E-Paper
Advertisement

చెన్నై-తిరుపతి మార్గంలో 8 రైళ్లు రద్దు.. ఎన్ని రోజులు అంటే?

చెన్నై-తిరుపతి మార్గంలో 8 రైళ్లు రద్దు.. ఎన్ని రోజులు అంటే?
Advertisement

Chennai-Tirupati Trains Cancelled: ప్రయాణికులకు  దక్షిణ రైల్వే కీలక ప్రకటన చేసింది. అరకోణం రైల్వే యార్డ్‌ విస్తరణ పనులు చేపడుతున్న నేపథ్యంలో చెన్నై-తిరుపతి మార్గంలో నడిచే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిదంఇ. ఈ నెల 26, 28 తేదీల్లో రైళ్లను క్యాన్సిల్ చేస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా రైల్వే అధికారులు ఈ రైళ్ల రద్దుకు సంబంధించి కీలక వివరాలు వెల్లడించింది. అరకోణం యార్డ్‌ లో జరుగుతున్న అభివృద్ధి పనుల కారణంగా కొన్ని రైళ్ల రాకపోకలపై తాత్కాలిక ప్రభావం పడుతున్నట్లు తెలిపింది. ఈ పనుల కారణంగా మొత్తం ఎనిమిది రైళ్లను రద్దు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించింది.

ఏ రైళ్లు రద్దు అవుతున్నాయంటే?

ఈ నెల 26, 28 తేదీల్లో చెన్నై సెంట్రల్‌ నుంచి ఉదయం 6.30 గంటలకు బయలుదేరే తిరుపతి ప్యాసింజర్‌ రైలు సేవలు అందుబాటులో ఉండవు. అటు, మధ్యాహ్నం 2.24 గంటలకు చెన్నై సెంట్రల్‌ నుంచి బయలుదేరే సప్తగిరి ఎక్స్‌ ప్రెస్‌ ను కూడా రెండు రోజుల్లో రద్దు చేశారు. అటు చెన్నై సెంట్రల్‌ నుంచి సాయంత్రం 4.35 గంటలకు తిరుపతికి వెళ్లే రైలును ఈ నెల 26న రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. తిరుపతి నుంచి చెన్నై సెంట్రల్‌కు ఉదయం 10.10 గంటలకు బయలుదేరే రైలు కూడా ఈ నెల 26, 28 తేదీల్లో నడవదు.తిరుపతి నుంచి చెన్నై సెంట్రల్‌కు సాయంత్రం 6.05 గంటలకు బయలుదేరే మరో రైలును కూడా ఈ నెల 26వ తేదీన రద్దు చేసినట్లు దక్షిణ రైల్వే తెలిపింది.

ప్రయాణికులకు రైల్వే కీలక సూచనలు

Advertisement

రైళ్ల రద్దుతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్నందున, ముందుగానే తమ ప్రయాణ ప్రణాళికలను మార్చుకోవాలని రైల్వే అధికారులు సూచించారు. ప్రయాణికులు రైలు బయలుదేరే ముందు అధికారిక రైల్వే వెబ్‌ సైట్‌, రైల్వే ఎంక్వయిరీ కేంద్రాలు లేదంటే సంబంధిత యాప్‌ ల ద్వారా తాజా వివరాలను తెలుసుకోవాలని కోరారు. అరకోణం యార్డ్‌ విస్తరణ పనులు పూర్తయిన తర్వాత రైళ్ల రాకపోకలు మరింత మెరుగుపడతాయని, భవిష్యత్తులో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ పనులు చేపడుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.  ఈ నెల 26, 28 తేదీల్లో చెన్నై-తిరుపతి మార్గంలో ప్రయాణించాలనుకునే వారు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవడం మంచిదని అధికారులు సూచించారు.

Read Also: బుల్లెట్ రైలు ప్రాజెక్టులో కొత్త టెక్నాలజీ.. తొలిసారిగా టన్నెల్ హుడ్స్ ఏర్పాటు!

Tags

Related News

దుబాయ్ ఫ్యామిలీ టూర్ వెళుతున్నారా? పిల్లలకు వీసా ఫ్రీ.. ఈ కండీషన్స్ పాటిస్తే

విశాఖ టు భోగాపురం.. బస్సుకు రూ.300, క్యాబ్‌కు రూ.1,500.. వామ్మో ఇదేం బాదుడురా అయ్యా!

ఆగస్టు 17 నుంచే భోగాపురం ఎయిర్‌పోర్ట్ సేవలు.. ఏ నగరానికి ఎన్ని ఫ్లైట్స్ అంటే?

భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఎందుకంత ప్రత్యేకం? మీకు తెలియని ఇంట్రస్టింగ్ విశేషాలు ఇవే!

భోగాపురమే కాదు, ఇండియాలోని ఈ ఎయిర్‌పోర్టులూ సిటీకి దూరమే.. ఎంత టైమ్ పడుతుందంటే?

రైళ్లలో భారీ లగేజ్‌లు తీసుకెళ్లేవాళ్లకి షాక్.. కొత్త రూల్స్ ఇవే!

మనిషి కంటే ఎత్తు.. 15 ఏళ్లకు ఒక్కసారే పూచే ‘హిమాలయన్ డైమండ్’ విశేషాలివే!

పాస్‌పోర్ట్ రంగుల అసలు రహస్యం తెలుసా? బ్లూ, రెడ్, గ్రీన్, బ్లాక్ దేనికి సంకేతమంటే..!

Big Stories

Advertisement
×