Gundeninda GudiGantalu Today episode April 5th: ప్రభావతి మళ్లీ ఇంట్లోకి రావడం అందరూ సంతోషంగా ఉంటారు. ఏంట్రా ఇంట్లో ఏదో జరుగుతుంది అని చెప్పావు ఇక్కడ అలాంటివి ఏమీ కనిపించడం లేదు కదా అని బాలు తో ప్రభావతి అంటుంది. ఏం చెప్పాడు ఏమన్నాడు అని సత్యం అడుగుతాడు. అదేంటంటే అండి మీకు ఇంకొక పెళ్లి చెయ్యాలని మీ అమ్మగారు వస్తున్నారట అని చెప్పాడు. అవును మరి నిజమే ఈ వయసులో నేను ఒంటరిగా ఎలా ఉంటాను అందుకే ఇంకొక పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను అని సత్యం బాలుకి సపోర్ట్ చేస్తూ మాట్లాడతాడు. మా ఇద్దరి కాపురంలో నువ్వే చిచ్చు పెడుతున్నావ్ రా అని ప్రభావతి సత్యం ముందరే బాలుని కొడుతుంది.
దినేష్ గుణ ఇద్దరు కలిసిపోయి రోహిణి దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. అయితే రోహిణి కి ఫోన్ చేసి ఇంకెన్ని రోజులు టైం తీసుకుంటావు. వాడు చచ్చేలా ఉన్నాడు నేను మాత్రం పోలీసులకి నీ పేరే చెప్తాను అని మళ్లీ మరోసారి గుర్తు చేసి బెదిరిస్తాడు. ఇప్పుడు మనోజ్నీ డబ్బులు అడిగితే చచ్చిన ఇవ్వడు వడ్డీ కడిగినా కూడా అసలు ఎవడు అని రోహిణి డబ్బులను ఎక్కడ నుంచి తీసుకురావాలని ఆలోచిస్తూ ఉంటుంది.. ఎలాగైనా సరే ఆ రెండు లక్షలు తీసుకచ్చి గుణకి ఇవ్వాలి అని అనుకుంటుంది. ఇంకొక రోజులో నువ్వు డబ్బులు ఇవ్వకపోతే కచ్చితంగా నేను వీడి బాడీని తీసుకొని పోలీసులకు లొంగిపోతానని గుణ అంటాడు. పక్కనే ఉన్న విద్య వీడంటే డబ్బుల కోసం చంపిన చంపేస్తే ఎలా ఉన్నాడు అని కంగారు పడిపోతూ ఉంటుంది.
ఇక మనోజ్ రోహిణి ఇద్దరు కూడా అమ్మ ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉంది అని మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ అత్తయ్య త్వరగా ఇంటికి రావడమే నాకు ఎక్కడో తేడా కొడుతుంది అని రోహిణి అనగానే.. తేడా లేదు ఏమీ లేదు మా అమ్మకి రావాలనిపించింది కాబట్టి వచ్చేసింది అని మనోజ్ అంటాడు.. ఇకపోతే అత్తయ్య రావడానికి కారణం ఏంటో బలంగానే ఉంది దాన్ని తెలుసుకోవాలి అని రోహిణి ప్రయత్నాలు చేస్తుంది. దీని సంగతి నేను తర్వాత చూసుకుంటాను ముందు ఆ గుణ గాడికి రెండు లక్షలు ఇవ్వాలి ఎక్కడినుంచి తేవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది.
రాత్రి అయిన తర్వాత మీనా బాలు ఇద్దరు కూడా శివ రావడం చాలా సంతోషంగా ఉందే అని మాట్లాడుకుంటూ ఉంటారు. మా అమ్మ దయతో కాదు ఏదో లాయర్ గారు మ్యాజిక్ చేసి ఒప్పించి శివని బయటకు తీసుకొచ్చాడు అని అంటాడు. ఏది ఏమైనా కూడా ఇప్పుడు నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు కదా మా అమ్మ కూడా ఇంటికి వచ్చేసింది కదా అని బాలు మీనా అని అడుగుతాడు. సమస్యలన్నీ తీరిపోయాయి ఇప్పుడు మనం కాస్త సరదాగా ఉండొచ్చు కదా అని బాలు అడుగుతాడు.. అయితే మీనా మాత్రం ఎప్పుడూ ఇదే సరసాల అని అంటుంది.
మరి సోమవారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.. అత్తయ్య ఇంత త్వరగా కేసుని వాపస్ తీసుకోవడానికి ఏదైనా బలమైన కారణం ఉండాలి అదేంటో నేను తెలుసుకుంటాను అని రోహిణి కామాక్షి దగ్గరికి వెళుతుంది. అక్కడ మసాజ్ చేస్తూ రోహిణి నిజాలని కనుక్కోవాలని అనుకుంటుంది. అవునండి అత్తయ్య అంత త్వరగా కేసుని ఎందుకు వాపస్ తీసుకునిందో మీకు తెలుసా అని కామాక్షిని అడుగుతుంది.. ఎక్కడ త్వరగా తీసుకునింది ఆ లాయర్ వచ్చి రెండు లక్షలు ఇస్తే అప్పుడు తీసుకుని ఉంది అని కామాక్షి నిజం చెప్పగానే రోహిణి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి రెండు లక్షలు తీసుకున్నా అని అనగానే అవును మీ అత్తయ్య ఊరికే చేయడానికి ఏమన్నా బుద్ధ విగ్రహం అనుకున్నావా ఏంటి అని కామాక్షి తిడుతుంది. ఆ రెండు లక్షలు ఎక్కడున్నాయి అని రోహిణి అడుగుతుంది. కామాక్షి నాతోనే ఉన్నాయి అని నిజం చెప్పేస్తుంది. అవునా అని షాక్ అవుతుంది. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది.. మరి సోమవారం ఎపిసోడ్ ఏం జరుగుతుందో చూడాలి..