E-Paper
Advertisement

Rahul Gandhi: ఆ రాత్రి ఆందోళన చెందా.. ఆ నర్సు ఏం చేశారంటే.. అప్పుడే డిసైడ్ అయ్యా-రాహుల్‌‌గాంధీ

Rahul Gandhi: ఆ రాత్రి ఆందోళన చెందా.. ఆ నర్సు ఏం చేశారంటే.. అప్పుడే డిసైడ్ అయ్యా-రాహుల్‌‌గాంధీ
Advertisement

Rahul Gandhi: కేరళ శాసనసభకు ఎన్నికల నేపథ్యంలో ప్రచారానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ హాజరు కావాల్సి ఉంది. ఈలోగా సోనియాగాంధీ అనారోగ్యానికి గురికావడంతో ఆమెని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారు. రాత్రి ఆసుపత్రిలో తన కళ్ల ముందు జరిగిన ఓ సన్నివేశాన్ని గుర్తు చేసుకున్నారు రాహుల్‌గాంధీ.

మంగళవారం రాత్రి తాను ఆసుపత్రిలో మా అమ్మ గదిలో ఉన్న ఓ చిన్న సోఫాలో నిద్రపోతున్నానని తెలిపారు. అందరు కొడుకుల మాదిరిగా తాను కూడా అమ్మ ఆరోగ్యం గురించి తీవ్రంగా ఆందోళన చెందానని వీడియో ద్వారా తెలిపారు. ఆ రాత్రి తనకు ఒకే ఒక్క విషయంలో ఓదార్పు లభించిందన్నారు. ప్రతి గంటకూ మా అమ్మను చూడటానికి కేరళకు చెందిన ఒక నర్సు వల్ల తనకు ఓదార్పు దొరికిందన్నారు.

Advertisement

ప్రతి గంటకూ ఆమె వచ్చి మా అమ్మ ఆరోగ్యం గురించి చెక్ చేసేదని వివరించారు. ఆమె నవ్వి, అమ్మ చేతిని పట్టుకునేదని తెలిపారు. అత్యంత కష్ట సమయాల్లో కేరళకు చెందిన నర్సుల నుండి ఎంత మంది కొడుకులు, కూతుళ్లు, సోదరులు, సోదరీమణులు ఓదార్పు పొంది ఉంటారోనని తాను ఆలోచించడం మొదలుపెట్టానని వివరించారు.

ఉదయాన్ని, తాను ఆమెని పిలిచి మీరు రాత్రి నిద్ర పోతారా, రాత్రంతా పని చేస్తారా? అని అడిగానని, అందుకు ఆమె తాను రాత్రంతా పని చేస్తానని చెప్పిందన్నారు. ప్రపంచమంతా నిద్రపోతున్నప్పుడు కేరళ మహిళలు తమ రాష్ట్రంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఓదారుస్తూ వారి చేతులు పట్టుకుని వారికి మనశ్శాంతిని అందిస్తున్నారని మనసులోని భావాలను వ్యక్తం చేశారు.

Advertisement

 

Related News

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. విద్యార్థులపై కేసులన్నీ కొట్టివేత.. సెప్టెంబర్ 5 ఢిల్లీ మార్చ్ రద్దు

Big Stories

Advertisement
×