Ramayana VFX: రణబీర్ కపూర్ హీరోగా నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘రామాయణం’. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ సోషల్ మీడియాలో భారీ చర్చకు దారితీసింది. ముఖ్యంగా ఇందులోని విజువల్ ఎఫెక్ట్స్ (VFX)పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అయితే, ఈ విమర్శలపై బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ స్పందిస్తూ మేకర్స్కు పూర్తి మద్దతు ప్రకటించారు.
హృతిక్ రోషన్ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక సుదీర్ఘమైన పోస్ట్ను షేర్ చేశారు. “ఒక భారీ చిత్రాన్ని రూపొందించే క్రమంలో నిర్మాతల ఉద్దేశం ప్రశంసించదగినది. కల్కి 2898 AD, బాహుబలి, ఇప్పుడు రామాయణం వంటి సినిమాలను తీస్తున్న వారు నా దృష్టిలో అసలైన హీరోలు. వారు అంతకుముందు ఎవరూ చేయని సాహసాన్ని చేస్తున్నారు” అని హృతిక్ పేర్కొన్నారు. సినిమాలోని వీఎఫ్ఎక్స్ వీడియో గేమ్ లాగా ఉన్నాయన్న విమర్శలపై హృతిక్ టెక్నికల్ కోణంలో సమాధానమిచ్చారు. వీఎఫ్ఎక్స్ అంటే కేవలం వాస్తవానికి దగ్గరగా ఉండటమే కాదు, ఒక్కో దర్శకుడు ఒక్కో శైలిని ఎంచుకుంటారు. కొన్నిసార్లు అది ‘స్టోరీ బుక్’ తరహాలో ఉండవచ్చు. వేలాది మంది కళాకారులు అహర్నిశలు శ్రమించి ఒక కలని తెరపైకి తెస్తారు. వారి శ్రమను తక్కువ చేసి చూడకూడదు. “ఇది నిజంగా కనిపిస్తుందా?” అని అడిగే బదులు, “ఇది ఆ కథా ప్రపంచానికి సరిపోతుందా?” అని ఆలోచించాలని హృతిక్ సూచించారు.
Read also-ప్రభాస్ ‘ఫౌజీ’ సెట్స్ నుండి ఫోటోలు లీక్.. వారికి వార్నింగ్ ఇచ్చిన మేకర్స్!
నితేష్ తివారీ విజన్ను సమర్థిస్తూ.. “మనం విమర్శించే ముందు ఆ నిర్మాతలు తీసుకున్న రిస్క్ను గుర్తించాలి. ఇలాంటి భారీ చిత్రాలు మనల్ని సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. బాల్యంలో నేను చూసిన సినిమాలే నన్ను ఈ స్థాయికి చేర్చాయి. ఇప్పుడు రామాయణం కూడా నేటి తరం పిల్లలకు అలాంటి స్ఫూర్తిని ఇస్తుంది” అని హృతిక్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రంలో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్నారు. కన్నడ స్టార్ యష్ రావణుడి పాత్రలో కనిపిస్తుండగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా నటిస్తున్నారు. భారీ బడ్జెట్తో రూపుదిద్దుకుంటున్న ఈ మొదటి భాగం 2026 దీపావళి కానుకగా విడుదలయ్యే అవకాశం ఉంది.