ఎక్స్ప్రెస్ రైలుతో.. పశ్చిమ గోదావరి, సమీప ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులు రైళ్లు మారకుండానే తిరుపతి పట్టణానికి చేరుకోవడం సులభతరం అవుతుంది.
Also Read: టూరిస్టులకు గుడ్ న్యూస్, ఐదేళ్ల తర్వాత వనరాణి మళ్లీ ప్రారంభం!