Laptop Under Rs 30,000: ప్రస్తుత సాంకేతిక యుగంలో ప్రతీ పని కంప్యూటర్, ల్యాప్ టాప్ చుట్టూనే తిరుగుతోంది. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, కంటెంట్ క్రియేటర్లు ఇలా ప్రతీఒక్కరూ తమ రోజూవారి కార్యక్రమాల కోసం ల్యాప్ టాప్ మీదనే ఆధారపడుతున్నారు. ప్రస్తుతం మార్కెట్ లో అనేక రకాల ల్యాప్ టాప్స్ అందుబాటులో ఉన్నాయి. అద్భుతమైన పనితీరు కనబరిచే ల్యాప్ టాప్ కావాలంటే రూ.45,000 వరకూ ఖర్చు చేయాల్సిందే. అయితే రూ.45 విలువ కలిగిన Asus Vivobook Go 15 ల్యాప్ టాప్ భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది.
Asus Vivobook Go 15 ల్యాప్ టాప్ పై ప్రస్తుతం స్విగ్గీ ఇన్ స్టామార్ట్ (Swiggy Instamart)లో రూ.15 వేల వరకూ రాయితీ లభిస్తోంది. రూ.29,990కే ల్యాప్ అందుబాటులో ఉంది. ఒకసారి ఆర్డర్ చేస్తే కేవలం 5 నిమిషాల్లోనే ల్యాప్ టాప్ మీ గుమ్మం ముందుకు వచ్చేస్తుంది. కొత్త ల్యాప్ టాప్ తీసుకోవాలని భావిస్తున్న వారికి ఇదే మంచి ఛాన్స్ అని టెక్ నిపుణులు చెబుతున్నారు.
ఆసుస్ వివోబుక్ గో 15 ఫీచర్లను పరిశీలిస్తే.. ఇది మోడరన్ డిజైన్, స్లిమ్ లుక్ తో 1.63 కిలోల బరువు మాత్రమే కలిగి ఉంది. ఫలితంగా దీనిని తేలిగ్గా క్యారీ చేయవచ్చు. ఈ ల్యాప్ టాప్ 250 నిట్స్ బ్రైట్నెస్తో 15.6 అంగుళాల ఫుల్ HD డిస్ప్లేను కలిగి ఉంది. AMD రైజెన్ 3 7320U ప్రాసెసర్తో పని చేస్తుంది. ఇది 8GB LPDDR5 RAM, 512GB SSD స్టోరేజ్ సామర్థ్యంతో అందుబాటులో ఉంది.
Windows 11 హోమ్ ప్రీ ఇన్ స్టాల్ తో ఈ ల్యాప్ టాప్ లభిస్తుంది. ఇందులో ఎంఎస్ ఆఫీసు సౌకర్యం కూడా ఉంది. కనెక్టివిటీ విషయానికి వస్తే USB టైప్ A, టైప్ C పోర్ట్లు, Wi Fi 6E సపోర్ట్, బ్లూటూత్ 5.0, గోప్యత కోసం షట్టర్ తో కూడిన HD వెబ్క్యామ్ ఉన్నాయి.
Also Read: Bharat Taxi: భారత్ ట్యాక్సీ లాంచ్.. ఓలా, ఉబర్ దోపిడికి చెక్.. 30% తక్కువ ఖర్చుతో ప్రయాణం!
ఆఫీసు వర్క్, ఆన్ లైన్ క్లాసులు, వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం ఈ ల్యాప్ టాప్ ఎంతో ప్రయోజనకరంగా ఉండనుంది. ఈ ల్యాప్ టాప్ లోని Ryzen 3 ప్రాసెసర్ రోజువారీ పనులను స్మూత్ గా వేగంగా చేసేందుకు ఉపయోగపడుతుంది. 15.6 అంగుళాల స్క్రీన్.. ప్రజెంటేషన్స్ కోసం అనుకూలంగా ఉండనుంది. ఎక్కువ సేపు టైప్ చేసేందుకు వీలుగా ఈ ల్యాప్ టాప్ కీబోర్డ్ డిజైన్ ఉందని కంపెనీ వర్గాలు తెలిపాయి.