Intinti Ramayanam Today Episode February 12th: నిన్నటి ఎపిసోడ్ లో.. పల్లవి మాత్రం ఏదో టెన్షన్ పడుతున్నట్లు అవని అనుకుంటుంది. సరే ఈ ముసలోడని చంపాలని పల్లవి ప్లాన్ చేస్తూ ఉంటుంది.. రాజేంద్రప్రసాద్ ను చూసి పల్లవి షాక్ అవుతుంది.. రాజేంద్ర పల్లవి ఎటు తిరిగితే అటు తిరగడంతో ముసలోడు వచ్చాడేమో అని పల్లవి కంగారు పడిపోతూ ఉంటుంది.. నా గురించి మొత్తం చెప్పేస్తాడేమో అని పల్లవి టెన్షన్ పడిపోతూ ఉంటుంది.. నేనే అతనికి క్షమాపణ చెప్పే సరిపోతుంది కదా ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అని పల్లవి మావయ్య గారు అది నేను ఎందుకు అలా చేశాను అంటే అని చెప్పబోతోంది. అప్పుడు కింద నుంచి కోటిలింగం పైకి లేస్తాడు. వీల్చరు స్క్రూ లూజ్ అయిపోయింది అందుకే నేను టైట్ చేశాను.
అందులో తప్పేమీ లేదు కదా అని కోటిలింగం అంటాడు.. మాట వినగానే పల్లవి కోటిలింగం చెంప పగలగొడుతుంది. శ్రీమంతం ఏర్పాట్లను చాలా గ్రాండ్ గా చేస్తారు.. పల్లవి కూడా ఈ వేడుకకు చాలా అందంగా రెడీ అయి రావాలని అనుకుంటుంది. ఇక అందరూ కలిసి సీమంతం చేసేందుకు శ్రీ యని కూర్చోబెడతారు.. అవని ఆ సీమంతం వేడుకలని చాలా గొప్పగా చేయాలని అనుకుంటుంది.. ప్రణతి భరతులు మనము శ్రేయ వదిన కోసం చీర గాజులై తీసుకొచ్చాము కదా మీరు పెట్టండి అత్తయ్య అని మీనాక్షిని అడుగుతుంది. లేదమ్మా నా గురించి తెలిసే నువ్వు ఇలా మాట్లాడుతున్నావా నువ్వే పెట్టు అని మీనాక్షి అంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. పల్లవి కావాలని మీనాక్షిని అవమానించేలా మాట్లాడాలా ప్లాన్ చేస్తుంది. అక్కడున్న ముత్తైదులతో మాట్లాడి మీనాక్షిని ఎలాగైనా సరే అవమానం ఎలా చేయాలని అనుకుంటుంది. అయితే మీనాక్షి బొట్టు పెట్ట పోతుంటే నువ్వు శ్రియకి బొట్టు పెడితే నీలాగే తయారవ్వాలని అనుకుంటున్నావా? నీకు భర్త లేడు ఆ విషయాన్ని నువ్వు మర్చిపోవద్దని అక్కడున్న ఓ మహిళ అంటుంది.. నీ కూతురు కంటే భర్త ఉన్నాడు కాబట్టి ఆమె ఏదైనా చేయొచ్చు.. కానీ నీకు భర్త ఎవరో కూడా తెలియదు నువ్వెలా గర్భవతికి బొట్టు పెడతావు అని అందరూ నిందిస్తారు. భర్త ఎవరో తెలియని నువ్వు ఇలాంటి ఫంక్షన్లకు రావడం కూడా తప్పే అది నువ్వు గుర్తుపెట్టుకోవా? అని అక్కడున్న వాళ్ళు దారుణంగా మాట్లాడడంతో.. మీనాక్షి కన్నీళ్లు పెట్టుకుంటుంది..
ఆ తర్వాత అందరూ తలా ఒక మాట మాట్లాడుతుంటే.. భానుమతి కూడా మా ఇంట్లో ఇలాంటి ఫంక్షన్ జరుగుతున్నప్పుడు నువ్వు రావద్దు అని చెప్పాను కదా.. మరి ఎందుకు వచ్చావు అని అరుస్తుంది.. భరత్ మా అమ్మని ఒక్క మాటంటే మర్యాదగా ఉండదు. ఏం మాట్లాడుతున్నారు మీరందరూ అని అంటాడు.. భరత్ ఇది ఫంక్షన్ నీకేం తెలీదు నువ్వు గమ్మునుండు అని అవని భరత్ ని ఆపుతుంది. ఆ తర్వాత ఆరాధ్యను మీనాక్షిని లోపలికి తీసుకు వెళ్ళమని చెప్తుంది. నేను ఇలాంటి ఫంక్షన్లకు వచ్చి తప్పు చేశాను. అందరూ నా పిల్లల్ని కూడా తలా ఒక మాట అంటున్నారు అని మీనాక్షి కన్నీళ్లు పెట్టుకుంటుంది.
మీ మామయ్య గారి చేత కూడా ఆశీర్వాదం ఇప్పిద్దాము అని పార్వతి అనగానే.. పల్లవి రాజేంద్రప్రసాద్ నీ శ్రేయ దగ్గరికి తీసుకుని వెళ్తుంది. అయితే శ్రేయ కి ఆశీర్వదించమని చేతిలో అక్షింతలు పెట్టగానే వాటిని కింద పడేసి రాజేంద్రప్రసాద్ ఒక్కసారిగా లేస్తాడు. అది చూసినా అక్కడ వాళ్ళందరూ షాక్ అవుతారు. కానీ పల్లవి మాత్రం వీరికి స్పృహ వచ్చిందా అని షాక్ లో ఉండిపోతుంది.. వీడికి స్ప్రు వస్తే నా పని అయిపోయినట్లే అని పల్లవి కంగారు పడిపోతూ ఉంటుంది.. కానీ అందరూ రాజేంద్రప్రసాద్ లేచి కూర్చున్నాడని చాలా సంతోషంగా ఉంటారు… అయితే లేచిన రాజేంద్ర మళ్ళీ కింద పడిపోవడంతో ఏమైందని కంగారుపడుతూ డాక్టర్ని పిలుస్తారు..
Also Read : ‘పొదరిల్లు’ నారాయణ బ్యాగ్రౌండ్.. ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎంతంటే..?
డాక్టర్ అక్కడికి వచ్చి మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్లమని చెప్పి నేను మంచి పని చేశాను. ఆయనకు రియాక్షన్ మొదలైంది.. త్వరలోనే ఆయన కోలుకుంటాడు అని డాక్టర్ చెప్పగానే అందరూ చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. ఇక అక్షయ్ తన తండ్రి త్వరలోనే కోరుకుంటున్నాడని చాలా సంతోషంగా ఉంటాడు. ఇక భరత్ మీనాక్షి తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మా నాన్న ఉన్నాడన్న ధైర్యంతో నేను ఎన్ని రోజులు బాగానే ఉన్నాను ఇప్పుడు మా నాన్న నీ పరిస్థితిలో చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది అని అక్షయ్ కన్నీళ్లు పెట్టుకుంటాడు. అందరికీ ధైర్యం చెప్పాల్సిన మీరు ఇలా బాధపడితే ఎలా అండి అని అవని అడుగుతుంది. ఎంత ధైర్యంగా ఉండాలని చూసినా కూడా మా నాన్నని ఇలా చూస్తుంటే నాకు బాధగా ఉంది అని అంటాడు. అక్కడితో ఎప్పుడు అవుతుంది. రేపటి ఎపిసోడ్లో పల్లవి పని పట్టేందుకు అవని ఒక భూత వైద్యున్ని తీసుకొని వస్తుంది. అతను పల్లవి బండారాన్ని బయటపెట్టేస్తాడేమో చూడాలి..