Intinti Ramayanam Today Episode September 18th : పల్లవి పార్వతికి రాజేంద్రప్రసాద్ చనిపోయిన విషయాన్ని ఎలాగైనా సరే చెప్పాలి అని అనుకుంటుంది. భానుమతికి అలాగే పార్వతి దగ్గరికి వెళ్లి మీరు మావయ్య గారితో మాట్లాడొచ్చు కదా బెంగ పెట్టుకోవడం ఎందుకు అని అంటుంది. అయితే పల్లవి అనుకున్నట్లుగానే వాళ్ళిద్దరూ నేను రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది రాజేంద్రప్రసాద్ మీరు ఫోన్ చేసి మాట్లాడొచ్చు కదా మావయ్య గారు మాట్లాడుతున్నారని డాక్టర్ చెప్పారు కదా అంటూ సలహా ఇస్తుంది.. ఆ సలహాతో ఇక పార్వతి భానుమతి అవని వాళ్ళ దగ్గరికి వెళ్తారు. కానీ అవని వాళ్ళు అక్షరాలు రాగానే ఫోన్ మాట్లాడదాము అని చెప్తుంది. నిజంగానే పల్లవి అనుకున్న ప్లాను దాదాపు సక్సెస్ అయిపోయినట్లే కనిపిస్తుంది..
పార్వతి వాళ్ళు డాక్టర్ తో మాట్లాడి వాళ్ళ నాన్నతో మాట్లాడే ఏర్పాట్లు చేయమని అడగగానే అక్షయ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు.. అందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ నోట్లో నీళ్లు నవ్వుతూ కనిపిస్తారు కానీ అవని మాత్రం తెలివిగా ప్లాన్ చేసి డాక్టర్ గారితో నేను మాట్లాడతాను అని అంటుంది. ఇక పది నిమిషాలలో మళ్లీ మనము మాట్లాడొచ్చు అని చెప్పి అవని ఏదో ఒకటి మేనేజ్ చేస్తుంది. ఇక 10 నిమిషాల వరకు ఏదో ఒకటి చెప్పాలి లేదంటే అత్తయ్య గారికి డౌట్ వస్తుంది అని అవని అనుకుంటుంది. తనకు తెలిసిన మిమిక్రి ఆర్టిస్టుతో ఎలాగైనా సరే రాజేంద్రప్రసాద్ లాగా మాట్లాడించండి. రాజేంద్రప్రసాద్ లాగా మాట్లాడించాలి అని అనుకుంటుంది.
పార్వతి ఇంకా అవని రాలేదేంటి ఫోన్ చేస్తానని చెప్పింది కదా అని ఎదురు చూస్తూ ఉంటుంది ఇక భానుమతి అవనిని పిలిచి రాజేంద్రప్రసాద్ తో మాట్లాడాలని చెప్పాను కదా మరి ఇంకా ఫోన్ చేయలేదు ఏంటి అని అడుగుతుంది. ఇదిగో అత్తయ్య చేస్తున్నాను అని చెప్పి ముందుగా అవన్నీ సెట్ చేసిన మిమిక్రీ ఆర్టిస్ట్ ఈ ఫోన్ చేసి రాజన్న ప్రసాద్ లాగా మాట్లాడమని చెప్తుంది. ఇక ఇద్దరూ కలిసి చేసిన ప్లాను పక్కాగా వర్కౌట్ అవుతుంది అచ్చం రాజేంద్రప్రసాద్ లాగా మాట్లాడిన అతను పార్వతితో అలాగే భానుమతితో మాట్లాడి వాళ్ళిద్దర్నీ సంతోషంగా ఉండేలా చేస్తాడు.. మావయ్య గారు లేరు అన్న విషయం తెలిసిపోతుంది అనుకుంటే అవన్నీ చాలా తెలివిగా సమస్యని సాల్వ్ చేసింది అని పల్లవి అనుకుంటుంది. మొత్తానికి అవని ప్లాన్ అయితే బాగా సక్సెస్ అయిపోతుంది పార్వతీ భానుమతి ఇద్దరు కూడా రాజేంద్రప్రసాద్ తో మాట్లాడమని చాలా సంతోషంగా ఉంటారు..
