E-Paper
Advertisement

Municipal elections 2026: త్రిముఖ పోరులో ‘హస్తం’ హుందాతనం వెనుక.. అసలు మతలబు ఇదేనా..

Municipal elections 2026: త్రిముఖ పోరులో ‘హస్తం’ హుందాతనం వెనుక.. అసలు మతలబు ఇదేనా..
Advertisement

Municipal elections 2026: ఏ రాజకీయ  పార్టీ అయినా ప్రత్యర్ది పార్టీని బలహీన పరిచి లబ్ది పొందాలనుకుంటుంది. మరీ ముఖ్యంగా ఎన్నికల సమయంలో అటువంటి స్ట్రాటజీలు మరింత బలంగా అమలు చేయాలని చూస్తుంటాయి. కానీ రాష్ట్ర కాంగ్రెస్ మాత్రం మున్సిపల్ ఎన్నికల్లో ప్రత్యర్థి బలం పెంచి లబ్ది పొందాలని చూస్తోందంట. ఎన్నికల తరుణంలో కాంగ్రెస్ అమలు చేస్తున్న ఈ కొత్త వ్యూహం అత్యంత ఆసక్తికరంగా మారింది. అసలు హస్తం పార్టీ ఆ వ్యూహాన్ని అమలు చేయడం వెనక ఉన్న మతలబు ఏంటి?… ఆ గేమ్‌ప్లాన్‌తో కాంగ్రెస్ అనుకున్న ఫలితాలు సాధిస్తుందా?

మున్సిపల్ ఎన్నికల హస్తం పార్టీ సరికొత్త వ్యూహం

మున్సిపల్ ఎన్నికల వేల హస్తం పార్టీ సరికొత్త వ్యూహం తో ముందుకు వెళ్లి లబ్ది పొందడానికి యాక్షన్ ప్లాన్ అమలు చేస్తోంది..ఏ రాజకీయ పార్టీ అయినా మాములుగా అయితే ప్రత్యర్దిని బలహీన పరచి గెలవాలనుకుంటుంది… కానీ అధికార కాంగ్రెస్  మాత్రం ప్లాన్ మార్చింది … ప్రత్యర్థి బలం పెంచి గెలవాలనుకుంటోందంట… ఇది కొంత విచిత్రంగా ఉన్నా తాము చేసేది కరెక్టే అంటున్నారు హస్తం పార్టీ నేతలు.

కారుకు బలం చేకూర్చడమే హస్తం మార్గమా?

Advertisement

ప్రస్తుతం జరిగే మున్సిపల్ ఎన్నికలు పట్టణ ప్రాంతంలోనే జరగనున్నాయి ..తెలంగాణలో పట్టణ ప్రాంతాల్లో ప్రధాని మోడీ ప్రభావం, హిందుత్వ అజెండాలతో బీజేపీ పట్టుపెంచుకునే ప్రయత్నం చేస్తోంది. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ వంటి జిల్లాల్లో లోకసభ ఎన్నికల్లో ఆ పార్టీ ఓటు షేర్ గణనీయంగా పెరిగింది.. ఆ క్రమంలో చాలా చోట్ల అధికార కాంగ్రెస్ కు బీజేపీ సవాల్ విసురుతోంది.. ఈ నేపథ్యంలో బీజేపీని కట్టిడి చేయాలంటే బీఆర్ఎస్‌కు బలం చేకూర్చడం ఒక్కటే మార్గమని కాంగ్రెస్ భావిస్తోందట.. తమ ప్రత్యర్ధులు ఇద్దరు అంతోఇంతో బలంగా ఉంటే ఓట్ల చీలిక జరుగుతుందని, ఫైనల్ గా అది తమకు లాభం చేకూర్చుతుందని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అంచనా వేసుకుంటున్నారంట.

సిట్ విచారణ వెనుక కాంగ్రెస్ మున్సిపల్ లెక్కలు!

