Alluri District: ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాను భూప్రకంపనలు వణికించాయి. ఆ జిల్లాలని శనివారం అర్ధరాత్రి పలు ప్రాంతాల్లో స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. ఒక్కసారి భూమి కంపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి భయంతో బయటకు పరుగులు తీశారు.
అల్లూరి జిల్లాను వణికించిన భూప్రకంపనలు
అల్లూరు సీతారామరాజు జిల్లాలో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. శనివారం అర్ధరాత్రి 11 నుంచి 12 గంటల సమయంలో ప్రకంపనలు వచ్చాయి. నార్మల్గా రాత్రి 8 లేదా 9 గంటల సమయానికి ఆ ప్రాంత ప్రజలు నిద్రపోతుంటారు. వేసవికాలం కావడంతో చాలా మంది రాత్రి 11 గంటల వరకు నిద్రపోలేదు. ఉన్నట్లుండి భూమి సడన్గా కదలడం ప్రారంభించింది.
వెంటనే పిల్లలతో ఇళ్ల నుంచి రోడ్ల మీదకు పరుగులు తీశారు. కేవలం అరకులోయ, పాడేరు నియోజకవర్గాలతోపాటు మరి కొన్ని ప్రాంతాల్లో ఈ విధంగా ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. రిక్టర్ స్కేలుపై ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా వచ్చింది. స్థానికులు మాత్రం 30 సెకన్లపాటు భూమి కంపించిందని చెబుతున్నారు.
అర్ధరాత్రి వేళ కంపించిన భూమి.. ఇళ్ల నుంచి ప్రజలు పరుగులు
తాము ఎప్పుడూ ఈ విధంగా భూమి వణకడం చూడలేదని అంటున్నారు. తాము భయాందోళనకు గురయ్యామని తెలిపారు. ఒరిస్సాలోని కోరాపుట్ ప్రాంతంలో భూకంప కేంద్రం గుర్తించినట్టు తెలుస్తోంది. రెక్టార్ స్కేల్ పై భూకంప తీవ్రత 4.4గా నమోదు అయినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
ALSO READ: గాజులు తొడుకున్నావా, అమ్మాయిలా ఏడవొద్దు, అనే పదాలకు ముగింపు చెప్పాలి: నారా లోకేష్
అల్లూరిజిల్లా అరకులోయ, పాడేరు నియోజకవర్గంలలో భూ ప్రకంపనలు.
సుమారు 8 సెకండ్ల పాటు కంపించిన భూమి.
ఇళ్లలోంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు.
ఒరిస్సా కోరాపుట్ ప్రాంతంలో భూకంప కేంద్రం.. రెక్టార్ స్కేల్ పై భూకంప తీవ్రత 4.4 గా నమోదు .
11. 31 నిమిషాలకు భూకంపం వచ్చినట్లు … నేషనల్… pic.twitter.com/9uOM6UifbF
— BIG TV Breaking News (@bigtvtelugu) April 5, 2026