Tv Serials : తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంటున్న వాటిలలో సీరియల్స్ మొదటి స్థానంలో ఉన్నాయన్న సంగతి తెలిసిందే.. ఈమధ్య ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా నువ్వా నేనా అంటూ పోటీ పడుతూ మరి డిఫరెంట్ స్టోరీ తో ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్ విషయానికి వస్తే.. ఒక్కో సీరియల్ఒక్కో స్టోరీ తో ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నాయి.. ముఖ్యంగా స్టార్ మా లో ప్రసారమయ్యే టాప్ టెన్ డైలీ సీరియల్స్ లలో ఎప్పుడూ టాప్ రేటింగ్ తో దూసుకుపోయే స్టార్ సీరియల్ కు మరో సీరియల్ గట్టి పోటీని ఇచ్చింది.. ప్రస్తుతం టాప్ లో ఆ సీరియల్ ఉండటంతో జనాలు కూడా దాన్ని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. ఇంతకీ ఆ సీరియల్స్ ఏవి? ఈ వారంలో ఎంత రేటింగ్ ని సొంతం చేసుకున్నాయి అన్న వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం..
స్టార్ మా లో ప్రసారమవుతున్న టాప్ సీరియల్స్లలో కార్తీకదీపం 2 ఒకటి. ఈ సీరియల్కు గతంలో వచ్చిన సీక్వెల్ సీరియల్ మంచి రేటింగ్ తో పాటుగా రెస్పాన్స్ ని కూడా అందుకుంది. అందులో వంటలక్క డాక్టర్ బాబు ఇప్పట్లో కలవర అన్న స్టోరీ లైన్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది.. ఇప్పుడొస్తున్న సీరియల్లో వాళ్ళిద్దరు కలిసిన సరే వాళ్ళిద్దరి చుట్టూ సమస్యలు రోజుకొకటి వెంటాడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.. మరి వీరి సమస్యలు తీరిపోయి మంచి రోజులు ఎప్పుడు వస్తాయి అన్నది ప్రస్తుతం జనాల్లో వినిపిస్తున్న మాట. ఈమధ్య ఈ సీరియల్ స్టోరీ డిఫరెంట్ ట్విస్టులను ఇవ్వడంతో గత కొన్ని నెలలుగా టాప్ రేటింగ్ తో ఇదే కనిపిస్తుంది. కానీ ఇప్పుడు మరో సీరియల్ ఈ సీరియల్ కి పోటీని ఇచ్చింది. ప్రస్తుతం ఆశ్చర్యలే టాప్ రేటింగ్ లో ఉండడంతో జనాలు కాస్త ఆ సీరియల్ ని చూసేందుకు ఇంట్రెస్ట్ కూడా చూపిస్తున్నారు. అది మరేదో కాదు ఇంటింటి రామాయణం..
Also Read : ఓటీటీ లవర్స్ కు బిగ్ షాక్.. ఇక సినిమాలు అప్పుడే స్ట్రీమింగ్..!
ఇంటింటి రామాయణం ఈ టైటిల్ కి తగ్గట్లుగానే ఈ సీరియల్ స్టోరీ కూడా ఉంటుంది.. ఒక్కో ఇంట్లో ఒక్కొక్కరి స్టోరీ అని అర్థమవుతుంది.. ఈ సీరియల్ లో రాజేంద్రప్రసాద్ కుటుంబంలో జరిగే పరిస్థితుల గురించి చక్కగా వివరించారు.. మంచి కోరుకునే ఆ కుటుంబంలోకి గంజాయి మొక్క లాగా ప్రవేశించిన పల్లవి ఆ ఇంట్లో వాళ్లకి అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటుంది. ఆమె గురించి తెలిసి కూడా వాళ్ళు ఏమి చేయకుండా ఉండడంతో పల్లవి ఇంకాస్త రెచ్చిపోతుంది.. ప్రస్తుతం జరుగుతున్న స్టోరీ ప్రకారం చూస్తే.. పల్లవి తండ్రి చక్రధర్ మారిపోయి తన తప్పులను తెలుసుకోవడంతో పాటుగా అతని చేసిన తప్పులను అందరికీ తెలియజేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో తన కూతురు చేసిన తప్పుని కూడా పెద్ద కూతురు అవనితో చెప్తాడు. అవని ఎలాగైనా సరే తన చెల్లెల్ని మార్చుకోవాలని ప్రయత్నంలో ఉంటుంది. ఇక పల్లవి ఎలాంటి పనులు చేస్తుందో అన్నది తెలియాలంటే ప్రతిరోజు ఎపిసోడ్ని మిస్ అవ్వకుండా చూడాల్సిందే.