Intinti Ramayanam Today Episode February 2nd : నిన్నటి ఎపిసోడ్ లో.. పల్లవి గురించి అన్ని నిజాలు తెలుసుకున్న రాజేంద్రప్రసాద్ ఆ మాటని పల్లవితో చెప్పి దిమ్మ తిరిగిపోయే షాక్ ఇస్తాడు.. ఏంటి ఇలా జరిగింది నా గురించి మాయక్ అంత తెలిసిపోయింది ఇప్పుడు నేనేం చేయాలి అని పల్లవి కంగారు పడిపోతూ ఉంటుంది.. ఇంటి పరువు పోతుంది నీ సొంత చెల్లెలు ప్రాణాలతో ఉండదు అని ఎంత చెప్తున్నా సరే రాజేంద్ర మాత్రం వినడు. నువ్వు చచ్చిపోతానని బెదిరిస్తున్నావు కదా చచ్చిపో నేను మాత్రం ఈ విషయాన్ని కమల్ తో చెప్తాను అని అంటారు.. అయితే పల్లవి రాజేంద్రని ఏదో ఒకటి చేయాలని ఫిక్స్ అవుతుంది..
ఇక పల్లవి రాజేంద్ర నా మాట వినడు అని అనుకుంటుంది.. నువ్వు ఎలాంటి దానివో నువ్వు చేస్తున్న మోసాలు ఏంటో కచ్చితంగా నేను కమల్ తో చెప్తాను అని రాజేంద్ర అంటాడు. పల్లవి మాత్రం ఈ ఫంక్షన్ ఎలాగైనా ఆగిపోవాలి రాజేంద్రని చంపేయాలని అనుకుంటుంది. రాజేంద్ర కమల్ ని పిలిచి పల్లవి గురించి అసలు విషయాన్ని చెప్పాలని అనుకుంటాడు.. ఈ క్రమంలో పల్లవి ఎలాగైనా సరే ఈ విషయాన్ని చెప్పకుండా ఆపాలని అనుకుంటుంది.. పైన చివరి వరకు నిలబడుకున్న రాజేంద్రను తోసేస్తుంది.. ఎవరో పడిపోయారు అని అందరూ అక్కడికి వెళ్లి చూడగా రాజేంద్ర కింద పడి ఉంటాడు.. ఒక్కసారిగా అందరూ ఆ స్థితిలో రాజేంద్రని చూసి షాక్ అవుతారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. పడిపోయిన రాజేంద్రని చూసి ఇంట్లోని వాళ్ళందరూ కంగారు పడిపోతూ దేవున్ని ప్రార్థిస్తూ ఉంటారు.. అయితే అప్పుడు వచ్చిన డాక్టర్ అతని పరిస్థితి క్రిటికల్ గా ఉంది ఏమి చెప్పలేము అని అంటారు.. ఆ మాట వినగానే పల్లవి నేను తప్పించుకున్నాను అని సంతోష్ పడిపోతూ ఉంటుంది.. మావయ్య కి ఇలా జరగడానికి కారణం అవనీనేని పల్లవి అంటుంది. మావయ్య తో అవనితో మామయ్య ఏదో గొడవ పడుతున్నాడు నేను చూశాను అని అంటుంది పల్లవి.. ఏం మాట్లాడుతున్నావ్ పల్లవి కొంచమైనా బుద్ధి ఉంటే మాట్లాడుతున్నావా అని అంటుంది అవని..అప్పుడు నువ్వు మావయ్యతో మాట్లాడావా ఏం మాట్లాడావు అసలు అని పార్వతి అంటుంది.. నేను మాట్లాడింది వేరు గొడవ పడలేదు ఏది అనలేదు అని అవని ఎంత చెప్తున్నా సరే పల్లవి మాత్రం అందరిని నమ్మించే ప్రయత్నం చేస్తుంది.. ఆ తర్వాత పోలీసులు ఎంట్రీ ఇస్తారు.
రాజేంద్రప్రసాద్ పైనుంచి కింద ఎలా పడిపోయారు అని అడుగుతారు. పార్టీలో అందరూ ఉండగా పైకి ఆయన ఒక్కడే ఎందుకు వెళ్ళాడు అని అడుగుతారు.. పల్లవి ఎక్కడ తాను దొరికిపోతుందో అని మామయ్య ఒక్కడే పైకి వెళ్ళాడు. ఏదో కంగారుపడుతూ కనిపించాడు అని అంటుంది.. నేను తప్పించుకోవాలంటే అవనిని అడ్డుపెట్టుకోవాలి అని అనుకుంటుంది. అనుకున్నట్లుగానే అవనిని ఇరికించే ప్రయత్నం చేస్తుంది.. ఇక అక్కడున్న వాళ్ళందరూ కూడా అవినీతి తప్పు అంటారు. రాజేంద్రప్రసాద్ అవని వల్లే బాధపడ్డాడు అని ఆయన ఫ్రెండ్స్ కూడా అంటున్నారు.
