Intinti Ramayanam Today Episode September 13th : తన తండ్రి కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న తర్వాత తండ్రి ఫోటోని పట్టుకొని ముగ్గురు కొడుకులు కూడా చాలా ఎమోషనల్ అయిపోతారు.. తన తండ్రిని ఎంతో బాగా చూసుకోవాలని అనుకున్న కూడా ఇలా చనిపోవడం బాధగా ఉంది అని అనుకుంటారు. తన తండ్రిని ఎంతో చక్కగా చూసుకోవాలని అనుకున్నాము కానీ ఆ అవకాశం లేకుండా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావు నాన్న అంటూ ముగ్గురు కొడుకులు కూడా చాలా బాధపడిపోతూ ఉంటారు. అయితే పల్లవి మాత్రం అత్తయ్యకి ఈ విషయం గురించి చెప్పి తనని కూడా పైకి పంపించాలి అని ఆలోచిస్తూ ఉంటుంది.. పార్వతిని చూసిన తన పిల్లలు మాత్రం తల్లి మనసుని బాధ పెట్టకూడదు అని ఆలోచిస్తూ ఉంటారు..
అవని ఇంట్లోని వాళ్ళందరూ బాధపడి పోతున్నారు అని చాలా బాధపడిపోతుంది. కన్న తండ్రి లాగా చూసుకున్న మావయ్య గారు లేకపోవడం ఇప్పుడు నాకు కూడా బాధగానే ఉంది ఈ బాధని దిగుమంగా కొని ఉండడం నాకు చాలా కష్టంగా ఉంది. మీరు ఇలా బాధపడి అత్తయ్య గారిని ఇంకా బాధ పెట్టేలా ఉన్నారు అని అక్షయ్ తో ఎంత చెప్తున్నా సరే తను మాత్రం కంట్రోల్ చేసుకోలేక ఏడ్చేస్తాడు. నాన్న లేని జీవితాన్ని నేను అస్సలు ఊహించుకోలేకపోతున్నాను అవినీ. నాకు ఎంతగా సపోర్ట్ చేస్తాడు. నన్ను ఇంట్లో పెద్దవాడిలాగా కాకుండా తనతో సమానంగానే చూసి నాకు అన్ని నేర్పించిన నాన్న ఇప్పుడు లేడు.. అంటే నేను తట్టుకోలేకపోతున్నాను అని అక్షయ్ చిన్నపిల్లల బాధ పడిపోతాడు. కాని కమల్ మాత్రం ఇంట్లో వాళ్ళందరినీ దృష్టిలో ఉంచుకొని నువ్వు ధైర్యం చెప్పే వదినా లేకుంటే అమ్మకి ఎప్పుడూ నిజం చెప్పే వాళ్ళము అని కమల్ చాలా బాధపడిపోతూ ఉంటాడు.
మనము ఇంకొన్ని రోజులు మావయ్య గారి గురించి అత్తయ్యకు చెప్పకపోవడమే మంచిది ఆమె ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఇప్పుడు మనం ఆవిడకి నిజం చెప్తే ఆవిడ బతకదు అని చాలా ఫీల్ అయిపోతుంది. అటు బామ్మ గారికి కూడా చెప్పే ఆవిడ మనసులో ఉంచుకోలేక అత్తయ్య గారికి చెప్పేస్తుంది. ఆరాధ్యకు బామ్మ కి అమ్మకి ఇప్పటికి తెలియకపోవడమే మంచిది అని అందరూ అనుకుంటారు. ఏది ఏమైనా కూడా ఇలాంటి పరిస్థితి రావడం చాలా బాధగా ఉంది. ఎప్పుడు నాన్నతో సరదాగా గడపాలని అనుకున్నాము. అప్పటినుంచి నాన్న మాకు దూరమయ్యాడు అని అందరూ కన్నీళ్లు పెట్టుకుంటారు. మావయ్య గారు లేని ఇంట్లో ఉండలేకపోతున్నాము అని అవినీతిపట్టు మిగిలిన వాళ్ళందరూ కూడా బాధపడిపోతూ ఉంటారు కానీ పల్లవి మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది.
