Podarillu Today Episode March 21st : నిన్నటి ఎపిసోడ్ లో.. మాధవ తలనొప్పిగా ఉంది అని చెప్పగానే మహాలక్ష్మి వెళ్లి కాఫీ తీసుకొని వస్తానని అంటుంది.. ఈ మధ్య నువ్వు నీలో నువ్వే లేవు గాయత్రీ కి పెళ్లి అయిపోతుందని నువ్వు బాధపడుతున్నావా అని అడుగుతుంది.. గాయత్రి ని మర్చిపోలేకపోతున్నారు కదా అని అడగడంతో మాధవ్ బాధపడతాడు. నా మనసులో ఏమున్నా తన మనసులో ఏమున్నా జరిగేది ఏమీ లేదు కదమ్మా అని మాధవ అంటాడు. మీరు అలా అనుకుంటే ఏం చేయాలి పెద్ది. మీకు గాయత్రి అంటే ఇష్టం అన్న విషయం మీరు చెప్తే మేము మీకోసం ఏమీ చేయలేము అని మహాలక్ష్మి అడుగుతుంది..
తన మనసులో ఏమన్నా నా మనసులో ఉన్న ఎవరూ చేసేది ఏమీ లేదు కదా అని మాధవ్ అంటాడు. కాఫీ చాలా బాగుందమ్మా ఈ విషయాలు గురించి ఇక మర్చిపోతే బాగుంటుంది అని మాధవ్ మహాతో అంటాడు. శైలు కీర్తి ఇద్దరు కలిసి చేసిన ప్లాను అట్టర్ ప్లాఫ్ అవడంతో వాడు ఇంత తెలివిగా ఉన్నాడంటే అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే కేశవ నా షాప్ కి వచ్చి నా మీదే ప్లాంట్ వేస్తారని అంటాడు. అది విన్న శైలు కీర్తి వీధి షాప్ లో వీడి మీద ప్లాన్లు వేస్తే ఇలాగే ఉంటుంది అని అనుకుంటారు. ఆ తర్వాత ఇంకొకసారి ఇలాంటి ప్లాన్ వేసి నన్ను దెబ్బ కొట్టాలని చూసావనుకో నీ ఫోన్ పిచ్చలవుతుంది అని కేశవ వార్నింగ్ ఇస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. కేశవ దగ్గరకు బండి రిపేర్ కు వచ్చిన లాయర్ చక్రీ గురించి నిజం బయట పెట్టేస్తాడు.. తన భార్యతో విడాకులు తీసుకోవాలని నా దగ్గరకు వచ్చారు కానీ నేను ఆధార్ కార్డు లేకుండా విడాకులు ఇవ్వడానికి కుదరదు అని చెప్పడంతో వాళ్ళు వెళ్ళిపోయారు.. మీ అన్నయ్య ఏమో ఆమెతో కలవాలని ప్రయత్నిస్తున్న సరే ఆమె మాత్రం మీ అన్నయ్య నుంచి విడిపోవాలని అనుకుంటుంది. నువ్వు తెలిసిన వాడివి కాబట్టి నీకు ఈ విషయం చెప్పాను అది ఏంటో కనుక్కొని లాయర్ చెప్తాడు. ఇక తర్వాత చక్రీని ఇంటికి తీసుకొని కేశవ వస్తాడు.. లాయర్ ని ఎందుకు కలిశావు అని కేశవ నిలదీసి అడుగుతాడు.. నేను లాయర్ ని కలవడానికి ఒక కారణం ఉంది కదా అని చక్రితో కేశవ అంటాడు.. మీరిద్దరూ విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నారా అని కేశవ అడుగుతాడు. ఆ విడాకులు తీసుకోవాలనుకునింది మీ అన్నయ్య కాదు నేను అని మహా చెప్తుంది.
ఆ మాట వినగానే కేశవ కి ఫీజులు ఎగిరిపోతాయి.. ఆ తర్వాత ఎంత చెప్తున్నా సరే మాధవ్ మాత్రం నోరు విప్పకుండా ఉంటాడు. ఏంటి మాట్లాడవు నీకు ఈ విషయం తెలీదా ఏంటి అని మాధవా ను కేశవ అడుగుతాడు. చెప్పు అన్నయ్య నీకు తెలియకుండా నీదంతా జరిగిందా? నువ్వు ఎందుకు ఏదో దాస్తున్నావ్ అని నాకు అనిపిస్తుంది నిజం చెప్పు అని కేశవ ఎంత అడిగినా సరే మాధవ్ మాత్రం నోరు విప్పకుండా మౌనంగా ఉంటాడు. ఇదంతా నీకు తెలిసే జరుగుతుంది కదా అయినా కూడా నువ్వు మౌనంగా ఉన్నావు అంటే దీని వెనక ఏదో ఉంది అని నాకు అర్థం అవుతుంది అని కేశవ మాధవాని అనుమానిస్తాడు. మాధవ్ మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు.
Also Read :మాధవ్ కోసం మహా నిర్ణయం.. శైలుకు మరో షాక్.. కేశవ దెబ్బకు చక్రీ ఫ్యూజుల్ అవుట్..
ఇన్నాళ్ళకి మన ఇంటికి ఒక అమ్మాయి వచ్చింది అని చాలా సంతోషంగా ఉన్నాము. కన్నా ని చూడండి ఎలా ఏడుస్తున్నాడో.. వాడి కోసమైనా నిజం చెప్పొచ్చు కదా అని కేశవ ఎంత అడుగుతున్నా సరే చక్రి మాధవ్ ఇద్దరు కూడా మౌనంగా ఉంటారు. అటు నారాయణ ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయంలో ఉండిపోతాడు. తన ఇంటికి వచ్చిన కోడలు వెళ్ళిపోతుందేమో అని భయపడిపోతూ ఉంటాడు. మహాలక్ష్మి మాత్రం తన పెళ్లి ఎలా జరిగిందన్న విషయాన్ని కేశవతో చెప్పాలని ఫిక్స్ అవుతుంది.. కన్నా మాత్రం ఇంటికి వచ్చిన వదిన వెళ్ళిపోతుందని బాధ పడిపోతూ ఉంటాడు. మరి మాధవ్ గాయత్రి ల పెళ్లి మహాలక్ష్మి చేస్తుందా? అన్నది సస్పెన్స్ గా మారుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. మరి సోమవారం ఎపిసోడ్లో మహాలక్ష్మి కేశవ కి నిజం చెప్తుందేమో చూడాలి..