E-Paper
Advertisement

పాకిస్తాన్ కంటే దారుణమైన ఫీల్డింగ్..సింపుల్ ర‌నౌట్, కానీ మిస్ చేసిన LSG ప్లేయ‌ర్లు

పాకిస్తాన్ కంటే దారుణమైన ఫీల్డింగ్..సింపుల్ ర‌నౌట్, కానీ మిస్ చేసిన LSG ప్లేయ‌ర్లు
Advertisement

LSG VS RR: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో  (Indian Premier League 2026 Tournament) భాగంగా ఇవాళ మరో కీలక మ్యాచ్ జరుగుతోంది. లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య భారతరత్న శ్రీ అటల్ బీహార్ వాజ్పేయి స్టేడియం వేదికగా ఈ బిగ్ ఫైట్ నిర్వహిస్తున్నారు. అయితే ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆర్ వికెట్ల నష్టానికి 159 పరుగులు వచ్చేసింది. రవీంద్ర జడేజా రనౌట్ మిస్ అయిన నేపథ్యంలో ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది రాజస్థాన్ రాయల్స్. లేకపోతే 120 పరుగుల లోపే ఆలౌట్ అయ్యేది.

Also Read: Rohit Sharma Fitness Video : గంట‌కు 100 Push-Ups..రోహిత్ శ‌ర్మ 2.0 మాములుగా లేదు, గూస్ బంప్స్ రావాల్సిందే

పాకిస్తాన్ కంటే దారుణం.. లక్నో ప్లేయర్ల ఫీల్డింగ్ పై ట్రోల్స్

Advertisement

లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ( Lucknow Super Giants vs Rajasthan Royals ) మధ్య ఇవాళ మ్యాచ్ జరగగా మొదట బ్యాటింగ్ రియాన్ పరాగ్ సేన చేసింది. ఈ సందర్భంగా రాజస్థాన్ ఆటగాళ్లు ఎవరు కూడా పెద్దగా రాణించలేదు. కానీ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా మాత్రం 29 బంతుల్లో 43 పరుగులు సాధించాడు. అయితే రవీంద్ర జడేజాను రనౌట్ చేసే అవకాశం వచ్చినా కూడా చేజేతులా పోగొట్టుకుంది లక్నో సూపర్ జెయింట్స్. ఈ మ్యాచ్ లో రవీంద్ర జడేజా, డోనోవన్ ఫెరీరా ఇద్దరూ బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో రనౌట్ ఛాన్స్ మిస్ చేసుకుంది లక్నో. రవీంద్ర జడేజా…నికోలస్ పూరన్ వైపు భారీ షాట్ ఆడాడు. ఈ క్రమంలో ఇద్దరు బ్యాటర్ల మధ్య మిస్ కమ్యూనికేషన్ చోటు చేసుకుంది.

దీంతో జడేజా, డోనోవన్ ఫెరీరా ఇద్దరు బౌలర్ ఎండు వైపు ప‌రుగెత్తారు. ఈ తరుణంలోనే నికోలస్ పూరన్ వేసిన త్రో ను అందుకోబోయి, బెయిల్స్ ప‌డేసి డైవ్ కొట్టాడు రిష‌బ్ పంత్. ఆ త‌ర్వాత అల‌ర్ట్ అయిన ముకుల్ చౌద‌రీ కూడా ర‌నౌట్ చేసే ప్ర‌య‌త్నం చేశాడు. కానీ అప్ప‌టికే ఫెరీరా క్రీజులోకి చేరారు. బెయిల్స్ ప‌డ‌క‌పోయి ఉంటే, క‌చ్చితంగా ముకుల్ చౌద‌రీ ర‌నౌట్ చేసేవాడు. పంత్, పురన్ చేసిన ప‌ని వ‌ల్ల ర‌నౌట్ మిస్ అయింది. ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో వైర‌ల్ గా మారింది. దీనిపై దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. పాకిస్తాన్ ఫీల్డ‌ర్ల లాగానే లక్నో ప్లేయర్లు త‌యార‌య్యార‌ని సెటైర్లు పేల్చుతున్నారు.

కీలకంగా మారిన రవీంద్ర జడేజా 43 పరుగులు

Advertisement

రనౌట్ మిస్సయిన నేపథ్యంలో రవీంద్ర జడేజా ఆచితూచి బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలోనే జట్టుకు భారీ స్కోర్ అందించాడు. ఈ మ్యాచ్ ల‌లో 29 బంతులు ఎదుర్కొన్న రవీంద్ర జడేజా 43 పరుగులతో రెచ్చిపోయాడు. ఇందులో ఒక శిక్ష అలాగే రెండు బౌండరీలు ఉన్నాయి. ఈ 43 పరుగులే రాజస్థాన్ రాయల్స్ ను గెలిపించేలా క‌నిపిస్తున్నాయి.

Also Read: Chris Gayle Controversal Comments ON PBKS: చిన్నపిల్లాడిని చేసిన న‌ర‌కం చూపించారు…పంజాబ్ ఓన‌ర్లు దుర్మార్గులు

 

 

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

 

Related News

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

Big Stories

Advertisement
×