ఇంట్లో అత్తయ్య గారికి నిజం తెలియనంతవరకి ఏదైనా ఒకవేళ నిజం తెలిస్తే మాత్రం ఆవిడ బతకదు అని చాలా ఫీల్ అయిపోతుంటుంది పల్లవి. నా గురించి నిజం తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే చచ్చిపోవాల్సిందే నేను ఎలాగైనా సరే అత్తయ్యకి నిజం తెలిసేలా చేస్తాను అని పల్లవి అనుకుంటుంది. కానీ పల్లవి ఎంతగా పార్వతికి నిజం తెలియాలని చేసిన కూడా మధ్యలో ఉన్న అవని మాత్రం పార్వతికి ఈ నిజాన్ని తెలియని ఇవ్వకపోవడమే మంచిది అని అనుకుంటుంది తప్ప పల్లవి మీద అవనికి అనుమానం రాదు. అవనీకి నా మీద అనుమానం రానంతవరకే ఆ తర్వాత నేను ఏం చేసినా కూడా తను రివర్స్లో నాకు షాక్ ఇస్తుంది అని చాలా ఫీల్ అయిపోతుంది. ఇక తర్వాత అవని పల్లవి అత్తయ్యకు ఎందుకు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుంది అని ఆలోచిస్తూ ఉంటుంది.
పల్లవిని చూసినప్పుడల్లా పార్వతి చాలా భయపడిపోతూ ఉంటుంది అసలు ఏమైంది పల్లవి ఎందుకు అత్తయ్యని చూసి భయపడిపోతుంది అత్తయ్య కూడా అంతే పల్లవి చూసినప్పటి నుంచి కంగారు పడిపోతున్నారు అని అవని ఆలోచిస్తూ ఉంటుంది అయితే పార్వతీ మాత్రం పల్లవిని నా కుటుంబాన్ని ఏమీ చేయొద్దు నీ గురించి నేను ఎవరికీ ఏమీ చెప్పను అని బ్రతిమలాడుతుంది కానీ పల్లవి మాత్రం ఈ కుటుంబం నాశనం అవ్వాలని నేను ఇంట్లో అడుగు పెట్టాను అలాంటిది ఈ కుటుంబం సంతోషంగా ఉంటే నేను ఎలా ఊరుకుంటాను అని అనుకుంటుంది తీసుకొని పల్లవి లోపలికి వెళ్ళగానే పార్వతి కంగారు పడిపోతూ ఉంటుంది.
కమల్ గదిలో ఒంటరిగా పడుకొని బాధపడిపోతూ ఉంటాడు నువ్వు ఇలా బాధపడిపోతేనే నాకు చాలా సంతోషంగా ఉంది బావ అని పల్లవి మనసులో అనుకొని సంతోష్ పడిపోతూ ఉంటుంది తండ్రి కోసం నువ్వు ఇంత బాధ పడిపోతున్నావు రేపు తల్లి పోతే ఏం చేస్తావో అని పల్లవి అనుకుంటూ ఉంటుంది ఇక కమల కోసం భోజనం తీసుకురావాలని పల్లవి తనకోసం భోజనం తీసుకొని వస్తుంది. కానీ కమల్ మాత్రం నాకు ఆకలి వేయట్లేదు చాలా బాధగా ఉంది. అంటూ అంటాడు ఆ మాట వినగానే పల్లవి నువ్వు బాధపడడమే నాకు కావాలి అని మనసులో అనుకుంటుంది. కానీ పైకి మాత్రం మనం చనిపోయిన వాళ్ల గురించి ఆలోచిస్తూ ఆరోగ్యం పాడు చేసుకోవడం తప్ప వాళ్ళు తిరిగి రారు కదా బావ.. ఈ విషయాన్ని నువ్వు గుర్తు పెట్టుకోవాలి అని పల్లవి అంటుంది. కానీ కమల్ మాత్రం పల్లవిని పట్టుకొని తండ్రి కోసం ఎమోషనల్ అయిపోయి చిన్న పిల్లల్లాగా ఏడ్చేస్తాడు. నీతో పాటు ఇంట్లోనే వాళ్ళందరూ ఇలా ఏర్పడమే నాకు కావాలి అని పల్లవి మనసులో అనుకుని చాలా సంతోషంగా ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది ఇక సోమవారం ఎపిసోడ్లో పల్లవి పార్వతికి నిజం చెప్తుందా లేదా అన్నది చూడాలి…