కమల్ బాధ పడిపోతూ ఉంటాడు. అవని చాలా తెలివిగా ప్లాన్ చేసింది ఈరోజు ఎలాగైనా సరే ఆ పార్వతి కూడా చచ్చిపోతుంది అని అనుకున్నాను. కానీ అవని చాలా తెలివిగా ప్లాన్ చేసి ఆ పార్వతిని కాపాడేసింది.. ఎలాగైనా సరే అత్తయ్య గారికి నిజం తెలిసిపోయేలా చేయాలి అప్పుడే ఆవిడ చచ్చిపోతుంది నేను ప్రశాంతంగా ఉంటాను అని పల్లవి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే గదిలోకి వచ్చిన కమ్మని చూసి కమల్ ని రెచ్చగొడితే కచ్చితంగా ఈ నిజం బయటికి వస్తుంది అని పార్వతికి నిజం తెలిసిపోతుంది అని అనుకుంటుంది పల్లవి. ఇక పల్లవి కూడా కమల్ కి నువ్వు నిద్రపోక చాలా రోజులు అవుతుంది బావ నీ మొహం అలా అస్సలు బాగోలేదు తాగి వస్తే బాధ మర్చిపోతారు అంటారు కదా నువ్వు వెళ్లి తాగేసి రా అని చెప్పేసి కావాలని రెచ్చగొట్టి పంపిస్తుంది..
ఏవండీ అత్తయ్య గారు ఇప్పుడైతే కాపాడేసాము మావయ్య గారు ఉన్నారు అని ఆవిడకి అనుమానం రాకుండా చేసాం కాబట్టి ఇప్పట్లో మనం అత్తయ్య గారి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు కదా అని అవని అంటుంది. నువ్వు చేసింది కరెక్టే అమ్మని కాపాడడానికి నువ్వు చేసావు కానీ అక్కడ వాళ్ళిద్దరు పరిస్థితి వేరేలా ఉంది ఒకవేళ నిజం తెలిస్తే అమ్మ పరిస్థితి ఏంటో అని నేను ఆలోచిస్తున్నాను అని అక్షయ్ చాలా బాధపడిపోతూ ఉంటాడు. అమ్మకి నిజం తెలిస్తే అస్సలు బాధపడిపోతుంది తట్టుకోలేదు అని అక్షయ్ అంటూ ఉంటాడు వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఆరాధ్య ఆడుకుందాం నాన్న నాతో అసలు మీరు ఈ మధ్య మాట్లాడడం లేదు అంటూ లోపలికి వస్తుంది. కానీ అక్షయ్ మాత్రం చాలా చిరాగ్గా అరవడంతో ఆరాధ్య కాస్త భయపడుతుంది కానీ తర్వాత స్కూల్ అయ్యి ఇద్దరు ఆడుకుందాం అని సరదాగా ఉంటుంది.
కమల్ తన తండ్రిని తలుచుకొని బాధపడిపోతూ ఉంటాడు. అయితే ఈ బాధని ఎలాగైనా సరే మర్చిపోవాలి అని తాగేసి ఇంటికి వస్తాడు. అయితే కమల్ ని అలా చూసి మిగిలిన వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు పల్లవి మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది ఈ రోజు ఎలాగైనా సరే కమల్ ద్వారా నిజం తెలుస్తుంది అని ఆలోచిస్తూ ఉంటుంది కానీ అక్షయ్ వాళ్ళు కమల్ నిజం ఎక్కడ చెప్తాడు అని కంగారు పడిపోతూ ఉంటారు.. కమలు నీకు నిజం తెలియదు నిజం తెలిస్తే అసలు తట్టుకోలేవు అంటూ భానుమతి పై సీరియస్ అవుతాడు ఇక పల్లవి ఇవాళ కమల్ నిజం చెప్తాడు అని అనుకుంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..