SCR Cancels 8 Passenger Services: దక్షిణ మధ్య రైల్వే ప్రయాణీకులకు అలర్ట్ జారీ చేసింది. తన నెట్ వర్క్ పరిధిలో రెండు రోజుల పాటు 8 రైళ్లను క్యాన్సిల్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇవాళ, రేపు ప్యాసింజర్ రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఒకవేళ ఆ మార్గాల్లో వెళ్లే ప్రయాణీకులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించింది.
తాజాగా క్యాన్సిల్ అయ్యే రైళ్ల వివరాలను సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. కాజీపేట- డోర్నకల్, డోర్నకల్- విజయవాడ, విజయవాడ-గుంటూరు మధ్య నడిచే రైళ్లు, అలాగే సికింద్రాబాద్-వరంగల్, వరంగల్-సికింద్రాబాద్ మార్గాల్లో నడిచే 8 ప్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఈ రైళ్లు సాధారణంగా ప్రతిరోజూ నడుస్తాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అంతటా స్వల్ప దూర, సబర్బన్ ప్రయాణికులకు ఎక్కువగా సేవలు అందిస్తాయి. రెండు రోజుల పాటు వీటి సేవలను నిలిపి వేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ప్రకటించారు.
Read Also: మిస్టరీ రైల్వే స్టేషన్.. ఆ స్టేషన్ గుండా వెళ్లే రైళ్లలో.. అకస్మాత్తుగా ఆరిపోతున్న లైట్లు!
రైళ్ల రద్దుకు సంబంధించి సౌత్ సెంట్రల్ రైల్వే కీలక వివరాలను వెల్లడించింది. భద్రత, ఆపరేషనల్ సామర్థ్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా మౌలిక సదుపాయాల నిర్వహణను సులభతరం చేయడానికి తాత్కాలిక సస్పెన్షన్ అవసరమని రైల్వే అధికారులు నిర్ణయించారు. ప్రయాణికులు రైలు షెడ్యూల్ ను ముందుగానే తనిఖీ చేయాలని, ప్రభావిత తేదీలలో వారి ప్రయాణాలను తదనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని సూచించారు.
Read Also: హైస్పీడ్ రైల్ హబ్ గా హైదరాబాద్.. చెన్నై, బెంగళూరు, ముంబై బుల్లెట్ ట్రైన్ కారిడార్ల లింక్ ఇక్కడే!
దక్షిణ మధ్య రైల్వే ఈ అసౌకర్యానికి చింతిస్తున్నట్లు ప్రకటించింది. ప్రయాణీకులకు మెరుగైన ప్రయాణ సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. నిర్వహణ పనులు పూర్తయిన తర్వాత సాధారణ సేవలు తిరిగి ప్రారంభమవుతాయని వివరించింది. సౌత్ సెంట్రల రైల్వే జోన్ అంతటా మౌలిక సదుపాయాలు అప్ డేట్ చేసే సమయంలో వీలైనంత వరకు ప్రయాణీకులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. ప్రయాణీకుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూనే ఈ కార్యకలాపాలను చేపడుతున్నారు.
Read Also: వందే భారత్కు బాంబు ముప్పు.. రైళ్లను పేల్చేస్తామంటూ ఆగంతకుడి లేఖ.. వణికిపోతున్న ప్రయాణికులు!