E-Paper

రన్నింగ్ ట్రైన్లో దోపిడీ యత్నం.. రైల్వే పోలీసుల కాల్పులు..

రన్నింగ్ ట్రైన్లో దోపిడీ యత్నం.. రైల్వే పోలీసుల కాల్పులు..
Advertisement

Sarkar Express Loot Attempt: బాపట్ల జిల్లాలో రన్నింగ్ రైలులో దోపిడీ దొంగలు రెచ్చిపోయిన ఘటన కలకలం రేపింది. చెంగల్పట్టు నుంచి కాకినాడ వైపు వెళ్తున్న సర్కార్ ఎక్స్‌ ప్రెస్ రైలు లక్ష్యంగా దుండగులు దోపిడీకి పాల్పడటంతో ప్రయాణికుల్లో భయాందోళన నెలకొంది. ఈ ఘటన రైలు బాపట్ల–అప్పికట్ల స్టేషన్ల మధ్య ప్రయాణిస్తున్న సమయంలో జరిగింది.

స్లోగా వెళ్తుండగా రైలు ఎక్కిన దుండగులు

రైలు సాధారణ వేగంతో ముందుకు వెళ్తుండగా, కొంతమంది దుండగులు రైలు బోగీల్లోకి ప్రవేశించారు. నిద్రలో ఉన్న ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని వారి దగ్గర ఉన్న బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులను దొంగిలించేందుకు ప్రయత్నించారు. మొదట్లో ఎవరికీ ఏమి జరుగుతుందో అర్థం కాకపోవడంతో కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడింది. కొద్దిసేపటికే కొందరు ప్రయాణికులు దోపిడిని గమనించి అప్రమత్తమయ్యారు. దొంగలను గుర్తించి గట్టిగా కేకలు వేస్తూ ప్రతిఘటించారు. ఇతర ప్రయాణికులు కూడా వెంటనే మేల్కొని దొంగలను అడ్డుకునే ప్రయత్నం చేశారు.

చైన్ లాగి పారిపోయిన దొంగలు

Advertisement

ఊహించని ప్రతిఘటనతో దొంగలు కొంతసేపు తడబడిపోయారు. పరిస్థితి తీవ్రంగా మారుతుండటంతో భయపడిన దుండగులు వెంటనే రైలు చైన్ లాగి రైలును ఆపేశారు. రైలు ఆగిన వెంటనే బోగీల నుంచి దూకి సమీప ప్రాంతాల్లోకి పరారయ్యేందుకు ప్రయత్నించారు. చీకటి సమయం కావడంతో చుట్టుపక్కల పరిస్థితులు స్పష్టంగా కనిపించకపోవడంతో దొంగలు సులభంగా తప్పించుకున్నారు.

ఈ సమయంలో రైలులో ఉన్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కొంతమంది మహిళా ప్రయాణికులు ఆభరణాలు కాపాడుకునే ప్రయత్నంలో కంగారు పడ్డారు. కొందరు తాము వెంట తెచ్చుకున్న వస్తువులు పోయాయని  ఆందోళన వ్యక్తం చేశారు. రైలు ఆగిన తర్వాత కొంతసేపు గందరగోళ వాతావరణం నెలకొంది.

దొంగలపై పోలీసులు కాల్పులు

Advertisement

ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు వెంటనే స్పందించారు. సంఘటన జరిగిన ప్రాంతానికి చేరుకున్న పోలీసులు దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నించారు. అప్పటికే దుండగులు చీకటిని ఆసరాగా చేసుకుని అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోయారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు కొంత దూరం వరకు వెంబడించినట్లు సమాచారం. ఈ క్రమంలో రైల్వే పోలీసులు దుండగులపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. అయితే, చీకటి కారణంగా దొంగలు తప్పించుకుని పారిపోయినట్లు అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

దర్యాప్తు మొదలుపెట్టిన రైల్వే పోలీసులు

దొంగల గ్యాంగ్ గురించి వివరాలు సేకరించేందుకు సమీప గ్రామాలు, స్టేషన్ల దగ్గర పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. సీసీటీవీ ఫుటేజ్, ప్రయాణికుల వాంగ్మూలాల ఆధారంగా దుండగులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.  ఇది ప్లాన్ ప్రకారం జరిగిన దోపిడీనా? లేక అప్పటికప్పుడు అనుకొని చేశారా? అనే కోణంలో విచారణ జరుగుతోంది. త్వరలోనే దుండగులను పట్టుకుంటామని, కేసును త్వరగా చేదిస్తామని పోలీసులు వెల్లడించారు.

Read Also: చెన్నై-తిరుపతి మార్గంలో 8 రైళ్లు రద్దు.. ఎన్ని రోజులు అంటే?

Related News

చెన్నై-తిరుపతి మార్గంలో 8 రైళ్లు రద్దు.. ఎన్ని రోజులు అంటే?

బుల్లెట్ రైలు ప్రాజెక్టులో కొత్త టెక్నాలజీ.. తొలిసారిగా టన్నెల్ హుడ్స్ ఏర్పాటు!

రైలు ప్రమాదాల్లో బలవుతున్న గజరాజులు.. ఏడాదిలో ఎన్ని ప్రాణాలు కోల్పోయాయంటే?

రైల్వే స్టేషన్ లో పోలీస్ పరీక్ష అభ్యర్థుల రచ్చ రచ్చ.. టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసు!

టాయిలెట్ దగ్గర నిద్ర నుంచి.. వందేభారత్ ప్రయాణం దాకా.. నెట్టింట సోనూసూద్ వీడియో వైరల్!

విమానం టేకాఫ్ ముందు లైట్లు ఆపేస్తారు.. ఎందుకో తెలుసా?

హైదరాబాద్ To తిరుమల కారవాన్ జర్నీ.. ఒక్కొక్కరికి ఎంత ఖర్చు అవుతుందంటే?

×