Brahmamudi Rekha : తెలుగు ఆడియన్స్ ని ఎక్కువగా ఆకట్టుకుంటున్న టాప్ సీరియల్స్లలో స్టార్ మా లో ప్రసారమయ్యే బ్రహ్మముడి కూడా ఒకటి. ఈ సీరియల్ మొదలైనప్పుడు మంచి రేటింగ్ తో దూసుకుపోయింది.. ఈమధ్య స్టోరీలో పెద్దగా ట్విస్టులు లేకపోవడంతో రేటింగ్ విషయంలో వెనక్కి వెళ్ళిపోయింది.. ఈ సీరియల్ తర్వాత వచ్చిన కొత్త సీరియల్స్ అన్ని టాప్ లోకి రావడంతో.. ప్రస్తుతం ఈ సీరియల్ లో అనుకోని ట్విస్టులు ఇచ్చారు డైరెక్టర్.. పాత క్యారెక్టర్స్ అన్నిటిని బాంబ్ బ్లాస్ట్ లో చంపేసి కొత్తగా కొందరిని దించారు.. అందులో రేఖ క్యారెక్టర్ లో టీవీ నటి ప్రశాంతి నటిస్తుంది.. ఈమె గతంలో ఎన్నో సీరియల్స్లలో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించింది.. ఈమె గురించి పూర్తి వివరాలను ఒకసారి మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియస్లలో బ్రహ్మముడి సీరియల్ కూడా ఒకటి.. ఎలాంటి మార్పులు వస్తాయి అన్న స్టోరీ తో ప్రేక్షకులు ముందుకు వచ్చింది.. అయితే ఈ సీరియల్ మొదట్లో మంచి టాక్ ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత రాను రా నువ్వు స్టోరీలో కీలక మార్పులు చోటు చేసుకోవడంతో కాస్త రేటింగ్ డల్ అయింది. కానీ కొన్ని ఎపిసోడ్లు మాత్రం బాగా హైలైట్ అవ్వడంతో ఈ సీరియల్ ని జనాలు ఆదరిస్తున్నారు. ఈమధ్య కాస్త స్టోరీ తేడా కొట్టడంతో పాత క్యారెక్టర్ లేని బాంబు బ్లాస్ట్ లో చంపేసి వారి కూతుర్ల ప్లేస్ లో కొత్తవారిని దించారు.. అలా రేఖ అనే పాత్రలో నటిస్తుంది టీవీ నటి ప్రశాంతి. గతంలో ఎన్నో సీరియల్స్లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. యాంకర్ గా కెరియర్ ని ప్రారంభించిన ఈమె ఆ తర్వాత వరసగా సీరియల్స్ సినిమాలు చేస్తూ ఒక్కసారిగా బిజీ అయిపోయింది. స్టార్ మా లో గతంలో వచ్చిన గృహలక్ష్మి సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాత పెద్దగా సీరియస్లలో కనిపించలేదు.. ఇప్పుడు మళ్లీ ఈ సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తుంది.
Also Read : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ ధీరజ్ రామరాజుకు నిజంగానే కొడుకునా?
బుల్లితెరపై పాజిటివ్ క్యారెక్టర్లలో నటించిన వారి కన్నా నెగిటివ్ క్యారెక్టర్లలో నటించిన వారికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఆ క్యారెక్టర్ అని జనాలు కూడా ఎక్కువగా గుర్తు పెట్టుకుంటారు. అలాంటి నెగిటివ్ షేడ్ క్యారెక్టర్ లో నటించి జనాలతో చివాట్లు తిన్న నటీనటులలో ప్రశాంతి ఒకరు. ఈమె గురించి ఎంత చెప్పినా తక్కువే.. వయసు పెరుగుతున్న సరే తరగని అందంతో ఇప్పటికీ కుర్ర హీరోయిన్ లాగే కనిపిస్తుంది. ఈమె గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన గురించి ఎన్నో ఎమోషనల్ విషయాలను పంచుకొని కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె మాట్లాడుతూ.. మన తెలుగులో చాలా మంచి యాక్టర్స్ ఉన్నారు. అయితే మన వాళ్లు బయటకు వెళ్ళినప్పుడు అక్కడ అవకాశాల కోసం ప్రయత్నిస్తే వాళ్లు పెద్దగా ఇవ్వరు. కానీ అదే యాక్టర్స్ ఆ ఇండస్ట్రీ నుంచి మన తెలుగు ఇండస్ట్రీకి వస్తే మన వాళ్లు కచ్చితంగా మంచి క్యారెక్టర్ ఇస్తారు. మన వాళ్లు ఎందుకు అంత ఎంకరేజ్ చేస్తారో నాకు ఇప్పటికీ క్వశ్చన్ మార్క్గానే ఉంది. సినిమాల్లో రోల్స్ అన్నీ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్లే కనిపిస్తూ ఉంటారు.. నాకు అవకాశాలు లేనప్పుడు నేను అలా డిస్టర్బ్ అయ్యాను. ఒకానొక సందర్భంలో డిప్రెషన్ లోకి కూడా వెళ్లాను. ఇప్పుడు అవకాశాలు రావడంతో మళ్లీ నా టాలెంట్ నిరూపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాను అని ఆమె అంటుంది. ఆ వీడియో ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. ఇక ప్రస్తుతం టీవీ నటి ప్రశాంతి బ్రహ్మముడి సీరియల్ లో నటిస్తూ బిజీగా ఉంది.