E-Paper
Advertisement

CM Chandrababu-Lokesh: నేడు విశాఖకు సీఎం చంద్రబాబు, లోకేష్.. భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపన

CM Chandrababu-Lokesh: నేడు విశాఖకు సీఎం చంద్రబాబు, లోకేష్.. భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపన
Advertisement

CM Chandrababu-Lokesh: ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న ముందడుగు చర్యలతో.. అంతర్జాతీయ కంపెనీలు తిరిగి రాష్ట్రంపై దృష్టి పెడుతున్నాయి. ఈ మేరకు అమెరికన్‌ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ విశాఖలో శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. నేడు సీఎం నారా చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. అదే వేదికపై రాష్ట్ర ఐటీ అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న మంత్రి నారా లోకేష్.. మరో ఏడు ఐటీ కంపెనీల నిర్మాణాలకు కూడా శంకుస్థాపన చేయనున్నారు.

విశాఖ మధురవాడ ప్రాంతం త్వరలోనే పెద్ద ఐటీ హబ్‌గా మారబోతోంది. కాగ్నిజెంట్‌ మధురవాడలో మొత్తం రూ.1,583 కోట్ల పెట్టుబడితో అత్యాధునిక శాశ్వత క్యాంపస్‌ను నిర్మించనుంది. ఈ క్యాంపస్ నిర్మాణంతో 8,000 మందికి పైగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.

Advertisement

శాశ్వత భవనం నిర్మాణం పూర్తయ్యే వరకు.. కాగ్నిజెంట్ తాత్కాలిక క్యాంపస్ నుంచే సేవలను ప్రారంభిస్తోంది. నేటి నుంచే 800 మంది ఉద్యోగులతో కార్యకలాపాలు మొదలు పెట్టనున్నట్లు కంపెనీ ప్రకటించింది. సీఎం చంద్రబాబు ఈ తాత్కాలిక కార్యాలయాన్ని కూడా పరిశీలించనున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ ఐటీ రంగానికి ఊపిరి పోసేందుకు.. మంత్రి నారా లోకేష్ చేపడుతున్న కార్యక్రమాలకు మరో పెద్ద అడుగు పడింది. విశాఖలో  ఏడు ప్రముఖ ఐటీ సంస్థలు తమ క్యాంపస్ నిర్మాణానికి సిద్ధమయ్యాయి. సత్వా డెవలపర్స్, టెక్ తమ్మిన, నాన్ రెల్ టెక్నాలజీస్, ఏసీఎన్ ఇన్ఫోటెక్, ఇమాజిన్నోవేట్ టెక్ సొల్యూషన్స్, ఫ్లూయెంట్ గ్రిడ్ లిమిటెడ్, మదర్సన్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్, క్వార్క్స్ టెక్నోసాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ ఐటీ ప్రాజెక్టుల ద్వారా విశాఖను దేశంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న టెక్నాలజీ నగరంగా మార్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

Advertisement

కాగ్నిజెంట్ శంకుస్థాపన కార్యక్రమం అనంతరం.. సీఎం చంద్రబాబు A1 కన్వెన్షన్ వద్ద జరగనున్న విశాఖ ఎకనామిక్ రీజియన్ సమావేశంలో పాల్గొని.. వ్యాపార సంస్థలతో చర్చించనున్నారు. ఇందులో ప్రాంతీయ అభివృద్ధి, పెట్టుబడుల అవకాశాలు, గ్లోబల్ కంపెనీలు తీసుకురాబోయే అవకాశాలు వంటి అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

Also Read: పర్మిషన్ లేకుండా బర్త్‌డే పార్టీ.. దువ్వాడ మాధురికి పోలీసులు షాక్

కాగ్నిజెంట్ వంటి ప్రపంచస్థాయి సంస్థ విశాఖను కేంద్రంగా ఎంచుకోవడం, మిగతా ఏడు కంపెనీలు పెట్టుబడులు పెట్టడం ఈ రెండు అంశాలు కలిసి ఉత్తరాంధ్ర ఆర్థిక పరిస్ధితికి భారీ బలోపేతాన్ని అందించనున్నాయి. ఐటీ రంగం రావడం వల్ల ఉపాధితో పాటు నగర అభివృద్ధి, రియల్ ఎస్టేట్, సేవా రంగాలు కూడా భారీగా లాభపడతాయి.

 

Related News

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

Big Stories

Advertisement
×