E-Paper
Advertisement

నేపాల్ వరదల్లో నమ్మశక్యం కాని ఘటనలు.. ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచిన 6 అద్భుతాలు..!

నేపాల్ వరదల్లో నమ్మశక్యం కాని ఘటనలు.. ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచిన 6 అద్భుతాలు..!
Advertisement

Nepal Flood Survivors: ప్రకృతి విపత్తు సంభవించినప్పుడు ముందుగా కళ్లముందు మెదిలేవి విధ్వంసం, ఆవేదన మాత్రమే. కానీ అటువంటి విషాద సమయంలోనూ కొన్ని అద్భుతాలు చోటుచేసుకుంటాయి. నిరాశ పూరిత పరిస్థితుల్లోనూ ఆశల వెలుగులు నింపుతాయి. నేపాల్‌లో ఇటీవల సంభవించిన అకస్మిక వరదలు.. తన పరిధిలోని ఇళ్లను, మనుషులను తుడిచిపెట్టేశాయి. అయితే సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చిన కొన్ని ఘటనలు ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ప్రకృతి విధ్వంసాన్ని తట్టుకొని ప్రాణాలతో బయటపడిన ఆరు అద్భుతమైన సంఘటనలను ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

ప్రవాహ హోరులో చెక్కుచెదరని ఇల్లు

నువాకోట్‌లోని త్రిశూలి నది ఉగ్రరూపం దాల్చి ఉప్పొంగినప్పుడు 40 ఏళ్ల ప్రకాష్ తన ఇంటిని వరద చుట్టుముట్టడం చూసి ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యాడు. చుట్టుపక్కల వాహనాలు, భవనాలు ప్రవాహంలో కొట్టుకుపోతున్నా ఆ ఇల్లు మాత్రం చెక్కుచెదరకుండా నిలబడింది. కుటుంబ సభ్యులు కొద్ది గంటల పాటు ఆ ఇంట్లోనే చిక్కుకుపోగా నీటిమట్టం స్వల్పంగా తగ్గగానే స్థానికులు వచ్చి వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. చుట్టూ వినాశనం కనిపిస్తున్నా దానికి అడ్డంగా నిలబడిన ఆ ఇల్లు.. ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

ప్రాణాలతో బయటపడిన బాలిక

Advertisement

రసువా జిల్లా తిమురే ప్రాంతంలో వరద విధ్వంసం తర్వాత సహాయక చర్యల్లో పాల్గొన్న పోలీసులకు శిథిలాల కింద నుంచి ఏడుపు శబ్దం వినిపించింది. తవ్వి చూడగా మూడ్రోజుల పాటు బురద, రాళ్ల కిందే చిక్కుకుపోయిన ఆరేళ్ల చిన్నారి ప్రాణాలతో కనిపించింది. రెస్క్యూ టీమ్ ఆ పాపను సురక్షితంగా బయటకు తీసి మెరుగైన వైద్యం కోసం విమానంలో ఖాట్మండుకు తరలించింది.

చెట్టుని పట్టుకొని.. ప్రాణాలు నిలుపుకొని..

విదూర్ ప్రాంతంలో పనిచేసే ఒక నిరుపేద కూలీ వరద ప్రవాహంలో కొట్టుకుపోకుండా ఉండటానికి సమీపంలోని ఒక మామిడి చెట్టును గట్టిగా పట్టుకుని గంటల తరబడి గడిపాడు. ప్రవాహం నుంచి తప్పించుకోవడానికి అతను చేసిన ఈ సాహసం.. ఆ సమయంలో ప్రజలు ప్రాణాలను కాపాడుకోవడానికి పడిన వేదనకు అద్దం పడుతోంది. ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటున్న అతను.. ఆ భయానక రాత్రిని గుర్తు చేసుకుంటూ శివుడే తనను కాపాడాడని తెలిపాడు.

1,643 మంది విద్యార్థులను కాపాడిన హెడ్ మాస్టర్

Advertisement

త్రిశూలి లోయలోని ఒక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజేంద్ర దావాడి.. తన సమయస్ఫూర్తి ఏకంగా 1,643 మంది పిల్లల ప్రాణాలతో కాపాడాడు. అకస్మిక వరద తన పాఠశాల వైపు దూసుకొస్తోందని తెలుసుకున్న ఆయన.. క్షణం కూడా ఆలస్యం చేయకుండా సైరన్ మోగించి పిల్లలందరినీ సురక్షిత ప్రాంతానికి తరలించారు. వారు స్కూల్ నుంచి బయటకు వచ్చిన కొద్దిసేపటికే భవనం వరద నీటిలో కొట్టుకుపోయింది.

బిడ్డల కోసం ప్రాణాలకు తెగించిన తల్లి

వరద ప్రవాహం వేగంగా పెరుగుతుండటంతో ఒక తల్లి తన ఇద్దరు పిల్లలను రక్షించుకోవడానికి నడిరోడ్డుపై పరుగులు తీసింది. ఆ క్రమంలో ఆమె కిందపడిపోయినప్పటికీ వెంటనే తేరుకుని పిల్లలను గట్టిగా పట్టుకుని సురక్షిత ప్రాంతం వైపు పరిగెత్తింది. ప్రకృతి కోపానికి ఎదురొడ్డి తన పిల్లలను కాపాడుకున్న ఆ తల్లి ఆరాటం ప్రతి ఒక్కరినీ కదిలించింది.

Also Read: కరెన్సీ నోట్లపై గీతలకు ఇంత అర్థముందా? ఇన్నాళ్లు పిచ్చి గీతలు అనుకున్నామే..!

శిథిలాల్లో దొరికిన నెలన్నర పసికందు

రసువాలోని తీవ్ర ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతుండగా రెస్క్యూ బృందాలకు ఒక నెలన్నర వయసున్న పసికందు కనిపించింది. భయంకరమైన వరదను తట్టుకుని ప్రాణాలతో బయటపడిన ఆ చిన్నారిని రెస్క్యూ టీమ్ అత్యంత జాగ్రత్తగా సహాయక శిబిరానికి తరలించింది. ఆ పసిపాప నవ్వు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిలో కొండంత ఆశను నింపింది.

Also Read: మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

 

Tags

Related News

రాత్రి 9 తర్వాత నో ఎంట్రీకి చెక్.. శ్రీశైలానికి 24/7 రూట్ క్లియర్!

కారు, మెట్రో కాదు.. ఇంటికి వెళ్లాలంటే నదిలో దూకాల్సిందే!

ఒకే బిల్డింగ్‌లో ఊరంతా.. ఈ వింత చూస్తే షాక్ అవ్వాల్సిందే!

గాల్లో తేలే పుస్తకాలు.. చుట్టూ అద్దాల మాయ.. ప్రపంచాన్ని అబ్బురపరుస్తున్న ఫ్యూచరిస్టిక్ లైబ్రరీ!

27 సార్లు గర్భం.. 69 మంది పిల్లలు.. ప్రపంచంలోనే ఎక్కువ మంది పిల్లల్ని కన్న తల్లి ఈమే!

క్లియోపాత్రా అందానికి ప్రపంచమే ఫిదా.. ఇంతకీ ఆమె సౌందర్య రహస్యం ఏంటో తెలుసా?

లాంగ్ హాలిడే అవసరం లేదు.. 2 రోజుల్లో వీకెండ్ ఎంజాయ్ చేయగల 7 బెస్ట్ డెస్టినేషన్స్

Big Stories

Advertisement
×