Podarillu Today Episode March 26th : నిన్నటి ఎపిసోడ్ లో.. మాధవ్ మాత్రం పెళ్లి అనేది ఒక తాడు మాత్రమే కాదు ఆత్మబంధం. అది ఒకసారి పడిన తర్వాత ఇంటి మనుషులతో బంధం ఏర్పడుతుంది.. మేము ఎంత చెప్తున్నా సరే నువ్వు ఒంటరిగా వెళ్లిపోయి ఇబ్బంది పడాలని అనుకుంటున్నావా..? మేము నిన్ను సరిగా చూసుకోమని అనుకుంటున్నావా ఏంటి అని మాధవ్ మహాలక్ష్మితో అంటాడు.. మహాలక్ష్మి ఎంత చెప్తున్నా సరే నువ్వు ఇక్కడే ఉండాల్సిందే నేను నీకు పెద్దగానే చెప్తున్నాను అని మాధవ్ అంటాడు. మాధవ్ మాట విన్న మహాలక్ష్మి అలాగే అని అంటుంది.. పెద్ది అని మారవుని అంటున్న సరే నువ్వు ఇంకేం మాట్లాడద్దు. పెద్దినే చెప్తున్నాను నువ్వు ఇక్కడే ఉండాలి అని కండిషన్ పెడతాడు.
నేను చెప్పేది కూడా వినరా అని మహా అడుగుతుంది. ఏం చెప్పాలనుకుంటున్నావో అని మాధవ్ అంటాడు. నేను ఇక్కడే ఉంటాను అని చెప్పాలని అనుకుంటున్నాను అది కూడా చెప్పద్దా అని మాధవ్ తో అంటుంది మహా.. మహాలక్ష్మి ఇక్కడే ఉంటానని అనడంతో ముగ్గురు ఆనందంతో డ్యాన్సులు వేస్తారు.. ముగ్గురు కూడా అలా డాన్సులు వేస్తూ మహాలక్ష్మి ఇక్కడే ఉంటుందని చాలా సంతోషంగా ఉంటారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. మహా కన్న ఇద్దరు కూడా చదువుల్లో బిజీగా ఉంటే అప్పుడే అక్కడున్న ఫోన్ కి ఫోన్ వస్తుంది. ఈ ముంగిసడు ఇంట్లో ఫోన్ పెట్టేసాడు అంటున్నాడు కచ్చితంగా విని ఇరికించాలి అని వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఉన్నట్లు నమ్మిస్తుంది శైలు. అది విన్న మహాలక్ష్మి ఇంత మౌనంగా ఉంటాడు మీ అన్నయ్య కూడా ఇలా చేస్తున్నాడంటే అస్సలు నమ్మలేకపోతున్నాను అని అంటుంది.. కేశవ ఫోను ఇంట్లో పెట్టిన విషయం తెలుసుకొని మళ్లీ అక్కడికి వచ్చి ఫోన్ తీసుకుంటాడు.. ఆ ఫోన్ తీసుకోగానే శైలు ఫోన్ చేసిందేమో అని చెక్ చేస్తాడు కానీ అందులో లేకపోయినా సరే ఒకసారి తనకి కాల్ చేసి కనుక్కోవాలని కేశవా అనుకుంటాడు.. శైలు కి కాల్ చేయగానే నేను ఏమి చెప్పలేదు. నాకు ఏమీ తెలియదు అని అంటుంది కానీ కేశవ కి మాత్రం అనుమానం మొదలవుతుంది..