పల్లవి మాటలకు సపోర్టు దొరికిందని సంతోష పడిపోతూ ఉంటుంది.. ఇక పోలీసులు ఇక్కడున్న వాళ్ళందరూ మిమ్మల్ని అనుమానిస్తున్నారు.. మిమ్మల్ని ఒకసారి ఈ పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఎంక్వయిరీ చేయాలి అని అవని పోలీసులు తీసుకుని వెళ్తారు. ఏంటి అవి ఇలా జరుగుతుందని అక్షయ అన్నా కూడా ఇప్పుడు నేను మీకు ఏం చెప్పలేనండి మావయ్య గారు జాగ్రత్త అని అంటుంది.. పల్లవి నేను తప్పించుకున్నానని చాలా సంతోషంగా ఉంటుంది. అవనిని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లగానే అక్కడికి ఎస్సై గారు ఎక్కడ అభి వచ్చి ఏమైందని అపుడుగుతారు. మీ మామయ్య గారు సొసైటీలో చాలా పేరున్న వాళ్ళు అలాంటి వ్యక్తి ఇలాంటి నిర్ణయం తీసుకోవాలని ఎలా అనుకుంటారు అని అతను అడుగుతారు.
దానికి అవని నాకు అర్థం కావట్లేదండి ఆయన అంత పిరికివాడైతే కాదు.. కచ్చితంగా ఏం జరిగిందో నీకు తెలుసుకుంటాను అని అభి అంటారు. ఇక అభి ఏమైనా ఫ్రెండ్ వైపు ఈ కేసు నేను టేకప్ చేస్తాను అని అంటారు. అభి అవనిని తీసుకొని వెళ్తాడు. ఇక మనము రాజేంద్రప్రసాద్ ఎక్కడ కిందపడ్డాడు అక్కడికి వెళ్లి ఏదైనా క్లూ దొరుకుతుంది ఏమో తెలుసుకుందామని అవనిని కూడా అక్కడికి తీసుకొని వెళ్తాడు. ఇంట్లోని వాళ్ళందరూ కూడా రాజేంద్రప్రసాద్ కోసం బాధపడిపోతూ ఉంటారు. డాక్టరు పరిస్థితి క్రిటికల్ గానే ఉంది అని అనడంతో అక్కడ వాళ్ళందరూ కన్నీళ్లు పెట్టుకుంటారు..
Also Read :సత్యంకు నిజం చెప్పిన బాలు.. శోభకు శృతి వార్నింగ్.. రోహిణికి దిమ్మతిరిగే షాక్..
ఇక రాజేశ్వరి నా భార్య గొప్పది అని ఎన్నోసార్లు అన్నావు కదా ఇప్పుడు ఏం జరిగింది.. నా భర్తను రావడానికి నువ్వు ఒప్పుకున్నా నీ భార్య నీ మాట వినలేదు.. దేవుడు లాంటి మీ నాన్న ఇలాంటి పరిస్థితిలో ఉన్నాడని కారణం నీ భార్య. ఇన్ని జరుగుతున్న కూడా ఇప్పటికే నీ భార్య మంచిదని అనుకుంటావా అని రాజేశ్వరి అడుగుతుంది. అవనిని అవి పోలీస్ స్టేషన్ కి తీసుకొని వస్తాడు. అభినవ్ చూసిన పల్లవి టెన్షన్ పడిపోతూ ఉంటుంది.. రాజేంద్రప్రసాద్ గారు పైనుంచి కింద పడ్డారని మీరు అనుకున్న కూడా ఆయన ఎలా పడ్డారు ఎందుకు పడ్డారు అన్నది నేను తెలుసుకుంటానని అభి అనడంతో పల్లవి షాక్ అవుతుంది.. అభి కి పల్లవి పై అనుమానం వస్తుంది. అని అడిగి తెలుసుకుంటాడు. ఆ తర్వాత అభి పల్లవి ఎంత చెప్తున్నారు సరే వినడు.. పదిమంది చెప్పినంత మాత్రాన అబద్ధం నిజం కాదు నిజం అబద్ధం కాదు అదేంటో నేను తెలుసుకుంటాను అని అభి అంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. ఇక రేపటి ఎపిసోడ్ లో పల్లవి రాజేంద్రప్రసాద్ ని చంపేందుకు ప్రయత్నాలు చేస్తుంది..