E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today march 28th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: రణవీర్ ను పార్టీకి పిలిచిన అమర్  

Nindu Noorella Saavasam Serial Today march 28th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: రణవీర్ ను పార్టీకి పిలిచిన అమర్  
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:  రణవీర్‌ ఇంటికి వెళ్లిన అమర్‌ తమ ఇంట్లో జరిగే పార్టీకి రమ్మని పిలుస్తాడు. దీంతో రణవీర్‌ షాక అవుతాడు. ఫ్రెండ్లీగా పిలుస్తున్నానని చెప్పి అమర్ వెళ్లిపోతాడు. అమర్‌ వెళ్లిపోయాక రణవీర్‌ టెన్షన్‌ పడుతుంటాడు. లాయరుతో తనను ఎందుకు పిలిచాడని ఏమై ఉండొచ్చని అడుగుతాడు. దీంతో లాయరు ప్రెండ్లీగా పిలిచానని ఆయనే చెప్పారు కదా అని లాయరు చెప్పగానే.. ఇప్పుడు అమరేంద్రకు తనతో శత్రుత్వం తప్ప వేరే లేదు కదా అనగానే.. లాయరు శత్రుత్వం మాత్రమే ఎందుకు ఉండాలి సార్‌. పార్టీకి వెళ్లండి మీ కూతురు గురించి ఏమైనా తెలుస్తుందేమో..? అని లాయరు చెప్పగానే.. ఓకే అమరేంద్ర ఇలా ఇన్వైట్‌ చేసినట్టు మనోహరికి తెలుసా లేదా లాయరు అని చెప్పగానే.. ఈ విషయం డైరెక్టుగా మనోహరి గారిని అడిగి తెలుసుకుంటే బాగుంటుంది సార్‌ అని చెప్తాడు.

కట్‌ చేస్తే.. మనోహరి, రణవీర్‌ దగ్గర ఉంటుంది. విషయం తెలిసి షాక్‌ అవుతుంది. ఏంటి రణవీర్‌ నువ్వు చెప్పేది అంటూ ఆశ్చర్యపోతుంది. మరోవైపు ఇదే విషయం మిస్సమ్మకు చెప్తుంటాడు రణవీర్‌. అవును మిస్సమ్మ సారే స్వయంగా వెళ్లి రణవీర్‌ను పార్టీకి పిలిచారు అని చెప్తాడు. దీంతో మిస్సమ్మ అదేంటి రణవీర్‌ కనిపిస్తే కాల్చేయాలి అన్నంత కోపంగా ఆయన పార్టీకి ఎలా పిలిచారు అని అడుగుతుంది. మరోవైపు రణవీర్‌ కూడా అదే నాకు అర్థం కావడం లేదు మనోహరి.. అమరేంద్ర మైండ్‌లో ఏముందో తెలియడం లేదు అని చెప్పగానే.. మనోహరి కూడా ఈ రోజు ఉదయం నుంచి ఆ ఇంట్లో చిత్రవిచిత్రాలు జరుగుతున్నాయి. కాశ్మీర్‌ నుంచి అమర్ ఫ్రెండ్‌ లాల్‌సింగ్‌ వచ్చారు అని చెప్పగానే.. మరోవైపు మిస్సమ్మ కూడా ఉదయం సింగ్‌ గారు అంజు గురించి టంగ్‌ స్లిప్ అవ్వడం ఆ మాట పట్టుకుని మనోహరి అంజు గురించి ఎంక్వైరీ చేయడం.. తర్వాత ఆయన ఈవెనింగ్‌ గెట్‌ టు గెదర్‌ ఏర్పాటు చేయడం.. ఇప్పుడు ఆయన రణవీర్‌ను పార్టీకి పిలవడం ఇదంతా దేనికో దారి తీయబోతుంది రణవీర్‌ అంటూ అనుమానిస్తుంది.

Advertisement

రాథోడ్‌ మాత్రం సార్‌ ఊరికే ఏదీ చేయరు మిస్సమ్మ.. సార్‌ మైండ్‌లో ఏదో ఉంది. అంటాడు.. మరోవైపు మనోహరి కచ్చితంగా అమరేంద్ర ఏదో మాస్టర్‌ ప్లాన్ వేశాడు రణవీర్‌ ఈవెనింగ్‌ నువ్వు పార్టీకి రావొద్దు.. అని చెప్పగానే.. నేను రాకపోతే బాగుండదేమో మనోహరి నా మీద అమరేంద్రకు డౌటు వస్తుందేమో అంటాడు.. అంటే పార్టీకి రాకపోతే చంపేస్తానని అమరేంద్ర గారు వార్నింగ్‌ ఇచ్చి మరీ వెళ్లారు మేడం అని లాయరు చెప్తాడు. ఇంకోవైపు మిస్సమ్మ కూడా వార్నింగ్‌ ఇచ్చి మరీ పార్టీకి పిలిచారంటే.. సాయంత్రం ఆయన ఏం చేయబోతున్నారు రాథోడ్‌ అని అడగ్గానే.. ఏమో మిస్సమ్మ సారు ఏ విషయం నాతో చెప్పలేదు అంటాడు. మరోవైపు మనోహరి కూడా అమరేంద్ర నాతో కూడా ఏ విషయం ఓపెన్‌ అవ్వడం లేదు.. అసలు గెట్‌ టూ గెదర్‌ ఎందుకో కూడా క్లారిటీ లేదు.. అనగానే.. ఒకవేళ మన కూతురు గురించి ఏదైనా చెప్పబోతున్నారేమో అందరి ముందు మన కూతురు ఎవరో ఎనౌన్స్ చేయబోతున్నారేమో అటూ రణవీర్‌ అనుమానం వ్యక్తం చేస్తాడు.

మరోవైపు మిస్సమ్మ కూడా ఆ విషయం అనౌన్స్‌ చేయాలనుకుంటే మన దగ్గర ముందే డిస్కషన్‌ చేసేవారు కదా రాథోడ్ అంటుంది మిస్సమ్మ. దీంతో రాథోడ్‌ కూడా కరెక్టే మిస్సమ్మ మీతో చెప్పకపోయినా కనీసం నాతో అయినా మాట్లాడేవారు అంటూ రాథోడ్ చెప్తాడు.. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×