E-Paper
Advertisement

Nagar kurnool Crime: దారుణమైన ఘటన.. ముగ్గురు క్లాస్‌మేట్లపై ఇంటర్ స్టూడెంట్అత్యాచారం, ఆపై బ్లాక్‌మెయిల్

Nagar kurnool Crime: దారుణమైన ఘటన.. ముగ్గురు క్లాస్‌మేట్లపై ఇంటర్ స్టూడెంట్అత్యాచారం, ఆపై బ్లాక్‌మెయిల్

Nagar kurnool Crime: సభ్య సమాజం తలదించుకునే ఘటనలు క్రమంగా పెరుగుతున్నాయి. తనతో పాటు చదువుతున్న ముగ్గురు బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డాడు క్లాస్‌మేట్. అంతేకాదు ఆయా దృశ్యాలను ఫోన్‌తో చిత్రీకరించి వారిని బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. బాలికల్లో ఒకరు గర్భం దాల్చారు. ఈ ఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లాలో వెలుగు చూసింది.

నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో దారుణమైన ఘటన

చేతిలో మొబైల్ వచ్చిన తర్వాత మంచి కంటే.. చెడుకు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు నేటి యువకులు. ఫలితంగా అనేక అనర్థాలు జరుగుతున్నాయి. ఎప్పుడూ వినని ఘటనలు సైతం చోటు చేసుకుంటున్నాయి. చదువుకోవాల్సిన వయసులో ఓ ఇంటర్ విద్యార్థి కామాంధుడిగా మారిపోయాడు. అంతేకాదు తనతో చదువుతున్న ముగ్గురు బాలికల జీవితాలను నాశనం చేశాడు. ప్రేమ పేరుతో ఒకరికి తెలియకుండా మరొకర్ని లోబర్చుకున్నాడు.

నాగర్‌ కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్ మండలానికి చెందిన ఓ విద్యార్థి ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు. తనతోపాటు చదువుతున్న పెద్దకొత్తపల్లి, నాగర్‌కర్నూల్, వనపర్తి ప్రాంతాలకు చెందిన ముగ్గురు బాలికలతో పరిచయం పెంచుకున్నాడు. ఆ తర్వాత దాన్ని ప్రేమగా మార్చుకున్నాడు. ఆ తర్వాత తనలోని కోరికలను తీర్చుకున్నాడు.

ముగ్గురు క్లాస్‌మేట్లపై ఇంటర్ స్టూడెంట్అత్యాచారం

అత్యాచారానికి పాల్పడిన దృశ్యాలను తన ఫోన్‌లో చిత్రీకరించాడు. ఆ వీడియోలు చూసి ముగ్గురు బాలికలను బ్లాక్ మెయిల్ చేశాడు. తనకు డబ్బులు ఇవ్వకుంటే సోషల్ మీడియా, తల్లిదండ్రులకు పంపిస్తానని బెదిరించడం మొదలుపెట్టాడు. రోజు రోజుకూ కామాంధుడి టార్చర్ ఎక్కువ కావడంతో తట్టుకోలేకపోయారు.

బాధితురాళ్లలో ఒకరు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది. ఒక్కసారిగా వారంతా షాక్‌కు గురయ్యారు. వెంటనే సదరు స్టూడెంట్‌ని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అతడి వద్ద మొబైల్ ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు. చివరకు పోలీసులకు వాడ్ని అప్పగించి జరిగినదంతా చెప్పారు. పోలీసుల విచారణలో షాకైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ALSO READ: ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రావెల్ బస్సు బోల్తా, స్పాట్‌లో 22 మంది

బాధితుల్లో ఓ బాలిక గర్భం దాల్చింది. యువతిని కొల్లాపూర్‌లోని ఓ ప్రైవేట్ క్లినిక్‌కు తీసుకెళ్లి అబార్షన్ చేయించాడు. నిబంధనలకు విరుద్ధంగా అబార్షన్ చేసిన ప్రైవేట్ ఆసుపత్రి డాక్టర్, నర్సును అరెస్ట్ చేశారు. ఆ క్లీనిక్ సెంటర్‌ని సీజ్ చేశారు. ముగ్గురు నిందితులకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. ఇక ప్రధాన నిందితుడు ఇంటర్ స్టూడెంట్‌ని జువైనల్ హోంకు తరలించారు పోలీసులు.

Related News

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

‘కిల్లర్’ మూవీ సెట్లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి

Big Stories

×