Podarillu Today Episode February 8th: నిన్నటి ఎపిసోడ్ లో.. మహా స్టేజ్ మీదకు రావడంతో అక్కడున్న వాళ్ళందరూ సంతోషంగా మహనీయులు పిలుస్తారు మహా మమ్మల్ని అర్థం చేసుకుంది అని మాధవ్ కూడా చాలా సంతోషంగా ఉంటాడు అక్కడున్న వారిలో ఒక ఆవిడ చక్రి పెళ్లి చేసుకున్నాడు కాబట్టి తయారు శాపానికి పవర్ పోయిందనుకుంటాను అని అనడంతో తాయారు సీరియస్ అవుతుంది.. వాళ్ళందరిని చూసినా ఎక్కడున్న వాళ్ళందరూ జంట చాలా బాగుంది అని మెచ్చుకుంటారు. అది విన్న తాయారు కోపంగా ఉంటుంది.. కానీ వాళ్ళిద్దరూ స్టేజ్ మీదకి వెళ్లడంతో కన్నా కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతారు.
అక్కడున్న ఫోటోగ్రాఫర్ ఎలాగైనా సరే వీళ్ళిద్దరిని మంచి క్లోజ్ యాంగిల్ ఫోటోలు తీయాలని అడుగుతాడు. మహా పరిస్థితిని అర్థం చేసుకున్న మాధవ్ మాత్రం ఇంకా ఫోటోలు చాల్లేరా అని అంటారు. ఇక నారాయణ హీరో ఎంట్రీ ఉంది ఇప్పుడు అని అక్కడ దండలు పట్టుకొని స్టేజ్ పైకి వెళ్తాడు. పోలీస్ స్టేషన్లో వీళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు కదా.. ఇప్పుడు ఇక్కడ అందరి ముందర పెళ్లి చేసుకుంటారు అని అనగానే మహా షాక్ అవుతుంది..మొత్తానికి రిసెప్షన్ మాధవ్ అనుకున్నట్లుగా చాలా గ్రాండ్గా పూర్తవుతుంది.. అయితే చక్రి మహా ఇద్దరు కూడా విడిపోవద్దని కోరుకుంటాడు మాధవ్. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ప్రోమో విషయానికి వస్తే.. భోజనాలు తింటూ ఒక ఆవిడ ఇంటి గురించి దారుణంగా మాట్లాడుతుంది..అది విన్న కేశవ బిర్యానీ కావాలంటే అడుగు. అంతేకానీ ఇలాంటి మాటలు మాత్రం మాట్లాడొద్దు అని అంటాడు. మీ గురించి మేము ఏమైనా మాట్లాడుతున్నామా..? ఈ అమ్మాయి నాకు లవ్ లెటర్ రాసింది అది తెలిసి నువ్వు పెళ్లి చేసి పంపించేసావు అది ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికైనా నేను చెప్పానని ఆమెతో అంటాడు.. ఇక కుటుంబం మొత్తం కలిసి ఫోటో దిగాలని అనుకుంటారు. అందరూ కలిసి మహాచక్రియలతో ఫోటో దిగుతారు.. ఈ ఎపిసోడ్ కి వీళ్ళ ఫోటోలు హైలెట్గా నిలుస్తాయి. గాయత్రి చక్రికి కంగ్రాట్యులేషన్స్ చెప్తుంది. మహా కి మాత్రం చెప్పడంలో కాస్త ఫీల్ అవుతుంది. ఇది విన్న మాధవ్ నువ్వు ఇలా రా వెళ్దామని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు..
ఈ ఊర్లో వాళ్ళు బంధువులు ఎవరూ మాకు లేరు నువ్వే మాకు అన్ని… ఎవరిని అంటున్న కూడా మమ్మల్ని ఒక్క మాట కూడా అనకుండా మాకు ఎప్పుడు తోడుగా ఉంటున్నావు అని గాయత్రి కి వడ్డించి తినమని చెప్తాడు మాధవ్. నీకేం కావాలో వేసుకొని తిను అని మాధవ్ అనగానే సరే బావ నేను తింటాలే అని గాయత్రి అంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన తాయారు ఏంటి నువ్వు ఇక్కడ తినడానికి వచ్చావా అని అడుగుతుంది.. వాళ్ళింటికి నువ్వు శాపం పెట్టావు అది ఇప్పుడు కుదరదు అని తెలిసిపోయింది. వాళ్లు చాలా సంతోషంగా ఉన్నారు ఇప్పుడు నువ్వు ఏమి చేయలేవు అని గాయత్రి అంటుంది..
వాళ్ళింటి వైపు వస్తే కాళ్లు విరగగొడతానని కొట్టిన సరే నువ్వు ఎందుకు వచ్చావు అని తాయారు అడుగుతుంది.. ఈ గొడవలన్నీ మర్చిపోయి వాళ్ళు సంతోషంగా ఉన్నారు కదా.. నువ్వు కూడా నీ పెద్దరికం నిలబెట్టుకుంటూ భోజనం చేయమ్మా అని గాయత్రి అంటుంది. నేను వీళ్ళ భోజనం తింటానని ఎలా అనుకున్నావ్ అని తాయారు అంటుంది. ఈ ప్లేట్ ని విసిరి కొడతావా ఏంటి అని గాయత్రి అడగ్గా.. కన్న కూతురు భోజనాన్ని విసిరి కొట్టకూడదు అని ఆలోచిస్తున్నానని తాయారు అంటుంది.. నా భోజనం ప్లేట్ అయితే విసరి కొట్టగలవు కానీ అటు మీ అన్నయ్య ఏం చేస్తున్నాడో చూడు అని అనగానే తాయారు రమణయ్య తాగుతున్నాడు అని చూసి షాక్ అవుతుంది..
Also Read : పల్లవి దొరికిపోతుందా..? రాజేంద్ర రావడంతో షాక్.. పల్లవి మరో ప్లాన్..
నన్నయితే కొడతావు మరి మీ అన్నయ్యని కూడా కొడతావా ఏంటి అని గాయత్రి అడుగుతుంది. ఇక అందరూ కలిసి ఫోటోలు దిగిన తర్వాత భోజనం చేద్దామని వస్తారు. చక్రి మొహాలను కూడా మాధవ్ పిలవడంతో అందరూ కలిసి భోజనం చేయడానికి కూర్చుంటారు.. మహా ఫీల్ అవుతుంటే చక్రి మాత్రం మీరు అలా ఫీల్ అవ్వకండి కాస్త ఫ్రీగా కూర్చోండి ఎలాగో ఫంక్షన్ అయిపోయింది కదా అని అంటాడు. ఇక భోజనం చేసిన తర్వాత అందరూ ఇంటికి వెళ్లారు. ఉదయం మహాలక్ష్మి లేవగానే అందరూ పడుకుని ఉండడం చూసి భయపడుతుంది.. ఆ తర్వాత నారాయణ ప్రవర్తన చూసి కంగారుపడుతుంది.. నేను ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను నన్ను హాస్టల్లో చేర్పించండి నేను వెళ్ళిపోతాను అని చక్రితో అనడం మాధవ్ వింటాడు.. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. సోమవారం ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి…