E-Paper
Advertisement

Rahul Gandhi: ఆ రాత్రి ఆందోళన చెందా.. ఆ నర్సు ఏం చేశారంటే.. అప్పుడే డిసైడ్ అయ్యా-రాహుల్‌‌గాంధీ

Rahul Gandhi: ఆ రాత్రి ఆందోళన చెందా.. ఆ నర్సు ఏం చేశారంటే.. అప్పుడే డిసైడ్ అయ్యా-రాహుల్‌‌గాంధీ
Advertisement

Rahul Gandhi: కేరళ శాసనసభకు ఎన్నికల నేపథ్యంలో ప్రచారానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ హాజరు కావాల్సి ఉంది. ఈలోగా సోనియాగాంధీ అనారోగ్యానికి గురికావడంతో ఆమెని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారు. రాత్రి ఆసుపత్రిలో తన కళ్ల ముందు జరిగిన ఓ సన్నివేశాన్ని గుర్తు చేసుకున్నారు రాహుల్‌గాంధీ.

మంగళవారం రాత్రి తాను ఆసుపత్రిలో మా అమ్మ గదిలో ఉన్న ఓ చిన్న సోఫాలో నిద్రపోతున్నానని తెలిపారు. అందరు కొడుకుల మాదిరిగా తాను కూడా అమ్మ ఆరోగ్యం గురించి తీవ్రంగా ఆందోళన చెందానని వీడియో ద్వారా తెలిపారు. ఆ రాత్రి తనకు ఒకే ఒక్క విషయంలో ఓదార్పు లభించిందన్నారు. ప్రతి గంటకూ మా అమ్మను చూడటానికి కేరళకు చెందిన ఒక నర్సు వల్ల తనకు ఓదార్పు దొరికిందన్నారు.

Advertisement

ప్రతి గంటకూ ఆమె వచ్చి మా అమ్మ ఆరోగ్యం గురించి చెక్ చేసేదని వివరించారు. ఆమె నవ్వి, అమ్మ చేతిని పట్టుకునేదని తెలిపారు. అత్యంత కష్ట సమయాల్లో కేరళకు చెందిన నర్సుల నుండి ఎంత మంది కొడుకులు, కూతుళ్లు, సోదరులు, సోదరీమణులు ఓదార్పు పొంది ఉంటారోనని తాను ఆలోచించడం మొదలుపెట్టానని వివరించారు.

ఉదయాన్ని, తాను ఆమెని పిలిచి మీరు రాత్రి నిద్ర పోతారా, రాత్రంతా పని చేస్తారా? అని అడిగానని, అందుకు ఆమె తాను రాత్రంతా పని చేస్తానని చెప్పిందన్నారు. ప్రపంచమంతా నిద్రపోతున్నప్పుడు కేరళ మహిళలు తమ రాష్ట్రంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఓదారుస్తూ వారి చేతులు పట్టుకుని వారికి మనశ్శాంతిని అందిస్తున్నారని మనసులోని భావాలను వ్యక్తం చేశారు.

Advertisement

 

Related News

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

రన్నింగ్‌ బస్సులో జుట్టు పట్టుకొని కొట్టుకున్న లేడి కండక్టర్, మహిళా ప్యాసింజర్.. ఇదిగో వీడియో!

తమిళనాడులో వేడెక్కిన రాజకీయం.. సీఎం విజయ్‌కు బెదిరింపులు, డీఎంకె ఎమ్మెల్యే అరెస్ట్

ట్రీట్‌మెంట్‌కి వచ్చిన పేషెంట్.. ఫ్యాన్ చంపేసింది, ఆసుపత్రిలో ఆ రాత్రి ఏం జరిగిందంటే..

కేంద్రానికి ఆఖరి గడువు.. మూడు ఆప్షన్లలో ఏది ఎంచుకున్నా దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్‌చుక్

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

Big Stories

Advertisement
×