Intinti Ramayanam Today Episode January 7th : నిన్నటి ఎపిసోడ్ లో.. అతని చూడగానే అక్షయ్ కమల్ ఇద్దరూ రెచ్చిపోయి గల్లా పట్టుకుంటారు.. అక్కడున్న వాళ్ళందరూ కూడా ఆయన మా ఊరి సర్పంచి అయిన ఏమైనా చేస్తే మీరు ఈ ఊరి పొలిమేర దాటి వెళ్ళలేరు అని అంటారు.. ఈ అవని క్యారెక్టర్ చాలా చెడ్డదని విన్నాను ఈమె గురించి అన్ని తెలుసుకునే వచ్చాను ఈమె అలాంటిది కదా అనేసి ఏక లింగం అంటాడు.. ఇక నగలను అమ్మవారికి అలంకరించాలని పూజారి చెప్తాడు.. అవి ఒరిజినల్ నగలు కాదో తేల్చండి ముందు ఆ తర్వాతే అమ్మవారికి పెట్టొచ్చు అని ఏక లింగం అంటాడు. అవనిని అందరూ అవమానిస్తూ ఉంటే అవని మాత్రం దేవుడి దగ్గరికి వెళ్లి వీళ్ళందరూ నన్ను మోసగత్తే అంటున్నారు అమ్మ నువ్వు నా తప్పేమీ లేదని నిరూపించు అని కోపంగా మాట్లాడుతుంది..
అవని అమ్మవారి పూనిన్నట్లు ప్రవర్తిస్తుంది.. ఏకలింగని త్రిశూలం పట్టుకొని పరిగెత్తిస్తుంది. అది చూసి అవనికి నిజంగానే అమ్మవారు కూనిందని అందరూ పరిగెత్తుకుంటూ వెళ్తారు.. నిజంగానే ఏకలింగం తప్పు చేశాడని అందరూ అనుకుంటారు.. అయితే ఏక లింగం నీ పోలీసుల అరెస్టు చేసిన తర్వాత ఇక ఊరు నుంచి మేము వెళ్ళిపోతున్నామని రాజేంద్ర ప్రసాద్ చెప్తాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. రాజేంద్రప్రసాద్ కుటుంబం మళ్ళీ తిరిగి హైదరాబాద్ కి వస్తారు. అయితే హైదరాబాదులో ఉండే రెంట్ హౌస్ కి రావడంతోనే పల్లవి రియల్ ఇద్దరు రచ్చ రచ్చ చేస్తారు. ఊరు నుంచి రాగానే మనం ఆ ఇంటికి వెళ్దాం అని అనుకున్నారు అయితే మీరేంటి మళ్లీ ఇక్కడికి తీసుకొచ్చారు అని పల్లవి శ్రీ వాళ్ళిద్దరూ కూడా రచ్చ చేస్తారు. అప్పుడంటే మనకి డబ్బులు లేవు పరిస్థితులు బాగోలేవు కాబట్టి మనము ఈ అద్దె కొంపలో ఇరికిరుకు ఇంట్లో చాలా సర్దుకుని ఉన్నాము.. మన ఇల్లు మన ఆస్తులు మనకు వచ్చేసాయి కదా ఇప్పుడు కూడా మనం ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏంటి అని వాళ్ళు అడుగుతారు. ఇంకా ఇక్కడే ఉంచి ఇబ్బందులు పెట్టాలని అనుకుంటున్నారా అని రాజేంద్రప్రసాద్ ని ఇద్దరు కోడలు నిలదీస్తారు.
అయితే రాజేంద్రప్రసాద్ మాత్రం మౌనంగా ఉంటాడు. అవని పార్వతి ఎంత చెప్తున్నా సరే పల్లవి రియల్ మాత్రం ఇంట్లో ఉండడానికి మేము అసలు ఒప్పుకునే ఒప్పుకోమని అంటారు. మావయ్య గారిని ఎదిరించే అంత ధైర్యం మీకు ఎవరు ఇచ్చారు ఎప్పుడు ఏం చేయాలో ఆయన బాగా తెలుసు మీరు మావయ్య గారిని ప్రశ్నించే అంత అధికారం మీకు ఎవరు ఇచ్చారు అని అవని అంటుంది. మీరు మొన్నటి వరకు ఆ ఊర్లో చాలా కష్టపడి అన్ని నేర్చుకుని వచ్చారు. ఇప్పుడు మళ్లీ మనం ఆ ఇంటికి వెళ్తే మీరు ఆ కష్టాన్ని మర్చిపోయి మళ్ళీ సుఖాలకు అలవాటు పడతారు అందుకే కొన్ని రోజులు ఇక్కడుండి ఆ తర్వాత వెళ్దామని రాజేంద్రప్రసాద్ అంటాడు.
ఇక అందరూ కలిసి ఇంట్లోకి వెళ్తారు.. రాజేంద్రప్రసాద్ తన ముగ్గురు కొడుకులతో మాట్లాడాలని అనుకుంటాడు. మీరు ముందుగా ఫ్రెష్ ఇయ్యండి ఆ తర్వాత మాట్లాడుకుందామని అంటాడు. ఇక తర్వాత చక్రధర్ దగ్గరికి రాజేశ్వరి వెళ్తుంది. మిమ్మల్ని బయట తీసుకురావడానికి నేను మా వాళ్ళ కాళ్ళ వెళ్ళబడ్డాను అయినా కానీ వాళ్ళు మిమ్మల్ని తీసుకురావడానికి ఒప్పుకోవడం లేదు అని అంటుంది. నాకు తెలుసు నేను మార్పు కోసం చూశాను. ఇన్నాళ్లకు నాకు మారే అవకాశం వచ్చింది అయినా కూడా మీ వాళ్ళు నా మీద కనికరం చూపించడం లేదు నువ్వు ఇంకేమి వాళ్ళని అడగద్దు అని నమ్మకంగా తన మాటలతో బుట్టలో వేసుకుంటాడు..
Also Read : రోహిణికి కొత్త టెన్షన్.. గుడ్ న్యూస్ చెప్పిన సుమతి.. ప్రభావతికి దిమ్మతిరిగే కౌంటర్..
నువ్వు ఇకమీదట ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. నువ్వు నాకోసం ఒక కష్టపడాల్సిన అవసరం లేదని చక్రధర్ అంటాడు.. అయితే రాజేశ్వరి నేను ఇక వాళ్ళని అడగండి ఒక మంచి లాయర్ ని పెట్టి మీకు బెయిల్ ఇప్పిస్తాను అని రాజేశ్వరి అంటుంది. ఇక తర్వాత రాజేంద్రప్రసాద్ తన ముగ్గురు కొడుకులు తో మాట్లాడుతాడు. నేను బతుకునంత వరకు నాశన పంచాలని అనుకోవట్లేదు మీరు ఎప్పుడు ఇలానే కలిసి ఉండాలని నా కోరిక అని అంటాడు. శ్రీకర్ మాత్రం తన భార్యకు ఎలా చెప్పాలో అని ఆలోచిస్తూ ఉంటాడు.. మొత్తానికి తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం ముగ్గురు కూడా ఒక ఇంట్లో కలిసి ఉంటామని చెప్తారు. ఇక తర్వాత అక్షయ్ అవని దగ్గరకు వస్తాడు. అవని ఏమైందండీ మీ నాన్నగారితో మాట్లాడాలి అన్నారు నాకు చెప్పండి విషయం ఏంటి అని అడుగుతుంది. అక్కడితో ఎపిసోడ్ ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..