E-Paper
Advertisement

Special Trains: తిరుమల వెళ్లే వారికి రైల్వే శాఖ గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు.. ఈ రూట్లలో పొడిగింపు

Special Trains: తిరుమల వెళ్లే వారికి రైల్వే శాఖ గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు.. ఈ రూట్లలో పొడిగింపు
Advertisement

Special Trains: తిరుమల శ్రీవారి భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. తిరుపతి వెళ్లే ప్రయాణికుల కోసం మూడు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. క్రిస్మస్, న్యూఇయర్ సందర్భంగా వరుస సెలవులు వస్తుండడంతో తిరుపతి వెళ్లేవారికి కోసం ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. హైదరాబాద్ నుంచి నిత్యం వేల సంఖ్యలో తిరుపతికి వెళ్తుంటారు. దీంతో తిరుపతి వెళ్లే రైళ్లలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. పండుగల నేపథ్యంలో రైల్వే శాఖ ప్రత్యేక సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది.

చర్లపల్లి-తిరుపతి మధ్య

చర్లపల్లి-తిరుపతి(07031) మధ్య డిసెంబర్ 19 నుంచి జనవరి 2 ప్రత్యేక రైలు నడపనున్నారు. ఈ రైలు చర్లపల్లిలో సాయంత్రం 3.30 గంటలకు బయల్దేరి తర్వాతి రోజు ఉదయం 6.40 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరుపతి-చర్లపల్లి (రైలు నెంబర్ :07000) ఈ నెల 16 నుంచి 30 వరకు అందుబాటులో ఉంటుంది. ప్రతీ మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు తిరుపతిలో ఈ రైలు బయల్దేరి ఆ తర్వాతి రోజు ఉదయం 8.15 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది.

Advertisement

పంధర్‌పూర్-తిరుపతి (07032) రైలు డిసెంబర్ 21 నుంచి జనవరి 4 వరకు నడపనున్నారు. ఈ రైలు పంధర్‌పూర్‌లో రాత్రి 8.00 గంటలకు బయల్దేరి తర్వాత రోజు రాత్రి 10.30 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. ఈ రైళ్లు దాదాపు అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో ఆగనున్నాయి.

న్యూఇయర్ కు స్పెషల్ ట్రైన్స్

న్యూ ఇయర్ సందర్భంగా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. డిసెంబర్ 24 నుంచి 30 వరకు చర్లపల్లి-కాకినాడ(07196) మధ్య మంగళ, బుధవారాల్లో ఈ సర్వీస్ అందుబాటోలు ఉంటుంది. ఈ నెల 28 నుంచి 31 వరకు కాకినాడ టౌన్-చర్లపల్లి (07195) రైలు ఆది, బుధవారాల్లో సాయంత్రం 7.30 గంటలకు బయలు దేరి మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు గమ్యస్థానాలకు చేరుకుంటాయి. ఈ ప్రత్యేక రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్ల మీదగా రాకపోకలు సాగిస్తాయి.

Advertisement

Also Read: IndiGo voucher: ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. వారికి రూ.10 వేల వోచర్

పలు రైలు సేవల పొడిగింపు

న్యూ ఇయర్,సంక్రాంతి పండుగల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్ల రాకపోకలను పొడిగించింది.

  1. కాచిగూడ-తిరుచానూరు(07787)- ప్రతి గురువారం- 25.12.2025 నుండి 12.02.2026 వరకు
  2. తిరుచానూరు – కాచిగూడ(07788)- ప్రతి శుక్రవారం-26.12.2025 నుండి 13.02.2026 వరకు
  3. సికింద్రాబాద్ – అనకాపల్లి(07059)- ప్రతి సోమవారం- 29.12.2025 నుండి 09.02.2026 వరకు
  4. అనకాపల్లి – సికింద్రాబాద్(07060) – ప్రతి మంగళవారం- 30.12.2025 నుండి 10.02.2026 వరకు
  5. చర్లపల్లి – అనకాపల్లి(07035)- ప్రతి శనివారం – 17.01.2026 నుండి 14.02.2026 వరకు
  6. అనకాపల్లి- చర్లపల్లి(07036)- ప్రతి ఆదివారం- 18.01.2026 నుండి 15.02.2026 వరకు
  7. తిరుపతి – చర్లపల్లి(07000)- ప్రతి మంగళవారం- 30.12.2025 నుండి 27.01.2026 వరకు
  8. చర్లపల్లి – తిరుపతి(07001)- ప్రతి బుధవారం- 31.12.2025 నుండి 28.01.2026 వరకు
  9. తిరుపతి – చర్లపల్లి(07002) -ప్రతి గురువారం-01.01.2026 నుండి 29.01.2026 వరకు
  10. చర్లపల్లి – తిరుపతి(07031)- ప్రతి శుక్రవారం- 02.01.2026 నుండి 30.01.2026 వరకు
  11. తిరుపతి – పంధరపూర్(07012)- ప్రతి శనివారం- 03.01.2026 నుండి 31.01.2026 వరకు
  12. పంధరపూర్ – తిరుపతి(07032)- ప్రతి ఆదివారం- 04.01.2026 నుండి 01.02.2026 వరకు

Related News

వర్షాకాలంలో ఊటీ కంటే బెటర్ హిల్ స్టేషన్.. కోటగిరిలో తప్పక చూడాల్సిన ప్రదేశాలు

‘సెకండ్ క్లాస్ ప్యాసింజర్’ ఏంటి? నిప్పులు చెరిగిన అత్యున్నత న్యాయస్థానం!

బస్సులో, రైలులో కొందరు సౌండ్ పెద్దగా పెట్టి వీడియోలు చూస్తారు.. ఎందుకో తెలుసా?

వర్షాకాలంలో తామరపూల స్వర్గం.. జీవితంలో ఒక్కసారైనా చూసి తీరాల్సిన అద్భుత ప్రదేశం!

పాత IRCTC వెబ్ సైట్‌కు.. కొత్తదానికి తేడా ఏమిటీ? ఏం మారాయ్? ఏం చేరాయ్?

అర్ధరాత్రి కూడా భానుడి ప్రతాపమే.. భూమిపై సూర్యుడు అస్తమించని ఆ 5 వింత ప్రదేశాలేవో తెలుసా?

మాన్సూన్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ 5 డెస్టినేషన్స్ మిస్ అవొద్దు!

భూమిపై 5 ప్రమాదకర పర్యాటక ప్రాంతాలు.. ఇక్కడికి వెళ్లడం ప్రాణాలతో చెలగాటం.. అయినా వెళుతున్న టూరిస్ట్స్

Big Stories

Advertisement
×