Intinti Ramayanam TRP Rating : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ వస్తున్న టాప్ రేటింగ్ సీరియల్స్లలో ఇంటింటి రామాయణం సీరియల్ ఒకటి. ఈ సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్ ప్రేక్షకులను ఎంతగా అలరిస్తూ వస్తుందో ఈ మధ్య నమోదు అవుతున్న రేటింగ్ను బట్టి చూస్తే అర్థమవుతుంది.. రివెంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సీరియల్ ప్రస్తుతం ప్రతి ఎపిసోడ్ లో మైండ్ బ్లాక్ ట్విస్ట్ లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.. ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్ ని చంపాలని చూసింది పల్లవి అని చక్రధర్ బయట పెట్టడం ఈ సీరియల్ రేటింగ్ ని ఒక్కసారిగా పెంచేసింది.. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్స్ అన్నిట్లో కల్లా టాప్ లో దుమ్ము దులిపేస్తున్న సీరియల్ ఇదే.. మార్చి నెలలో ఈ సీరియల్ హైలెట్ ఎపిసోడ్స్ గురించి ఒక్కసారి మనం గుర్తు చేసుకుందాం..
చక్రధర్ అవ్వగానే పల్లవి మీనాక్షి కిడ్నాప్ చేసిన విషయాన్ని అతనితో చెప్తుంది.. అతను మాత్రం అవని తనని కాపాడడంతో అవనికి మంచి చేయాలని అనుకుంటాడు. అయితే పల్లవికి తెలియకుండా మీనాక్షి దగ్గరికి వెళ్లిన చక్రధర్ ఎలాగైనా సరే మీనాక్షిని రిలీజ్ చేసి అవనికి మంచి చేయాలని అనుకుంటాడు. మీనాక్షిని కాపాడేందుకు వెళ్లిన అవని అక్షయ్ కమలు అక్కడ చక్రధరిని చూసి అపార్థం చేసుకుంటారు.. అతని దారుణంగా కొడతారు.. మీనాక్షిని ఇంటికి తీసుకొచ్చిన అవని వాళ్ల కిడ్నాప్ చేసిన మ్యాటర్ ని అందరితో చెప్పేస్తుంది. ఆ తర్వాత చక్రధర్ కూడా ఇంటికి వచ్చి నా తప్పు నేను తెలుసుకున్నాను మీనాక్షి నా భార్య అని అందరు ముందర ఒప్పుకుంటాడు.. ఆ మాట వినగానే పల్లవి బుర్ర బ్లాక్ అయిపోతుంది.. ఆ తర్వాత అందరూ కూడా అవనీని మెచ్చుకుంటారు. చక్రధర్ రాజేంద్ర ప్రసాద్ ని చంపాలనుకున్న విషయాన్ని చెప్పాలని అవినీతిని పిలుస్తాడు.. అవని వెనకాలే వెళ్లిన పార్వతీ కూడా పల్లవి గురించి నిజం తెలుసుకొని షాక్ అవుతుంది. ఇదంతా చేసింది పల్లవి నా ఇలాంటి దుర్మార్గురాలని ఇంట్లో వాళ్ళందరితో చెప్పి చంపేయించాలి అని అవని అనుకుంటుంది. కమల్ కాపురం నాశనం అవుతుంది అని అడ్డుకోవడంతో పార్వతి మాట మిన్న అవని నిజం చెప్పకుండా పల్లవితో ఒక ఆట ఆడుకుంటుంది.. ఇంట్లోని పనులన్నీ పల్లవి చెయ్యాలని చుక్కలు చూపిస్తుంది. కానీ శ్రేయ మాత్రం అవని అక్కకు పల్లవి గురించి ఏదో నిజం తెలిసింది అందుకే పల్లవిని తన కంట్రోల్లో పెట్టుకుంది అని అంటుంది. ఇక పల్లవి అవనీన్ని ఎలాగైనా చంపేయాలి అని ప్లాన్ చేస్తుంది.. పల్లవి గురించి చక్రధర్నిజం చెప్పడం ఈ నెలకి హైలెట్ ఎపిసోడ్ అని చెప్పాలి.. అవనిని చంపాలని చూసిన పల్లవి నుంచి అవనిని కాపాడి నాన్న అన్న పిలుపుకి దగ్గరవుతాడు. మొత్తానికి చక్రధర్ మనుషిలాగా మారుతాడు..
Also Read : ప్రేమకు షాకిచ్చిన ధీరజ్.. వల్లికి చుక్కలు చూపించిన ప్రేమ.. నర్మద మాస్టర్ ప్లాన్..
చక్రధర్ అవనికి అలాగే అవనీ కూతురుకి బాగా దగ్గరవుతూ ఉంటాడు. అది చూసి ఓర్వలేక పోతుంది. అవని రోజు రోజుకి మా డాడీకి దగ్గర అవుతుంది. ఆయన నన్ను పట్టించుకోవడమే మానేశాడు అని పల్లవి బాధపడిపోతూ ఉంటుంది. ఎలాగైనా సరే ఈసారి ప్లాన్ చేస్తే అవని లైఫ్ కతం చేయాలి అప్పుడే నేను చాలా సంతోషంగా ఉంటాను అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక శ్రీరామనవమి సందర్భంగా ఇంట్లోని వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా పండగని జరుపుకుంటారు. చక్రధర్ అందరికీ బట్టలు తెచ్చి ఇస్తాడు. అయితే శ్రీరామనవమికి మీనాక్షి కూడా వస్తే బాగుంటుంది అని పార్వతి అనడంతో వాళ్ళ అమ్మని పిలవడానికి అవని వాళ్ళ ఇంటికి వెళ్తుంది. శ్రీరామనవమి కళ్యాణానికి మంగళసూత్రం ఇవ్వాలి అని మీనాక్షి కోరుకున్నట్లు అవనితో చెప్తుంది. ఇక చక్రధర్ ని ఎలాగైనా సరే ఆ పూజకు తీసుకెళ్లాలి అని అవని రాజేశ్వరి దగ్గరకు వస్తుంది.. మరి చక్రధర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి..