Intinti Ramayanam Today Episode September 17th : శ్రియ వంటగదిలో ఉన్న మీనాక్షి దగ్గరికి వెళ్లి బాబుకి ఉగ్గు చేస్తాను అన్నారు కదా ఏమేం కావాలి ఎలా చేయాలి చెప్పండి పిన్ని గారు అని అడుగుతుంది అప్పుడే అక్కడికి వచ్చిన అవనీని కందిపప్పు ఇవ్వమని అడిగితే.. తను అక్కడ ఉన్న పప్పులన్నీ ఇస్తుంది తప్ప కందిపప్పు ఇవ్వదు. ఏమైంది ఎందుకు అంత ధ్యానంగా ఉన్నావు అని అడుగుతారు. ఏమీ లేదమ్మా సడన్గా ఆ శ్రీరాం వాళ్ళమ్మ ఇంటికి వచ్చి అత్తయ్యకు బాగాలేదని అడిగింది కదా ఎవరో ఫోన్ చేస్తే రమ్మని పిలిచినట్లుగా ఆవిడ వచ్చింది అంటే ఎవరైనా నిజంగానే పిలిచారా లేదా ఆమె అత్తయ్య గారు ఆరోగ్యం బాగోలేదని తెలుసుకొని వచ్చిందా అన్నది క్లారిటీ రాలేదు.. కచ్చితంగా పల్లవిని ఇదంతా చేసి ఉంటుందని అవనికి అనుమానం ఇచ్చి పల్లవి దగ్గరికి వెళుతుంది.. అక్కడ పళ్ళు బిజినెస్ గురించి మాట్లాడుతూ ఉండదా? అవని ఒక్కసారిగా షాక్ అవుతుంది.
పల్లవి ఎలాగైనా సరే ఇంట్లో వాళ్ళందరికీ మనశ్శాంతి లేకుండా చేయాలి ముఖ్యంగా పార్వతికి రాజేంద్రప్రసాద్ చనిపోయారు అన్న నిజాన్ని తెలిసేలా చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అంతే కాదు తన బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని తన ఫ్రెండ్ తో ఫోన్ మాట్లాడుతూ కనిపిస్తుంది అప్పుడే అక్కడికి వచ్చిన మీనాక్షి అవని నువ్వు ఇప్పుడు బిజినెస్ గురించి మాట్లాడటం కరెక్ట్ కాదు పల్లవి అని చెప్తారు. నేను బిజినెస్ గురించి మాట్లాడింది. నాకోసం కాదు అక్క బావ కూడా బిజీగా మారతాడు కదా తన పరిస్థితి బాగోలేదు కదా.. అందుకే నేను ఇలా చేశాను అంతే తప్ప.. నాకు బిజినెస్ చేయాలన్న ఆలోచన లేదు అని పల్లవి నమ్మించి ఎలా మాట్లాడుతుంది. పల్లవి ఆలోచన చాలా బాగుంది అని అందరూ మెచ్చుకుంటూ ఉంటారు.. నిజంగానే పల్లవి కరెక్టే చేస్తుంది అని ఆలోచిస్తూ ఉంటారు మీనాక్షి అవని.. ఇక మీనాక్షి పల్లవి సంతోషంగా ఉండాలి అని తనని ముట్టుకోవడంతో మీనాక్షి వెళ్ళగానే ఈవిడంటే నాకు చిరాకు మళ్ళీ ముట్టుకునింది నేను వెంటనే వెళ్లి కడుక్కోవాలి అంటూ చిరాకు పడిపోతూ ఉంటుంది..
తన తండ్రి అస్థికలను నీళ్లల్లో కలపాలని తీసుకెళ్లిన కొడుకులు తండ్రి ఇక తిరిగి రారు అని బాధ పడిపోతూ ఉంటారు. అయితే తన తండ్రి కింద పడిపోవడం వల్లే చనిపోయే పరిస్థితి వచ్చింది అని కమల్ చాలా బాధపడిపోతూ ఉంటాడు. అంతే కాదు తనని తోసి చంపాలని చూసిన వాళ్ళు తెలుసుకొని వాళ్ళని చంపేసే వరకు నిద్రపోను అని తన తండ్రి అస్థికల మీద ఒట్టేసి కమల్ చెబుతాడు. అసలు మా నాన్న చనిపోవడానికి కారణమైన ఆ వ్యక్తి ఎవరో తెలుసుకొని నేను అస్సలు వదిలిపెట్టను అని చాలా బాధపడిపోతూ ఉంటాడు కమల్.. ఆఖరి సారీ కన్న తండ్రి అస్థికలను చూసి బాధపడిపోతూ ఉంటారు ముగ్గురు కొడుకులు. అప్పుడే శ్రీకర్ కొసం వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అక్క అక్కడికి వస్తుంది.. ఇక శ్రీకర్ తన కోసమైనా నిన్ను కోర్టుకు వస్తాను అని చెప్తాడు.
పల్లవి పార్వతికి రాజేంద్రప్రసాద్ చనిపోయిన విషయాన్ని ఎలాగైనా సరే చెప్పాలి అని అనుకుంటుంది. భానుమతికి అలాగే పార్వతి దగ్గరికి వెళ్లి మీరు మావయ్య గారితో మాట్లాడొచ్చు కదా బెంగ పెట్టుకోవడం ఎందుకు అని అంటుంది. అయితే పల్లవి అనుకున్నట్లుగానే వాళ్ళిద్దరూ నేను రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది రాజేంద్రప్రసాద్ మీరు ఫోన్ చేసి మాట్లాడొచ్చు కదా మావయ్య గారు మాట్లాడుతున్నారని డాక్టర్ చెప్పారు కదా అంటూ సలహా ఇస్తుంది.. ఆ సలహాతో ఇక పార్వతి భానుమతి అవని వాళ్ళ దగ్గరికి వెళ్తారు. కానీ అవని వాళ్ళు అక్షరాలు రాగానే ఫోన్ మాట్లాడదాము అని చెప్తుంది. నిజంగానే పల్లవి అనుకున్న ప్లాను దాదాపు సక్సెస్ అయిపోయినట్లే కనిపిస్తుంది..
పార్వతి వాళ్ళు డాక్టర్ తో మాట్లాడి వాళ్ళ నాన్నతో మాట్లాడే ఏర్పాట్లు చేయమని అడగగానే అక్షయ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు.. అందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ నోట్లో నీళ్లు నవ్వుతూ కనిపిస్తారు కానీ అవని మాత్రం తెలివిగా ప్లాన్ చేసి డాక్టర్ గారితో నేను మాట్లాడతాను అని అంటుంది. ఇక పది నిమిషాలలో మళ్లీ మనము మాట్లాడొచ్చు అని చెప్పి అవని ఏదో ఒకటి మేనేజ్ చేస్తుంది. ఇక 10 నిమిషాల వరకు ఏదో ఒకటి చెప్పాలి లేదంటే అత్తయ్య గారికి డౌట్ వస్తుంది అని అవని అనుకుంటుంది. తనకు తెలిసిన మిమిక్రి ఆర్టిస్టుతో ఎలాగైనా సరే రాజేంద్రప్రసాద్ లాగా మాట్లాడించండి అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..
Also Read : మూవీ లవర్స్ కు పూనకాలు పక్కా.. టీవీల్లోకి హిట్ సినిమాలు…