Intinti Ramayanam Today Episode January 11th : నిన్నటి ఎపిసోడ్ లో.. పల్లవి చక్రధర్ని కలవడానికి జైలుకు వెళుతుంది.. ఆ డాక్యుమెంట్స్ కనిపించాయా నీకు అని పల్లవిని చక్రధర అడుగుతాడు. కాని పల్లవి మాత్రం ఎంత వెతికిన కనిపించలేదు డాడ్ అని అంటుంది.. అవి కేవలం ఆస్తి పత్రాలు మాత్రమే కాదు అవినీతి నేను తండ్రి అని నిరూపించే పత్రాలు కూడా.. వాటిని మీ అమ్మ చూసిందనుకో కచ్చితంగా నాకు విడాకులు ఇవ్వడానికి కూడా వెనకాడదు.. ఆ డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయో కనుక్కో… మన చేతికి వస్తే ఆ అవని సంగతి చూడొచ్చు అని చక్రధర్ అంటాడు..అక్షయ్, రాజేంద్రప్రసాద్ ఇద్దరూ కూడా బిజినెస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మొన్నటి వరకు ఎటువంటి ప్రయోజనం లేదు అనుకున్నవి ఇప్పుడు బాగా లాభలను చేస్తున్నాయి ఇలాంటి వాటిలో పెట్టుబడి పెడితే బాగుంటుంది అని అనుకుంటారు..
అయితే అక్షయ్ తన దగ్గర ఒక ప్లాన్ ఉందని చెప్తాడు.. శ్రీకర్ కమల్ని కూడా అక్షయ్ రమ్మని పిలుస్తాడు. ఇది మనం పెట్టబోయే బిజినెస్ గురించి డీటెయిల్స్ రా అని అనగానే అవునా అన్నయ్య మీరు మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నారా అని శ్రీకర్ అడుగుతాడు. నేను మాత్రమే కాదురా మన ముగ్గురం కలిసి బిజినెస్ ని స్టార్ట్ చేయాలి.. అక్షయ్ తీసుకున్న నిర్ణయానికి రాజేంద్రప్రసాద్ చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు.. శ్రేయ తల్లి కాబోతున్న సందర్భంగా చాలా సంతోషంగా ఇంట్లోని వాళ్ళందరూ ఉంటారు. అవని దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ తీసుకోవాలని పల్లవి శతవిధాలా ప్రయత్నిస్తుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ప్రోమో విషయానికి వస్తే.. పార్వతి భానుమతి కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగా శ్రేయ నీరసంగా ఉంది అని వస్తుంది.. శ్రీయాకు దగ్గరుండి మరి సేవలు చేస్తారు.. శ్రేయ కి ఏమడిగితే అది అన్ని దగ్గరుండి తీసుకొచ్చి ఇస్తారు.. నాకు ఆకలేస్తుంది ఏదైనా తినాలనిపిస్తుంది అని పులిహార కావాలని అడుగుతుంది.. అయితే అవని పులిహార చేసుకుని శ్రేయా దగ్గరికి తీసుకుని వస్తుంది. జయ కి సేవలు చేయడం చూసిన పల్లవి కుళ్ళుకుంటుంది.. ఎలాగైనా సరే దీని కడుపు పోతే బాగుంటుంది అని అనుకుంటుంది..
అవని పులిహార చేస్తే శ్రియ మాత్రం పులిహోర నాకు నచ్చలేదు దోస కావాలని అడుగుతుంది. అవని వెళ్లి దోశ చేసుకుని వస్తే ఇదంతా ఆయిల్ గా ఉంది నాకు ఏమీ వద్దు అని అంటుంది.. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావ్ నీకేం కావాలో చెప్పు అని అవని అడుగుతుంది. కడుపుతో ఉన్న పిల్ల అవి ఇవి తినాలని అనుకుంటుంది కదా ఏం అడిగితే అది చేసి పెట్టాలి అని భానుమతి అవని పై సీరియస్ అవుతుంది. అవని నీ ప్రతిసారి అది చెయ్యి ఇది చెయ్యి అని శ్రియ చెబుతూ ఉంటుంది. కానీ అవని మాత్రం ఏ మాత్రం కోప్పడకుండా ఏం చెప్తే అది చేస్తుంది.. పల్లవి మాత్రం ఇదంతా చూస్తూ ఊరలేక పోతుంది..
ఈ శ్రియా నాకన్నా ముందు తల్లికి కాబోతుంది కాబట్టి దీనికి అన్ని సేవలు చేస్తూ మహారాణి లాగా చూసుకుంటున్నారు అని కుళ్ళుకుంటుంది.. అయితే శ్రేయ వాళ్ళ దగ్గరికి వచ్చిన పల్లవి మీరు అడగడం సరిపోయింది ఆమె మహారాణి లాగా ఆర్డర్ వేయడం సరిపోయింది అని అంటుంది. కొత్తగా ఈ సేవలేంటి ఎప్పుడు లేనిది మరీ ఇంత సాగించుకోవాల్సిన అవసరం లేదు కదా అనేసి శ్రీయ అని కూడా పల్లవి తిడుతుంది.. అయితే అది కడుపుతో ఉంది కాబట్టి దానికి ఏం చేసినా కూడా సరిపోతుంది. కడుపుతో ఉన్న ఆడవాలకి ఎన్నో కోరికలుంటాయి నువ్వు కూడా కడుపుతో ఉండు ఆ తర్వాత నీకు కూడా ఇలాంటి సేవలు చేస్తామని భానుమతి పల్లవితో అంటుంది.
Also Read :రోహిణి బండారం బయటపడుతుందా..? ఇంట్లో బాంబ్ పేల్చిన మీనా.. అయ్యో ఇలా జరిగిందేంటి..?
పల్లవి చైతన్య పనికి అవనికి అనుమానం మొదలవుతుంది.. పల్లవి దేని కోసమో నా గదిలో వెతుకుతుంది అది ఏంటి అనేది తెలియలేదు.. అదేంటో తెలుసుకోవాలి ఎన్నిసార్లు నా గదిలో వెతుకుతూ కనిపించింది కదా. ఏదో బలమైన వస్తువు కోసమే వెతుకుతుంది కానీ అది ఏంటో తెలుసుకొని పల్లవి ఆట కట్టించాలి అని అవని అనుకుంటుంది. ప్రతి సారీ పల్లవి ఏదో చేయాలని అనుకుంటుంది . ఈసారి ఏం చేయాలనుకుంటుంది అన్నది తెలుసుకొని తనకి రివర్స్ షాక్ ఇవ్వాలని అవని ఫిక్స్ అవుతుంది. ఆ తర్వాత మీనాక్షి రావడంతో పార్వతీతో సహా పల్లవి భానుమతి ముగ్గురు కూడా తనని దారుణంగా అవమానిస్తారు. అవని తన తల్లికి అవమానం జరుగుతుందని బాధపడుతుంది అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది.. సోమవారం ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి…