E-Paper
Advertisement

River: మనదేశంలో 5 రాష్ట్రాల నుంచి ప్రవహించే ఒకే ఒక నది ఏదో తెలుసా?

River: మనదేశంలో 5 రాష్ట్రాల నుంచి ప్రవహించే ఒకే ఒక నది ఏదో తెలుసా?

మన దేశంలో ఎన్నో వందల నదులు ఉన్నాయి. కానీ వాటిలో అతి ముఖ్యమైనది, ప్రధానమైనది గంగానది. దీని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నదిని దైవంతో సమానం చూసే నమ్మకం మనది. అందుకే గంగా కేవలం ఒక నది మాత్రమే కాదు, ఒక దేవద. కోట్లాది మంది ప్రజల జీవనాధారం. తాగునీరు, వ్యవసాయం, చేపల వేట, యాత్రలు… ఇలా ఎన్నో రకాలుగా గంగానదిపై మనం ఆధారపడి బతుకుతున్నాం. అందుకే చాలా మంది గంగాను పవిత్రంగా భావిస్తారు. గంగానది దగ్గర జరిగే పూజలు, స్నానాలు, పండుగలు దేశ సంస్కృతిలో చాలా ముఖ్యమైన భాగంగా మారాయి. ఉత్తర భారతదేశంలో గంగా లేకుండా జీవితం ఊహించలేమని అక్కడి ప్రజలు చెబుతుంటారు.

గంగానది పేరు ఎలా?
గంగానది ప్రయాణం కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇది హిమాలయాల్లోని గంగోత్రి అనే మంచు కొండల దగ్గర ప్రారంభమవుతుంది. మొదట భగీరథి అనే పేరుతో ప్రవహిస్తుంది. తర్వాత దేవప్రయాగ వద్ద ఆలకనంద అనే మరో నదితో కలిసిన తర్వాతే దానికి గంగానది అనే పేరు వస్తుంది. అక్కడి నుంచి ఉత్తరాఖండ్ నుంచి బయలుదేరి ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ ఇలా మొత్తం ఐదు రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ చివరకు బంగాళాఖాతంలో కలుస్తుంది. దాదాపు 2,500 కిలోమీటర్లకుపైగా ప్రయాణం చేసే ఈ నది మార్గంలో కోట్లాది మంది ప్రజలకు జీవనాధారం అవుతోంది.

Also read: Potato Halwa: బంగాళాదుంపలతో చేసే టేస్టీ హల్వా, తక్కువ పదార్థాలతో ఇంట్లో చేసే రుచికరమైన స్వీట్

అతి పెద్ద డెల్టా
గంగానది ప్రత్యేకతలు కూడా చాలా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ ప్రాంతానికి చేరుకున్నాక ఈ నది రెండు భాగాలుగా విడిపోతుంది. ఒక భాగం హుగ్లీగా కోల్‌కతా వైపు వెళ్తే, ఇంకొక భాగం పద్మగా బంగ్లాదేశ్ వైపు సాగుతుంది. బీహార్‌లోని పాట్నా దగ్గర గంగానది చాలా లోతుగా ఉంటుంది. కొన్ని చోట్ల 100 అడుగులకు పైగా లోతు ఉందని చెబుతారు. గంగా, బ్రహ్మపుత్ర నదులు కలిసి సుందర్బన్స్ అనే ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టాను ఏర్పరుస్తాయి. అక్కడ ఉన్న అడవులు, పులులు, పక్షులు ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులను ఆకర్షిస్తాయి. అంతేకాదు, గంగానదిలో కనిపించే గంగేటిక్ డాల్ఫిన్ అనే అరుదైన జంతువు కూడా ఈ నదికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది.

Also read: Ginger Prawns: జింజర్ ప్రాన్స్.. ఇలా చేస్తే ప్లేటు ఖాళీ అవ్వాల్సిందే, రెసిపీ ఇదిగో

పర్యాటకంగా చూసినా గంగానది చాలా ముఖ్యమైనది. హరిద్వార్, రిషికేశ్, వారణాసి వంటి పట్టణాలు గంగానది వల్లే ప్రపంచానికి తెలిసాయి. ప్రతి రోజు సాయంత్రం జరిగే గంగా హారతి చూడటానికి వేలాది మంది చేరుతారు. ప్రయాగ్‌రాజ్‌లో జరిగే కుంభమేళా సమయంలో లక్షల మంది ఒకేసారి గంగలో స్నానం చేస్తారు. రైతులకు పంటలకు నీరు అందించడం నుంచి పర్యాటక రంగానికి ఆదాయం రావడం వరకు గంగానది పాత్ర చాలా పెద్దది. అందుకే గంగానది గురించి మాట్లాడినప్పుడు అది కేవలం ఒక నది కథ కాదు… మన దేశ చరిత్ర, సంస్కృతి, జీవన విధానం అన్నీ కలిసిన ఒక చరిత్ర.

Related News

రైల్వే స్టేషన్ బోర్డుపై ‘సముద్ర మట్టం ఎత్తు’ ఎందుకు రాస్తారో తెలుసా? దీని వెనుక రహస్యం ఇదే!

రిటైర్మెంట్ తర్వాత.. పాత రైళ్లను ఏం చేస్తారో తెలుసా? రూ. కోట్ల బిజినెస్ భయ్యా!

రైలు పట్టాలపై కంకర రాళ్లు ఎందుకు ఉంటాయో తెలుసా? వాటి బెనిఫిట్స్ తెలిస్తే షాకే!

వెయిటింగ్‌ లిస్ట్‌పై కీలక అప్‌డేట్‌… ఇకపై అలా కుదరదు.. ఇవాళ్టి నుంచి మారనున్న రూల్స్

టాయిలెట్ లో ప్లేట్లు కడిగిన రైల్వే సిబ్బంది.. FSSAI సీరియస్, IRCTCకి నోటీసులు!

స్విట్జర్లాండ్‌ ట్రిప్.. తస్మాత్ జాగ్రత్త-లక్ష రెడీ చేసుకోండి.. ఏడాది తర్వాత భారతీయ మహిళకు లక్షన్నర ఫైన్

అక్కడ పెట్రోల్ కంటే వాటర్ బాటిల్ ధర ఎక్కువ.. జీవితంలో ఒక్కసారైనా ఆ అందమైన దేశానికి వెళ్లి రావాల్సిందే!

మీరు వెళ్లాల్సిన రైలు లేటయ్యిందా? డోంట్ వర్రీ.. హ్యాపీగా రైల్వే స్టేషన్ లో ఏసీ రూమ్ బుక్ చేసుకోండి!

Big Stories

×