Intinti Ramayanam Today Episode November 6th : నిన్నటి ఎపిసోడ్ విషయానికొస్తే… అవని ఏడవడం చూసి పల్లవి మురిసిపోతుంది పల్లవి. ఇలా ఏడుస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అనేసి సంబరపడిపోతుంది. శ్రీకర్ బావను నాకు దూరం చేసి శ్రియతో పెళ్లి చేశావు.ఇద్దరి మధ్య వాదన వినిపిస్తుంది. చివరికి నన్ను ఏడిపించాలని నాతో గెలవాలని ప్రయత్నాలు చేస్తున్నావ్ నేను అంత సులువుగా ఓడిపోతానని అనుకోవద్దు పల్లవి అని అవని సీరియస్ వార్నింగ్ ఇస్తుంది. ఇక అక్షయ్ అవనిని తిడతాడు. ఆరాధ్య అమ్మకు సారీ చెబితేనే మాట్లాడతాను అంటుంది. దానికి అక్షయ్ వెళ్తాడు.. ఇక పల్లవి ప్రెగ్నెన్సీ టెస్ట్ ని చేసుకుంటుంది అందులో పాజిటివ్ వస్తుంది. డాక్టర్ కి ఫోన్ చేస్తుంది డాక్టర్ కావాలనే ఫోన్ లిఫ్ట్ చేయదు ఇలా కాదు నేను డాక్టర్ దగ్గరికి ఎల్లేసి నేరుగా తెలుసుకోవాలని వెళుతుంది. తలుపు తీయగానే పార్వతి ఉంటారు. ప్రెగ్నెన్సీ టెస్ట్ కోసం కిట్టు తెప్పించుకున్నావంట ఏం వచ్చింది అని అడుగుతారు. అవి దాన్ని తీసుకొచ్చి పాజిటివ్ వచ్చింది అత్తయ్య పల్లవి ప్రెగ్నెంట్ అని అంటుంది, పల్లవి ప్రెగ్నెంట్ అని తెలుసుకొని ఇంట్లో అందరూ సంబరి పడిపోతారు. ఇక ఈ విషయాన్ని రాజేంద్రప్రసాద్ తో చెప్పాలని పార్వతీ వెళ్తుంది. ఇంట్లో అందరూ కలిసి పల్లవికి కమల్ కి కంగ్రాట్స్ చెప్తారు . అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. పల్లవి ప్రెగ్నెంట్ అని తెలుసుకున్న ఇంట్లో అందరు సంతోషంగా ఉంటారు. ఇక అప్పుడే డాక్టర్ వస్తుంది. డాక్టర్ ను ఎందుకు పిలిచారు. అంటే దానికి అవని నేనే పిలిచాను అత్తయ్య అంటుంది. ఈ ఎలెక్ట్రానిక్ వాటిని నమ్మడానికి లేదు అని అంటుంది. ఇక అందుకే డాక్టర్ ను పిలిపించాను అంటుంది. దానికి పార్వతి నేను పల్లవి తల్లయిందని సంతోషించాను కానీ హాస్పిటల్ కు తీసుకెళ్లాలనే ఆలోచననే లేదు. అవని మంచి పని చేసిందని చెప్పింది. ఇక అందరు అవనిని పొగుడుతారు. ప్రణవి కూడా వదినంటే అది అని చెబుతుంది. ఇక దానికి అక్షయ్ అబద్దాలు చెబుతుంది అని మనసులో అనుకుంటుంది. ఇక డాక్టర్ పల్లవిని చెక్ చేసి ప్రగ్నెంట్ అని చెబుతుంది. ఇక అందరు హ్యాపిగా ఫీల్ అవుతారు.
