Illalu Pillalu Today Episode January 28th: నిన్నటి ఎపిసోడ్ లో..రామరాజు చాలా సంతోషంగా మందు తాగుతాడు. తిరుపతి పిల్లలందరూ వచ్చారు నువ్వు మందు తాగుతుంటే చూస్తున్నారు అని అంటాడు.. వాళ్ళ నాన్న ఇంత సంతోషంగా ఎప్పుడు చూసి ఉండరు. నేను ఇంత సంతోషంగా ఉండడం మీరు ఎప్పుడైనా చూసారా లేదు కదా అని అందరినీ అడుగుతాడు. రామరాజుని అంత సంతోషంగా చూసిన ఇంతని వాళ్ళందరూ కూడా మురిసిపోతారు.. కన్న తండ్రిని అలా చూసి మిగిలిన వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉంటారు.. ఇక సంగీత్ ఫంక్షన్ ని గ్రాండ్ గా మొదలుపెడతారు.. సంగీత్ ఫంక్షన్ లో రామరాజు కుటుంబం.. అలాగే నీరజ కుటుంబం డాన్సులతో అదరగొట్టేస్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. శ్రీవల్లి మాత్రం ఇవాళ రాత్రికి ఎలాగైనా సరే అమూల్యని తీసుకొని వెళ్లి వాడి దగ్గరికి అప్పగించాలి. ఏదో ఒకటి చేయాలని భాగ్యం శ్రీవల్లి రాత్రి కరెంటు పోయేలా ప్లాన్ చేస్తారు. అమూల్యను విశ్వం నీతో మాట్లాడాలి అంటున్నాడు వాడి పీడ విరగడం ఎలా చేసుకో అని అంటుంది. అయితే కరెంటు తీసేసిన తర్వాత అమూల్యని ఎలాగైనా సరే బయటకు తీసుకెళ్లి వాడికి అప్పగించాలి అని అనుకుంటారు తల్లి కూతుర్లు.. అయితే ఇంట్లో తిరుపతి లేవడంతో అమూల్య దగ్గరికి వెళ్లడం కుదరలేదు అని అనుకుంటారు. తిరుపతి వాళ్ళిద్దరితో ఒక ఆట ఆడుకుంటాడు. ఇక పిల్ల అరుస్తుంది అని దాన్ని కొడతాడు అయితే అదొచ్చి భాగ్యంకు తగలగానే స్పృహ తప్పి పడిపోతుంది..
ప్రేమ క్యాండిల్ పట్టుకొని మొఖం దగ్గర పెట్టుకోవడంతో ధీరజ్ చూసి దెయ్యమని షాక్ అవుతాడు. ఏయ్ క్యాండిల్ నీ మొహం మీద చూసి నిజంగానే దయ్యమని అనుకున్నాను సత్య అనే బాబు అని ధీరజ్ అంటాడు.. క్యాండిల్ లేకపోయినా సరే నువ్వు దెయ్యంలాగే ఉంటావు అని ధీరజ్ అనగానే ప్రేమ సీరియస్ అవుతుంది.. నన్నే దెయ్యమంటావా నిన్ను అని ధీరజ్ తో ప్రేమ గొడవ పడుతుంది.. ధీరజ్ ప్రేమలు గొడవ పడుతూ ఉంటే రామరాజు అరె చిన్నోడా కరెంటు పోయింది చూడరా అని అరుస్తాడు. అలాగే నాన్న అని ధీరజ్ అంటాడు. ప్రేమని టార్చ్ పట్టుకోమని ఆ చెప్తాడు ధీరజ్.. ఇద్దరు కలిసి కరెంట్ ఏమైందో చూడాలని అనుకుంటారు.
శ్రీవల్లి మాత్రం ఇదే కరెక్ట్ టైం అని అమూల్యని విశ్వంతో మాట్లాడ్డానికి తీసుకెళ్లాలని అనుకుంటుంది. అయితే అమూల్య దగ్గరికి వెళ్లిన శ్రీవల్లి విశ్వం నీతో మాట్లాడాలి అంటున్నాడు ఒకసారి మాట్లాడేసిరా వాడి పీడేదో విరగడ అయిపోతుంది కదా అంటుంది.. శ్రీవల్లి మాట విన్న అమూల్య వాడితో మాట్లాడి రావాలని అనుకుంటుంది. అయితే ఇది కరెంటు లేదు కదా ఇప్పుడు మనం వెళ్లి వాడితో మాట్లాడేస్తే తొందరగా వచ్చేద్దామని అంటుంది. ఆ తర్వాత భాగ్యం శ్రీవల్లి అమూల్య ముగ్గురు కలిసి ఎవరు చూడకుండా ఇంట్లోంచి బయటికి వెళ్లిపోతారు. బయటికి వెళ్ళగానే ప్రేమ ఇద్దరు కూడా కరెంట్ లేదని లైట్ వేయడం చూసి షాక్ అవుతారు. వాళ్ళని చూసి దాక్కున్న ముగ్గురు కూడా వాళ్ళ అలా వెళ్ళగానే బయటికి వెళ్లిపోతారు.
ఇక విశ్వం దగ్గరికి తీసుకెళ్లిన శ్రీవల్లి ఇదిగో అమూల్య ఏం మాట్లాడాలో మాట్లాడు అని అంటుంది. కానీ భాగ్యం మాత్రం ముందు మా ఆయన్ని తీసుకొచ్చి ఆ తర్వాత అమూల్యతో మాట్లాడొచ్చు అని అంటుంది. ఆనంద్ రావు తీసుకురమ్మని అంటాడు విశ్వం. ఆనంద్ రావు ని కొట్టి ఉండడం చూసి భాగ్యం దొంగ సచ్చినోళ్ళ రా మా ఆయన్ని ఎందుకు అంతగా కొట్టారు అని అడుగుతుంది . ఇప్పుడు అమూల్యతో మాట్లాడచ్చు అని భాగ్యం అనగానే విశ్వం ఏంటి అమూల్య ఇలా చేశావు మనిద్దరం పెళ్లి చేసుకుందాము.. లేచిపోదామని ఎన్నెన్నో అనుకున్నాం కదా కానీ నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు ఊహించలేదు అని అంటాడు..
Also Read :రాజేంద్రకు నిజం చెప్పేసిన అవని..అవనిపై శ్రీయ సీరియస్.. పల్లవికి అనుమానం..
అప్పుడు అన్నాను సరే.. ఇప్పుడు మాత్రం మా ఇంట్లో వాళ్ళ సంతోషాన్ని చూసి నేను రాలేకపోతున్నాను.. మనమేమీ పెళ్లి వరకు వెళ్లలేదు కదా ఇక్కడితో ఈ విషయాన్ని మర్చిపోమని అమూల్య అంటుంది. ఏం మాట్లాడుతున్నావే నువ్వు పో అంటే పోవడానికి రా అంటే రావడానికి నేను ఏమన్నా ఇదనుకున్నావా? భద్ర మేనల్లుడిని అని విశ్వం అంటాడు..ఇదంతా చూసినా భాగ్యం శ్రీవల్లి ఇద్దరు కూడా అమూల్యను తీసుకెళ్లకుండా ఆపై ప్రయత్నం చేస్తారు. విశ్వం మాత్రం అమూల్యని బలవంతంగా కారులో తీసుకొని వెళ్ళిపోతాడు.. శ్రీవల్లి ఎందుకు టెన్షన్ పడుతుందని అనుకుంటుంది.. అయింది అని అడిగితే ఏం కాలేదు అత్తయ్య వాటర్ కోసం వచ్చాను అని అంటుంది.. తీసుకెళ్లిన విశ్వం తాళి కట్టేందుకు ప్రయత్నం చేస్తాడు. విశ్వం నిజస్వరూపం తెలుసుకుని అమూల్య షాక్ అవుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..