ఆశ్రమంలో పిల్లలకు భోజనం పెడుతుంటుంది మిస్సమ్మ. పిల్లలు అందరూ కడుపునిండా తినాలి. అన్నం మిగల్చకుండా మొత్తం తినాలి వేస్ట్ చేయోద్దు అని చెప్తుంది మిస్సమ్మ. పిల్లుల సరే మేడం అంటూ ఒక్కోక్కరుగా వెళ్లి భోజనం పెట్టించుకుంటారు. ఇంతలో ఒక పాప మేడం బుజ్జమ్మ ఇంకా రాలేదేంటి మేడం ఎప్పుడొస్తుంది మేడం అని అడగ్గానే.. తను వాళ్ల ఫ్రెండ్ ఇంటికి వెళ్లింది కాసేపట్లో వస్తుంది. మీరు తృప్తిగా భోజనం చేయసేయండి అని మిస్సమ్మ చెప్పగానే.. పిల్లలు అందరూ అలాగే మేడం అని చెప్తారు. మరోవైపు అమర్ ఇంట్లో కూడా అందరూ భోజనం చేస్తుంటారు. అంజు, బుజ్జమ్మ మా యాదమ్మ చేసే వంటలు ఆంత బాగోవు ఏమీ అనుకోకు మీ టీచర్ చేసిన వంట టేస్టీగా ఉంది. అచ్చం మా మిస్సమ్మ చేసిన వంటలాగా ఉంది. అని చెప్పగానే.. మనోహరి, చంభా షాక్ అవుతారు.
మరోవైపు మిస్సమ్మ పిల్లలకు అన్నం వడ్డిస్తుంటే.. రాజు.. బుజ్జమ్మ ఇంకా రాలేదేంటని కంగారుగా ఎదురుచూస్తుంటాడు. చీకటి పడింది బుజ్జమేమో ఇంకా రాలేదు. ఇప్పుడు భాగీ గారు అడిగితే ఏం చెప్పాలి అని మనసులో అనుకుంటుంటాడు. ఇంతలో మిస్సమ్మ రాజు దగ్గరకు వెళ్లి బాబాయ్ బుజ్జమ్మ ఇంకా రాలేదు ఏంటి..? అని అడగ్గానే.. రాజు.. వచ్చేస్తుందమ్మా ఇందాకే ఫోన్ చేశాను కాసేపట్లో బయలుదేరుతుంది అన్నారు అని చెప్పగానే.. ఏంటి బాబాయ్ ఇది సాయంత్రమే వచ్చేస్తుంది అన్నారు. చీకటి పడిపోయింది ఇంకా రాలేదు. అసలు తను ఎవరి ఇంటికి వెళ్లింది అని మిస్సమ్మ అడగ్గానే.. వాళ్ల ఫ్రెండ్ ఇంటికి వెళ్లింది అని చెప్పాను కదమ్మా..? అదే తన క్లాస్మేట్ అని చెప్పగానే.. మిస్సమ్మ ఇరిటేటింగ్గా అదే ఎవరా ఫ్రెండ్ ఒకసారి వాళ్లకు ఫోన్ చేయండి అని చెప్పగానే.. రాజు నేను ఇందాకే చేశానమ్మా అని చెప్తాడు. దీంతో మిస్సమ్మ మళ్లీ చేయండి బాబాయ్ నేను మాట్లాడతాను అని అడుగుతుంది. దీంతో రాజు ఎందుకమ్మా నేను మాట్లాడాను కదా..? అని చెప్పగానే.. ఫ్లీజ్ బాబాయ్ నేను ఈ టెన్షన్ పడలేను ఫోన్ చేస్తారా..? లేదా..? అని మిస్సమ్మ చెప్పగానే..
రాజు అలాగేనమ్మా అని ఫోన్ తీసుకుని అంజు వాళ్లకు ఫోన్ చేస్తాడు. భోజనం చేస్తున్న అంజు.. రాథోడ్ మా ఫోన్ రింగ్ అవుతుంది చూడు అని చెప్పగానే.. రాథోడ్ వెళ్లి ఫోన్ చూస్తాడు.. ఆనంద్ ఎవరు చేశారు అని అడగ్గానే.. ఎవరో తాతయ్య అని వస్తుంది అని రాథోడ్ చెప్పగానే.. రామ్మూర్తి తాతయ్య చేస్తున్నారా..? అని అంటాడు ఆనంద్ లేదు ఎవరో తాతయ్య అని వస్తుంది అంటూ రాథోడ్ చెప్పగానే.. మనోహరి షాక్ అవుతుంది. ఒన్లీ తాతయ్యనా..? ఎవరూ అని ఆకాస్ అడుగుతాడు. ఇంతలో మిస్సమ్మ ఫోన్ ఇటివ్వండి బాబాయ్ అంటూ రాజు చేతుల్లోంచి లాక్కుంటుంది.. అయ్యో బుజ్జమ్మ వెళ్లింది ది తన ఇంటింకేనని భాగీ గారికి తెలిసిపోతుందేమో..? ఇపపుడు ఏం చేయాలి రా భగవంతుడా..? అని మనసులోనే భయపడుతుంటాడు. మరోవైపు అంజు అనాథ శరణాలయం తాతయ్య బుజ్జమ్మ కోసం కాల్ చేసి ఉండొచ్చు ఇటివ్వు అని ఫోన్ తీసుకుంటుంది అంజు.. బుజ్జమ్మ తాతయ్య కాల్ చేశారు మాట్లాడు అంటూ అంజు ఫోన్ బుజ్జమ్మకు ఇస్తుంది.
ఫోన్ తీసుకుని బుజ్జమ్మ హలో తాతయ్య అనగానే.. అటువైపు నుంచి మిస్సమ్మ, బుజ్జమ్మ నేను అమ్మని అని చెప్పగానే.. ఏంటమ్మా ఫోన్ చేశావు అంటూ బుజ్జమ్మ అడుగుతుంది. మనోహరి మరింత టెన్షన్ పడుతుంది. ఎక్కడున్నావు అని అడుగుతుంది మిస్సమ్మ. మా ఫ్రెండు వాళ్ల ఇంట్లో అని బుజ్జమ్మ చెప్తుంది. కోపంగా మిస్సమ్మ.. ఎవరా ఫ్రెండ్ అని కోపంగా అడుగుతుంది. స్కూల్ లో ఒక అక్క పరిచయం అయింది అని చెప్పాను కదా..? ఆ అక్క వాళ్ల ఇంటికి వచ్చాను అని చెప్పగానే.. మిస్సమ్మ మరింత కోపంగా ఇంకా అక్కడే ఉన్నావా..? ఎప్పుడు వస్తావు అని అడుగుతుంది. బుజ్జమ్మ మాత్రం కూల్గా భోం చేస్తున్నాను అమ్మా.. తినగానే వచ్చేస్తాను అని చెప్తుంది. దీంతో మిస్సమ్మ బాధగా అదేంటి నేను లేకుండా ఎప్పుడూ తినవు కదా..? అక్కడెలా తింటున్నావు.. అని మిస్సమ్మ అడగ్గానే.. బుజ్జమ్మ సారీ అమ్మా ఇక్కడ అందరూ ఫోర్స్ చేశారు అందుకే తింటుంన్నాను.. ఇక్కడే కొంచమే తింటాను అక్కడికి వచ్చాక నీతో కలిసి ఇంకొంచెం తింటాను అని చెప్పగానే.. మిస్సమ్మ అదేం వద్దు అక్కడే కడుపు నిండా తిను.. ఇక్కడ పిల్లలు కూడా తింటున్నారు అని చెప్పగానే..
సరే నేను రాకుండా నువ్వు తినవు కదా..? అని బుజ్జమ్మ అడిగితే నువ్వు వచ్చాక తింటాను కానీఫోన్ ఒకసారి నీ ఫ్రెండ్ కు ఇవ్వు అని మిస్సమ్మ చెప్పగానే.. రాజు షాక్ అవుతాడు. బుజ్జమ్మ మాత్రం అక్కా అమ్మ నీతో మాట్లాడుతుందట అని ఫోన్ ఇస్తూ చెప్పగానే.. మనోహరి, చంభా షాక్ అవుతారు.. అంజు ఫోన్ తీసుకుని హలో మేడం అనగానే.. అవతల ఉన్న రాజు ఫోన్ లాక్కుని మాట్లాడతాడు. అంజు వెంటనే తాతయ్య మీరా..? అంటుంది ఇవతల మనోహరి, చంభా ఊపిరి పీల్చుకుంటారు. రాజు టెన్షన్ పడుతూ మీరు భోజనం చేయండి నేను వచ్చి బుజ్జమ్మను తీసుకొస్తాను అని చెప్పగానే.. అంజు సరే అంటుంది. రాజు కాల్ కట్ చేసి అమ్మా నేను వెళ్లి బుజ్జమ్మను తీసుకొస్తాను అంటూ వెళ్లిపోతాడు. బాబయ్ ఏదో దాస్తున్నారు అని అనుమానంతో రాజును ఫాలో అవుతుంది మిస్సమ్మ.. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.