Nindu Noorella Saavasam Serial Today Episode: లోయ దగ్గర మంచు తుఫానులో ఇరుక్కుపోయిన మిస్సమ్మను అమర్ ప్యారాచూట్ సాయంతో సేవ్ చేస్తాడు. మరోవైపు రణవీర్ క్యాటేజ్ దగ్గర లాల్సింగ్ అటూ ఇటూ తిరుగుతుంటాడు. అప్పుడే రూంలోంచి రిసెప్షన్ దగ్గరకు వచ్చిన రణవీర్ లైటర్ తీసుకుని లోపలికి వెళ్తూ లాల్సింగ్ను చూస్తాడు. షాక్ అవుతూ.. వీడేంటి ఇక్కడ ఉన్నాడు. నేను మనోహరి ఇక్కడ ఉన్నట్టు అమర్కు తెలిసిపోయిందా..? నన్ను ఫాలో చేస్తూ ఇక్కడి దాకా వచ్చేశారా..? అని మనసులో అనుకుంటుంటే.. రిసెప్షనిస్టు సార్ ఇంకా ఏమైనా కావాలా అని అడుగుతాడు. ఏమీ వద్దు కానీ ఆ సింగ్ ఇక్కడ ఎందుకు ఉన్నాడు అని అడగ్గానే.. ఆ సార్ వాళ్ల ఫ్యామిలీ ఫ్రెండ్ ఇక్కడే దిగారు సార్ అని రిసెప్షనిస్ట్ చెప్పగానే.. ఫ్రెండా… అంటూ తన ఫోన్లో ఉన్న అమర్, మిస్సమ్మల ఫోటో చూసిస్తాడు. ఆ సింగ్ వాళ్ల ఫ్రెండ్ ఫ్యామిలీ వీళ్లేనా..? అని అడగ్గానే..
అవును సార్ అని వీళ్లే అని చెప్పగానే.. రణవీర్ షాక్ అవుతాడు. మేము తెలియకుండా అమర్ ఉన్న రిసార్ట్కు వచ్చామా..? అని మనసులో అనుకుంటాడు. రిసెప్షనిస్ట్ ఏమైంది సార్ అని అడిగితే ఏమీ లేదని చెప్తూ.. పక్కకు వెళ్లి ఈ విషయం వెంటనే మనోహరికి చెప్పాలి అంటూ ఫోన్ చేస్తాడు. అప్పుడే రిసార్ట్ గేట్ దగ్గరకు కారులో వస్తుంది మనోహరి. రణవీర్ కాల్ లిఫ్ట్ చేసి ఏంటి రణవీర్ అని అడుగుతుంది. ఎక్కడున్నావు అంటూ రణవీర్ అడగ్గానే.. ఇప్పుడే రిసార్ట్ దగ్గరకు వచ్చాను గేటు దగ్గర ఉన్నాను అని చెప్పగానే.. రణవీర్ ఆ కారులో ఉన్నది నువ్వేనా అని అడుగుతాడు. ఇంతలో లాల్సింగ్ కారు చూసి గేటు దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్తాడు. రణవీర్ షాకింగ్ గా కారు దిగకు మనోహరి వెనక్కి వెళ్లిపో అని చెప్పగానే.. మనోహరి కూడా కంగారుగా ఏమైంది అని అడుగుతుంది. దీంతో రణవీర్ అమర్, భాగీ కూడా ఇదే రిసార్ట్ లో ఉన్నారు. మన ఆపోజిట్ కాటేజీలో ఉన్నది కూడా వాళ్లే ఆ సింగ్ గాడు ఇక్కడే ఉన్నాడు.. అని చెప్పగానే..
మనోహరి ఇరిటేటింగ్ గా ఈరోజు అన్ని రివర్స్ అవుతున్నాయి.. అక్కడ భాగీని చంపుదామనుకుంటే అమర్ వచ్చాడు. ఇక్కడేమో వీడు. ఓ అంటూ ఇరిటేట్ అవుతుంటే.. వెనక నుంచి కారు దిగి అమర్, మిస్సమ్మ వస్తుంటారు. వాళ్లను చూసిన మనోహరి భయంగా రణవీర్ అమర్ వాళ్లు కూడా వచ్చేశారు ఇప్పుడు ఎలా..? అనగానే.. రణవీర్ కోపంగా కారును ఫాస్ట్ గా తీసుకెళ్లమని చెప్పు ఎలాగోలా ఎస్కేప్ అవ్వు మనోహరి అని చెప్పగానే.. మనోహరి డ్రైవర్ వెంటనే ఎయిర్ ఫోర్ట్కు వెళ్లు అని చెప్తుంది. కారు స్పీడులో వెళ్లిపోతుంది. లోపలి నుంచి వచ్చిన లాల్సింగ్ స్పీడుగా బయటకు వస్తాడు. అప్పుడే అక్కడకు వచ్చిన అమర్ ఏమైందిరా రణవీర్ వైఫ్ వచ్చిందా..? అని అడగ్గానే.. ఆ కారులో ఉందే తనే అనుకుంటాను మనల్ని చూడగానే.. పారిపోతుంది అని చెప్పగానే.. మిస్సమ్మ కోపంగా మనోహరి మళ్లీ తప్పించుకున్నావా..? అని మనసులో అనుకుంటుంది.
రణవీర్ ఎక్కడ అని అమర్ అడగ్గానే.. వాడు కాటేజీలోనే ఉన్నాడు ఇప్పుడు ఏం చేద్దాం అని అడగ్గానే.. అప్పుడే రాథోడ్, అమర్కు ఫోన్ చేసి సార్ మీరు వెంటనే హైదరాబాద్ రావాలి సార్ అని చెప్తాడు. అని చెప్పగానే.. అమర్ ఏమైంది రణవీర్ అని అడగ్గానే.. ఇది ఫోన్లో చెప్పే విషయం కాదు సార్ మీరు అర్జెంట్గా హైదరాబాద్ రండి సార్ అంటూ కాల్ కట్ చేస్తాడు. అమర్, మిస్సమ్మ వెంటనే ఎయిర్ఫోర్ట్ కు వెళ్లి హైదరాబాద్ వెళ్లిపోతారు. హైదరాబాద్లో దిగిన తర్వాత అమర్ రాథోడ్కు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడు.. పిల్లల ఫోన్లు స్విచ్చాప్లో ఉంటాయి. దీంతో అమర్, మిస్సమ్మ కంగారు పడుతుంటారు. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.