Illu Illalu Pillalu Today Episode March 11th: నిన్నటి ఎపిసోడ్ లో.. అమూల్య తో పాటుగా భద్ర అందరు కూడా కలిసి భోజనం చేస్తూ ఉంటారు.. భద్ర ఆ రామరాజు మొహం తలుచుకుంటూ అన్నం తింటుంది పొరమాలడంతో అందరూ ఏమైందనుకుంటారు.. ఇది అన్నం గొంతులో అడ్డు పడినప్పుడు వచ్చినా పోరమాలుడు కాదు. ఆ రామరాజు కన్నీళ్లు పెట్టుకున్న మొహానికి గుర్తు చేసుకోవడం వల్ల వచ్చిన ఇది అని భద్ర అంటుంది.. ఆ రామరాజు ఎంతగా అవమానంతో తలదించుకున్నాడు మనం చూశాం కదా అది నాకు ఇప్పటికీ సంతోషాన్ని ఆపుకోలేనంతగా ఇచ్చేసింది అని భద్ర అంటుంది. వాడు అందరి దగ్గర అవమానపాలవ్వడం నేను చూడాలి అనుకున్నాను అది ఇప్పటికి జరిగింది అని చాలా సంతోషంగా ఉంటుంది భద్ర.
ఏంటి పెద్దమ్మ ఏం మాట్లాడుతున్నారు అని అమూల్య అంటుంది. మీరు కొంచమైనా ఆలోచించరా ఎందుకు మా నాన్న చెడు కోరుకోవాలి అనుకుంటారు అని అమూల్య అంటుంది.. మీరు ఎంతగా మా నాన్నని ఇబ్బంది పెట్టాలని చూసినా మీరు బాగుండాలని కోరుకునే వాడే మా నాన్న అని తన తండ్రి గురించి గొప్పగా చెప్తుంది అమూల్య.. భద్ర మాత్రం వార్నింగ్ ఇస్తుంది.. ధీరజ్ కారు విషయాన్ని రామారాజుకు చెప్పేస్తాడు. చివరికి ప్రేమకు ఎలాగైన ప్రపోజ్ చెయ్యాలని అనుకుంటాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. తండ్రికి క్షమాపణలు చెప్పడానికి వెళ్లిన సాగర్ కు ఆయన మాట విని షాక్ అవుతాడు. నన్ను మా నాన్న అర్థం చేసుకోడు అంటూ బాధపడతాడు.. నాకు ఇష్టమైన జాబును చేయాలి అనుకోవడం కూడా తప్పేనా? మా నాన్న ఇంతే నర్మదా ఇక ఎప్పటికీ మారడు అని సాగర్ అంటాడు. నువ్వు కేవలం మీ నాన్నకి చెప్పాలని అనుకున్నావు అంతే.. ఎవరైనా కూడా ఆయన ప్లేస్ లో ఉంటే అలానే అనుకుంటారు అని నర్మద ఎంతగా నచ్చ చెప్పాలని చూసినా సరే.. సాగర్ మాత్రం మా నాన్న ఇంతే నన్ను ఇంతే అర్థం చేసుకుంటాడు అని బాధపడిపోతూ ఉంటాడు.. ఆ తర్వాత రాత్రి అవ్వగానే ప్రేమకు ధీరజ్ ఇవ్వాలని అనుకుంటాడు.. అర్ధ రాత్రి అందరిని రమ్మని చెప్పి కేక్ కటింగ్ కి పిలుస్తాడు.. అది చూసిన ప్రేమ షాక్ అవుతుంది.
అందరూ కూడా నా బర్తడే ని గుర్తు పెట్టుకొని ఈ ఏర్పాట్లు చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని ప్రేమ అంటుంది. ఇవన్నీ మేమేమీ చేయలేదు మొత్తం చేసింది ధీరజ్.. మేము జస్ట్ గెస్ట్లుగా మాత్రమే విష్ చేయడానికి వచ్చాము అని నర్మదా చందు ఇద్దరు అంటారు. నా బర్త్ డే నీకు గుర్తుందంటే నేను నమ్మలేకపోతున్నాను రా అని ప్రేమ అంటుంది. నీ బర్త్ డే ని మర్చిపోతే నీకు అదే గుర్తుపెట్టుకోవడానికి అని ధీరజ్ అంటాడు.. వీరిద్దరూ ఒకరినొకరు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ మాట్లాడుకోవడం చూసిన నర్మదా.. మీరు చూసుకోవడం ఆపేసి కేక్ కట్ చేసి మా మోహన కేక్ ముక్క పడేస్తే తినేసి వెళ్ళిపోతాం.. ఆ తర్వాత మీరిద్దరే కలలోకి కళ్ళు పెట్టి చూసుకుంటూ మాట్లాడుకోవచ్చు అని అంటుంది.
వీరిద్దరి నువ్వులనే చూడలేకపోతున్నాను అని శ్రీవల్లి మనసులో తెగ కుళ్ళుకుంటుంది.. ఎలాగైనా సరే ఈసారి ఇద్దరూ ఒక్క చెల్లెలను విడగొట్టాలి అని అనుకుంటుంది. వీళ్ళ ముచ్చట చూడలేక అర్ధరాత్రి లేచి వచ్చినట్లు ఉంది అని శ్రీవల్లి అనుకుంటుంది. ఇక ప్రేమ చేత ధీరజ్ కేక్ కట్ చేస్తాడు.. ఇక తర్వాత అందరూ వెళ్లిపోయిన తర్వాత.. ప్రేమ ధీరజ్ ఇద్దరే ఒకరినొకరు చూసుకుంటూ ఉండిపోతారు. ఎపిసోడ్ కి ఇదే హైలెట్గా నిలుస్తుంది. ఇక ప్రేమకు ధీరజ్ రింగ్ ఇచ్చి మరి ప్రపోజ్ చేస్తాడు. అది చూసిన ప్రేమ షాక్ అయిపోవడంతో పాటుగా తీరదు మనసులో నామీద ఇంత ప్రేమ ఉందా అని అనుకుంటుంది.
Also Read :అవనికి నిజం చెప్పేసిన చక్రధర్.. పల్లవి గుట్టు రట్టు.. కూతురు కోసం భానుమతి కన్నీళ్లు..
రింగ్ పెట్టిన తర్వాత తీరజ్ విల్ యు మ్యారి మీ అని అంటాడు.. మనిద్దరికీ ఆల్రెడీ పెళ్లయిపోయింది రా అని ప్రేమ అన్నా సరే మళ్లీ మనిద్దరం పెళ్లి చేసుకుందామా అని చాలా సంతోషంగా ఉంటాడు. ఆ మాటలు విన్న ప్రేమ గాల్లో తేలిపోతుంది. మొత్తానికి ధీరజ్ ప్రేమలు మళ్లీ ప్రేమలో పడతారు. ఆ తర్వాత రోజు శ్రీవల్లి చందు దగ్గర నుంచి డబ్బులు కొట్టేయాలని ప్లాన్ చేస్తుంది. కానీ చందు శ్రీవల్లికి ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వలేదని బాధ పడిపోతుంది. తర్వాత రోజు రామరాజు మాత్రం నేను మిల్లుకు వెళ్లలేను బుజ్జమ్మ అని బాధపడిపోతూ ఉంటాడు. ఎవరు ఏదో అన్నారని మీరు ఎందుకు అంటే బాధపడడం అని వేదవతి అంటుంది.. కారు డబ్బు కోసం ధీరజ్ ప్రయత్నాలు చేస్తుంటాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..