Podarillu Today Episode March 13th : నిన్నటి ఎపిసోడ్ లో.. పోలీసులు మాధవ్ని దారుణంగా మాట్లాడుతూ ఉంటారు. అయితే అప్పుడు అక్కడికి వచ్చిన మహాలక్ష్మి ఎస్ఐ గారు నేను మీతో మాట్లాడాలి అని అంటుంది.. మీరు ఏదైతే తప్పు జరిగింది అని అనుకుంటున్నారో అప్పుడు నేను అక్కడే ఉన్నాను. అక్కడ ఏ తప్పు జరగలేదు వాళ్లే కావాలని తప్పుడు కేసు పెట్టారు అని పోలీసులతో వాదిస్తుంది. అయితే అప్పుడు అక్కడికి వచ్చినా మాధవ్ మనిషి అలాగే కేశవ మనిషి వాళ్ళకి కాఫీ టీలు ఇస్తుంటారు. మహాలక్ష్మి బయటకు వెళ్లి గాయత్రితో ఫోన్ మాట్లాడి వస్తుంది. గాయత్రి నువ్వు ఏడుస్తున్నావా మీ బావని అలాగే మిగిలిన ముగ్గురిని కూడా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం నీకు తెలిసిందే కదా.. ఆ నలుగురిని జైలుకు పంపిస్తారు అంట..
నువ్వు ఎలాగైనా సరే నిజం చెప్పాలి అని మహాలక్ష్మి అడుగుతుంది..నన్ను గదిలో బంధించేశారు పెళ్లిచూపులుకి రెడీ అవమని చెప్పారు. నేను ఎలా రావాలి బయట మా వాళ్ళు కాపలాగా ఉన్నారు.. దానికి గాయత్రి తన బావ మంచోడు అని పోలీసులతో చెప్పడంతో వాళ్ళు రిలీజ్ చేస్తారు.. అందరూ మహాలక్ష్మి చాలా తెలివిగా చేసింది అంటూ పొగిడేస్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. మా బావ అంటే నాకు చాలా ఇష్టం కానీ మా బావ నన్ను ఎంత కంట్రోల్ లో పెట్టాలో అంత కంట్రోల్లో పెట్టారు అని గొప్పగా చెప్తుంది. ఇక పోలీసులు పురుషోత్తం ని తీసుకొని అక్కడికి వెళ్తారు. నీ వయసెంత నువ్వు ఇప్పటికి సిగ్గు లేకుండా ప్రవర్తిస్తున్నావు. వారిని కూతుర్ని ఏం చేశారని నువ్వు ఇలా పెట్టావు కొంచమైన బుద్ధి లేదా అని ఎస్ఐ పురుషోత్తం ని తిడతాడు.. ఆ నలుగురిని రిలీజ్ చేసిన ఎస్ఐ ఈ అమ్మాయి చాలా ధైర్యవంతురాలు ఈ అమ్మాయి వల్లే మీరు బయటకు వచ్చారు అని అంటాడు. అందరూ కలిసి మహాలక్ష్మికి థాంక్స్ చెప్తారు. ఆ తర్వాత అందరూ ఇంటికి వెళ్తారు. పోలీసులు నువ్వు తప్పుడు కేసు పెట్టా కాబట్టి నీకు చుక్కలు చూపిస్తామని వార్నింగ్ ఇస్తారు. ఇక ఒక గంట తర్వాత పోలీసులు పురుషోత్తం ని రిలీజ్ చేస్తారు.
