Rahul Gandhi: కేరళ శాసనసభకు ఎన్నికల నేపథ్యంలో ప్రచారానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ హాజరు కావాల్సి ఉంది. ఈలోగా సోనియాగాంధీ అనారోగ్యానికి గురికావడంతో ఆమెని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారు. రాత్రి ఆసుపత్రిలో తన కళ్ల ముందు జరిగిన ఓ సన్నివేశాన్ని గుర్తు చేసుకున్నారు రాహుల్గాంధీ.
మంగళవారం రాత్రి తాను ఆసుపత్రిలో మా అమ్మ గదిలో ఉన్న ఓ చిన్న సోఫాలో నిద్రపోతున్నానని తెలిపారు. అందరు కొడుకుల మాదిరిగా తాను కూడా అమ్మ ఆరోగ్యం గురించి తీవ్రంగా ఆందోళన చెందానని వీడియో ద్వారా తెలిపారు. ఆ రాత్రి తనకు ఒకే ఒక్క విషయంలో ఓదార్పు లభించిందన్నారు. ప్రతి గంటకూ మా అమ్మను చూడటానికి కేరళకు చెందిన ఒక నర్సు వల్ల తనకు ఓదార్పు దొరికిందన్నారు.
ప్రతి గంటకూ ఆమె వచ్చి మా అమ్మ ఆరోగ్యం గురించి చెక్ చేసేదని వివరించారు. ఆమె నవ్వి, అమ్మ చేతిని పట్టుకునేదని తెలిపారు. అత్యంత కష్ట సమయాల్లో కేరళకు చెందిన నర్సుల నుండి ఎంత మంది కొడుకులు, కూతుళ్లు, సోదరులు, సోదరీమణులు ఓదార్పు పొంది ఉంటారోనని తాను ఆలోచించడం మొదలుపెట్టానని వివరించారు.
ఉదయాన్ని, తాను ఆమెని పిలిచి మీరు రాత్రి నిద్ర పోతారా, రాత్రంతా పని చేస్తారా? అని అడిగానని, అందుకు ఆమె తాను రాత్రంతా పని చేస్తానని చెప్పిందన్నారు. ప్రపంచమంతా నిద్రపోతున్నప్పుడు కేరళ మహిళలు తమ రాష్ట్రంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఓదారుస్తూ వారి చేతులు పట్టుకుని వారికి మనశ్శాంతిని అందిస్తున్నారని మనసులోని భావాలను వ్యక్తం చేశారు.
Last night, I was sleeping on a small sofa in my mother’s room at the hospital, and like any son, I was extremely worried about her health.
The whole night, I was comforted by only one thing. I was comforted by a nurse from Keralam who came in every hour to check on my mother.… pic.twitter.com/H3Y8Ltu3ai
— Congress (@INCIndia) March 25, 2026