ఇక అవని అక్షయ్ దగ్గరకు వస్తుంది. ఏమండి మీతో మాట్లాడాలి అంటుంది. ఏమైంది అంటాడు. దీపావళి కదా.. అందరికి బట్టలు కొనాలని అంటుంది. అందరికి ఆల్రడీ నేను ఎప్పుడో కొనేసాను అంటాడు. దానికి అక్షయ్ ను నాకు కూడా కొన్నారా అంటుంది.. నేను సమయం వచ్చినప్పుడు అన్ని చెబుతానని అన్నాను కదా ఇక కోపం ఎందుకు అని అంటుంది. కాని అక్షయ్ కోపంగానే ఉంటాడు. ఇది కార్డు నువ్వే డబ్బులు కొనుక్కో అని అంటాడు. అప్పుడు పర్స్ లోనుంచి స్లిప్ కింద పడుతుంది. అది చూసిన అవని ఆఫీస్ తాలుకు సిసి కెమెరాల బిల్ అనుకుంటుంది. హాస్పిటల్లో సీసీ కెమెరాలు ఉంటాయి కదా అక్కడ అమ్మ దగ్గరకు వచ్చింది ఎవరో తెలుసుకోవాలని అవని హాస్పిటల్ కి వెళుతుంది. భరత్ అనే పిలవగానే ఏంటి అక్క ఫోన్ కూడా చేయకుండా వచ్చేసావంటే అమ్మని చూడాలనిపించి వచ్చాను భరత్ అనే నేను అంటుంది.అమ్మ ఇప్పుడే పడుకునింది అక్క బ్రెడ్డు పాలు ఇచ్చాను లేపమంటావా మాట్లాడుతుంది నీతో అనేసి అంటాడు. వద్దులే పడుకొని లే నేను ఇప్పుడే వస్తానని వెళ్తుంది. హాస్పిటల్లో రిసెప్షన్ లో కూర్చున్న వ్యక్తిని సీసీటీవీ పుట్టేస్ గురించి అడుగుతుంది. ఎందుకు మేడం ఏమైంది అని అడుగుతాడు మా అమ్మకి సీరియస్ అయింది ఎవరో వచ్చి వెళ్లారు మా అమ్మకి ఇంకొకసారి అలా అవ్వకుండా చూసుకోవాలని అందుకే అడిగాను అని అతనితో చెప్తుంది. అతను ఓకే మేడం రండి చూపిస్తానని తీసుకెళ్తాడు. సీసీటీవీ ఫుటేజ్ చూపించే లోపు డాక్టర్ వచ్చి ఇలాంటివి తప్పు అనేసి అంటాడు.
అంతకుముందే చక్రధర్ డాక్టర్ కి ఫోన్ చేసి సీసీటీవీ ఫుటేజ్ ను డిలీట్ చేయమని కోరుతాడు. ఇక పార్వతి అందరికీ స్వీట్ లిస్తోంది. పల్లవి వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పాలని చక్రధర్ కు ఫోన్ చేస్తుంది. మొన్న దీపావళికి పిలిచారు ఈరోజు ఇంకెందుకు పిలుస్తున్నారు అని అనుకొని కాల్ కట్ చేస్తాడు . ఇక పార్వతీ రాజేశ్వర్ కి ఫోన్ చేస్తుంది. వదిన మీరు అమ్మమ్మ కాబోతున్నారని చెబుతుంది. ఆ విషయాన్ని చక్రధర్ తో రాజేశ్వరి చెప్తుంది. అబార్షన్ అయింది కదా ఏంటి అని పల్లవికి ఫోన్ చేస్తాడు చక్రధర్. ఇక ఇంట్లో అందరూ దీపావళి సంబరాలు జరుపుకుంటారు. పల్లవి కి ఫోన్ చేసింది ఎవరు అని అవని ఆలోచిస్తుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది . రేపటి ఎపిసోడ్లో చక్రధర్ పల్లవిని అడుగుతాడు. నువ్వు తల్లి కాబోతున్న విషయం అందరికీ చెప్పావా అసలు ఏం జరుగుతుంది అని పల్లవి పై సీరియస్ అవుతాడు. అవనినే అందరికీ చెప్పేసింది అని పల్లవి అంటుంది. ఇక అక్షయ్ అవన్నీ పిలిచి సారీ చెప్తాడు. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..