ఇకపోతే పురుషోత్తం తాయారు అలాగే రమణయ్య ముగ్గురు కూడా గాయత్రిని బాధ పెట్టేలా మాట్లాడతారు.. ఇక తాయారు మాత్రం గాయత్రిని దారుణంగా కొట్టేస్తుంది.. ఇక అప్పుడే పెళ్లి వాళ్ళు వచ్చినట్లు ఫోన్ చేయడంతో పురుషోత్తం అక్కడికి వచ్చేస్తాడు. పెళ్లి వాళ్ళు వచ్చారంట నేను బయటకు వెళ్తాను.. నువ్వు అర్జెంట్గా అమ్మాయిని రెడీ చేసి లోపలికి తీసుకొని రా అని పురుషోత్తం చెప్పి బయటకు వెళ్ళిపోతాడు.. నువ్వు రెడీ అయ్యి తొందరగా బయటికి రా ఆ మాధవ్ గీధవని అన్నావంటే వాడిని మీ నాన్న చంపేసేనా వస్తాడు అని తయారు అంటుంది.. ఇక గాయత్రీ చేసేదేమీ లేక పెళ్లిచూపులో కూర్చుంటానని తాయారు కి మాట ఇస్తుంది.. ఇక పెళ్లి చూపుల కోసం అని వాళ్ళు రాగానే గాయత్రిని రెడీ అవ్వమని చెప్పి తాయారు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది..
అబ్బాయిని చూసి తాయారు చాలా బాగున్నాడు అని అంటుంది. ఇక తర్వాత పెళ్ళికొడుకు గురించి తాయారు అన్ని విషయాలు కనుక్కుంటుంది. అమ్మాయిని చూపించండి ఆ తర్వాత వర్జం వస్తుంది అని పంతులుగారు చెప్పారు ఆ తర్వాత మనం కూర్చొని మాట్లాడుకుందామని అంటుంది పెళ్లి కొడుకు తల్లి.. ఇక మొత్తానికి గాయత్రి పెళ్లి సంబంధాన్ని గాయం చేసేస్తారు. నారాయణ తన చెల్లెల్ని ఈరోజు ఎలాగైనా సరే చంపేసి తన కొడుకుల్ని బయటికి తీసుకురావాలని అనుకుంటారు. బయట కూర్చుని కత్తి నోరుతూ ఉంటాడు అంతలోకే అందరూ రావడంతో ఏంట్రా వచ్చేసారు అని అడుగుతారు. నువ్వు ఆ కత్తిని ఎందుకు నూరుతున్నావు అని అడగగానే ఆ తయారుని చంపేయడానికి అని అంటారు. అయినా మమ్మల్ని రిలీజ్ చేశారు కదా నువ్వెందుకు ఇప్పుడు చంపాలి అని అనగానే అవును.. మహాలక్ష్మి వల్లే మమ్మల్ని రిలీజ్ చేశారని మాధవ్ అంటాడు.. మొత్తానికి చేసిన పనికి నారాయణ కూడా పొగడ్తలు వర్షం కురిపిస్తాడు..
Also Read :కన్నీళ్లు పెట్టుకున్న అమూల్య.. ధీరజ్, విశ్వక్ మధ్య గొడవ..గ్రాండ్ గా హోలీ సంబరాలు..
ఇక తర్వాత జరిగింది మహా మాధవ్ ని మీరు ఏమి ఆలోచించకండి అని అడుగుతారు.. మీ తప్పేమీ లేదు కదా మీరు బాధపడకండి. మీలాంటి మంచి మనిషికి అంత మంచే జరుగుతుంది అని అందరూ అంటారు.. మీరు ఇవాళ ఏ పని చేయకండి పెద్ది అన్ని పనులు నేనే చేస్తాను అని మహాలక్ష్మి అంటుంది. మా ఇంటి గురించి అందరూ తప్పుగా మాట్లాడే వాళ్లే కానీ మాకు సాయం చేసే వాళ్ళు కూడా ఎవరూ లేరమ్మా. నువ్వు చాలా గొప్ప పని చేశావు ఇవాళ మా ఇంటికి దీపాన్ని పెట్టావు అని మాధవ్ ఎమోషనల్ అవుతాడు. మీరు చేసిన గొప్ప పనికి మెచ్చుకోవాల్సింది అని అంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. ఇక రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..