E-Paper
Advertisement

ఏఐ వీడియో కలకలం.. అంబటి రాంబాబుపై సీఐడీ కేసు నమోదు

ఏఐ వీడియో కలకలం.. అంబటి రాంబాబుపై సీఐడీ కేసు నమోదు
Advertisement

Ambati Rambabu: కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన AI వీడియో వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో తీవ్ర దుమారం రేపుతోంది. వైఎస్సార్‌సీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు తన సోషల్ మీడియా ఖాతాలో ఈ వివాదాస్పద వీడియోను పోస్ట్ చేశారని ఆరోపిస్తూ అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్ట్ర సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు.

డీజీపీ కార్యాలయంలో టీడీపీ నేతల ఫిర్యాదు

Advertisement

మాజీ క్రిస్టియన్ కార్పొరేషన్ చైర్మన్ మద్దిరాల మ్యానీ నేతృత్వంలోని టీడీపీ బృందం మంగళగిరిలోని డీజీపీ కార్యాలయానికి వెళ్లి ఈ వ్యవహారంపై రాతపూర్వక ఫిర్యాదు అందించింది. కేంద్ర మంత్రి హోదాలో ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్ ప్రతిష్టను దిగజార్చేలా, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే ఉద్దేశంతోనే ఈ ఏఐ టెక్నాలజీ ఆధారిత వీడియోను సృష్టించి ప్రచారం చేశారని వారు తమ ఫిర్యాదులో స్పష్టం చేశారు. నాయకుల వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్న ఈ తరహా పోస్టులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

రంగంలోకి సీఐడీ.. దర్యాప్తు ప్రారంభం

Advertisement

మద్దిరాల మ్యానీ ఇచ్చిన ఫిర్యాదును సమగ్రంగా పరిశీలించిన సీఐడీ అధికారులు, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై అధికారికంగా కేసు నమోదు చేశారు. ఈ వీడియోను ఎవరు తయారు చేశారు, దీని వెనుక ఉన్న సాంకేతిక సహకారం ఎవరిది, ఏ ఉద్దేశంతో సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశారు అనే కోణాల్లో దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. మున్ముందు ఈ కేసులో డిజిటల్ ఆధారాలను సేకరించి మరిన్ని చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.

Also Read: ఫార్ములా-ఈ స్కామ్‌లో KTR A-1.. ఏసీబీ 77 పేజీల ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

Tags

Related News

రుతుపవనాలపై ఐఎండీ కీలక ప్రకటన.. బంగాళాఖాతంలో ద్రోణి, ఏపీలో భారీ వర్షాలు

నెల్లూరులో చెత్త నిధులపై మాటల యుద్ధం.. సవాల్ విసిరిన వైసీపీ.. తిప్పికొట్టిన కూటమి!

పల్నాడులో విషాదం.. బైక్‌ను ఢీకొన్న ట్రావెల్ బస్సు, ఇద్దరి మృతి!

చిటికెలో సమస్యలు పరిష్కారం, శ్రీవారి భక్తులకు తోడుగా ‘నందకం’

శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. సోమవారం నుంచి సర్వ దర్శనం టోకెన్లు నిలిపివేత

మూడురోజులుగా కుమ్మేస్తున్న వర్షాలు.. ఉప్పొంగుతున్న జలపాతాలు, పర్యాటకులకు నో ఎంట్రీ

అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో కుమ్మేస్తున్న వర్షాలు, తెల్లవారుజామున హైదరాబాద్‌లో భారీ వర్షం

పల్నాడులో పిడుగు పడి నలుగురు మృతి.. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు

Big Stories

Advertisement
×