ఇక తర్వాత మహాలక్ష్మి కన్నా ఇద్దరూ కూడా కేశవ ఏం మాట్లాడుతున్నారో అని వింటారు. అయితే శైలు నీ కేశవ బుస్సు అనడంతో దాన్ని నోట్ చేసుకుంటారు. ఇక శైలు ముంగిస అనడంతో ముంగిస అన్నావంటే మొహం పగలగొడతానని కేశవ్ అంటారు. అయితే వీరిద్దరి కన్వర్జేషన్ విన్నా మహాలక్ష్మి కన్నా ఇద్దరు కూడా కేశవ అని ఒక ఆట ఆడుకోవాలని అనుకుంటారు.. రాత్రి అవ్వగానే అందరూ భోజనానికి కూర్చుంటారు. మాధవ్ వేస్తున్న పోపు బుసని సౌండ్ వస్తుంది అని మహాలక్ష్మి అంటుంది.. ఆ మాట వినగానే కేశవ కి డౌట్ వస్తుంది..
మళ్లీ బుస్సు బుస్సు అని సౌండ్ వినిపించగానే ఏంట్రా ఈ బుస్బుస్సు అని అందరూ అనుకుంటారు. ఈ పక్కనున్న స్థలాన్ని కార్పొరేట్ వాళ్ళకి ఇచ్చారట వాళ్ళు అక్కడ ఉన్న చెట్లని కొట్టేశారు. పాములు ఇళ్లల్లోకి కూడా వస్తున్నాయట అని కన్ను అనడంతో అవునా నిజమా అని చక్రి కూడా అంటాడు. కానీ మహాలక్ష్మి మాత్రం కేశవాణి వదలకుండా ప్రతిసారి బుస్సు అని ఆడుకుంటుంది. అయితే ముంగిసలు ఏమైనా వస్తే పాములు పోతాయేమో అని కన్నా కూడా అనడంతో ఇద్దరు కలిసి కేశవ అని ఆడుకుంటున్నారని అర్థమవుతుంది.. ఇక నారాయణ భోజనం చేయడం చూసిన మహాలక్ష్మి ఇబ్బందిగా ఫీల్ అవుతుంది..
భోజనం సరిగ్గా తినొచ్చు కదా అని చక్రి ఎంతగా చెప్పిన సరే నా భోజనం నా ఇష్టం రా.. నా తండ్రి నా ఇష్టం వచ్చినట్లు తింటాను అని నారాయణ అంటాడు. ఇక తర్వాత నాకు ఎవరు సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని నారాయణ అనగానే మహాలక్ష్మి నేను సర్టిఫికెట్ కోసం కాలేజీకి వెళ్ళాలి అని అడుగుతుంది. ఆ మాట వినగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. సర్టిఫికెట్ అని అనగానే ఆ కాలేజీకి ఎంత దూరం వెళ్లాలి అంటే భయమేస్తుంది రా నేను వెళ్లి తీసుకురానా అని కేశవ అంటాడు.. నేనే వెళ్లాలి అని మహాలక్ష్మి అనగానే దీని గురించి తర్వాత మాట్లాడదాం ముందు భోజనం చేయండి అని మాధవ్ అంటాడు.
Also Read : వల్లికి మైండ్ బ్లాక్.. నర్మద మాస్టర్ ప్లాన్.. అడ్డంగా వల్లి ఇరుక్కుంటుందా..?
కేశవ శైలు కి ఫోన్ చేసి మా ఇంట్లో వాళ్ళ దగ్గర నువ్వు ఏం చెప్పావే అని సీరియస్గా అడుగుతాడు.. శైలు అసలు నిజం చెప్పడంతో కేశవ నన్ను అడ్డంగా ఇరికిస్తావా? నీ పని చెప్తాను చూడు అని అంటాడు.. ఇక తర్వాత మహాలక్ష్మి దగ్గరికి చక్రీ వచ్చి నేను మీకు తోడుగా వస్తాను అని ఇదంతా చెప్పినా సరే.. మహా మాత్రం ఎవ్వరు తోడు అవసరం లేదు అని అంటుంది.. కన్నా అందరు పడుకున్న తర్వాత బస్సు అని సౌండ్ చేస్తాడు దాంతో పాము వచ్చిందని అందరూ కంగారు పడతారు. కేశవ అమ్మాయి గురించి అసలు నిజాన్ని బయట పెట్టేస్తాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..