అందుకు సంబంధించి సిట్ విచారణను అస్త్రం గా చేసుకుంది టీ కాంగ్రెస్..రాజకీయ కుట్ర గా బీఆర్ఎస్ ఆరోపిస్తుంటే , తమకు ఏం సంబంధం లేదని కాంగ్రెస్ వాదిస్తుంది. ఏది ఏమైనా గత కొద్దిరోజులుగా సిట్ విచారణ సెంట్రిక్ గా కాంగ్రెస్ – బీఆర్ఎస్‌ల మధ్యే పొలిటికల్ వార్ నడుస్తోంది… కేసీఆర్ వంటి బీఆర్ఎస్ ముఖ్యనేతలను సిట్ అధికారులు విచారించడం తమకు సానుభూతిపరంగా ప్లస్ అవుతుందని గులాబీ పార్టీ లెక్కలు వేసుకుంటోంది. కాంగ్రెస్ కు కావాల్సింది కూడా ఇదే. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి బీజేపీ బలం తగ్గితే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు లబ్ది చేకూరుతుందన్నది ఆ పార్టీ నేతల ప్లాన్‌‌ అంటున్నారు.

సిట్ విచారణే అస్త్రం.. కక్షసాధింపే నినాదం

Advertisement

అటు బిఆర్ఎస్ కూడా మున్సిపల్ ఎన్నికలను సీరియస్‌గా తీసుకుంది. పార్టీ అధిష్టానం ముఖ్యనేతలను సిట్ విచారించడాన్ని, ప్రభుత్వ కక్షసాధింపు చర్యగా ఫోకస్ చేస్తూ దాన్ని గట్టిగా వాడుకోవాలని చూస్తోంది. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ గుర్తులతో జరుగుతున్న ఎన్నికలు కావడంతో.. ఈ అవకాశాన్ని సమర్దవంతంగా వాడుకోవాలని డిసైడ్ అయింది . కాంగ్రెస్ వ్యూహాన్ని గమనించిన బీఆర్ఎస్… నేతల చేరికలు ప్రోత్సహిస్తూ కాంగ్రెస్  గేమ్‌ప్లాన్‌కు చెక్ పెట్టి  ఓడించాలని వ్యూహం రచిస్తుందట…మొత్తంగా హస్తం పార్టీ రివర్స్ వ్యూహం ఆ పార్టీ ని గట్టెక్కిస్తుందో లేక నిండా ముంచుతుందో చూడాలి మరి.

Also Read: తెలంగాణ బీజేపీలో ‘జన’గణం.. పవన్ ఫ్యాక్టర్ వెనుక అసలు కథ ఇదేనా?

Related News

కమ్మని కబుర్లు వెనుక కన్నింగ్ ప్లాన్.. వీల్లని నమ్మితే మీ పని అయిపోయినట్టే?

ఒకే దెబ్బకు రెండు నిర్ణయాలు.. సురేఖ వ్యవహారంతో పాటు కేబినెట్ మార్పులపై రచ్చ!

తెలంగాణలో పొల్యూషన్ డేంజర్ బెల్స్.. ప్రాణాలు కాపాడే మందుల వెనుక పల్లెల వినాశనం!

కొత్త పార్టీ ప్రకటనతో విజయసాయి రెడ్డి బిగ్ ప్లాన్.. జగన్‌కు చెక్ పడినట్టేనా..!

పవన్ బర్త్‌డే వేళ సంచలన నిర్ణయం.. జనసేనలో యువజన విభాగం ఏర్పాటుకు రంగం సిద్ధం!

347 కోట్ల మంది మ‌హిళ‌లు.. ఆర్టీసీలో ఫ్రీ ప్ర‌యాణం! రూ. 12,167 కోట్ల మేర ఆ కుటుంబాల‌కు ఆదా..!

వెయ్యి రోజులుగా కేసీఆర్ మేధోమ‌థ‌నం….కొంగొత్త ప‌థ‌కాల‌కు రూప‌క‌ల్ప‌న‌..! బీఆరెస్ స‌మ‌ర్థింపు ప్ర‌క‌ట‌న‌లు…

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు బిగ్ అలర్ట్.. ఉచిత రిజిస్ట్రేషన్లతో పేదలకు అపార్ట్‌మెంట్లు!

Big Stories

Advertisement
×