E-Paper
Advertisement

Sai Kiran: 47 ఏళ్ల వయసులో శుభవార్త చెప్పిన సాయికిరణ్.. పోస్ట్ వైరల్!

Sai Kiran: 47 ఏళ్ల వయసులో శుభవార్త చెప్పిన సాయికిరణ్.. పోస్ట్ వైరల్!

Sai Kiran:ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు వరుసగా శుభవార్తలు చెబుతూ అభిమానులను అలరిస్తున్నారు. ఈ క్రమంలోనే అల్లు శిరీష్ ఎంగేజ్మెంట్ చేసుకొని పెళ్లికి సిద్ధమవుతుండగా.. మరోవైపు నారా రోహిత్ తాను ప్రేమించిన హీరోయిన్ సిరి లేళ్ల తో ఏడడుగులు వేశారు. ఇక లావణ్య – వరుణ్ తేజ్ ఈ ఏడాది పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చి శుభవార్త తెలుపగా.. అటు సుహాస్ కూడా మరో కొడుకుకు జన్మనిచ్చి అభిమానులతో ఆ శుభవార్తను పంచుకున్నారు. ఇప్పుడు రామ్ చరణ్, ఉపాసన దంపతులు కూడా మరో శుభవార్త తెలిపారు. అంతేకాదు కవల పిల్లలకు జన్మనివ్వబోతున్నామని చెప్పి అందరిని సంతోషపరిచారు.

47 ఏళ్ల వయసులో వరుస శుభవార్తలు..

ఇప్పుడు మరొక హీరో 47 సంవత్సరాల వయసులో వరుసగా శుభవార్తలు చెబుతూ అభిమానులను అలరిస్తున్నారు. ఆయన ఎవరో కాదు హీరో సాయికిరణ్ (Sai Kiran). ఈయన ఎవరో కాదు అలనాటి సింగర్ రామకృష్ణ కుమారుడు.. హీరో అవ్వాలని ఇండస్ట్రీలోకి వచ్చిన ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ పై రామోజీరావు నిర్మాతగా తెరకెక్కించిన ‘నువ్వే కావాలి’ సినిమాలో సెకండ్ హీరో పాత్రలో నటించి అందులో “అనగనగా ఆకాశం ఉంది” అనే పాటతో ఓవర్ నైట్ లోనే స్టార్ సెలబ్రిటీ అయిపోయారు. ఆ తర్వాత ప్రేమించు, రావే నా చెలియా, డార్లింగ్ డార్లింగ్, ఎంత బాగుండో , బింబిసారా, రౌడీ ఇన్స్పెక్టర్ ఇలా చాలా చిత్రాలలో నటించిన ఈయన హీరోగా మాత్రం నిలదొక్కుకోలేకపోయారు.

ALSO READ:Bigg Boss 9: హౌస్ మేట్స్ నిజ స్వరూపం బయటపెట్టిన మాధురి.. అతడే ఫేక్ అంటూ!

త్వరలో తల్లిదండ్రులు కాబోతున్న సాయికిరణ్ – స్రవంతి..

సినీ ఇండస్ట్రీలో పెద్దగా కలిసి రాకపోవడంతో 2000 సంవత్సరంలోనే సీరియల్స్ లోకి అడుగుపెట్టిన సాయికిరణ్.. ప్రస్తుతం పడమటి సంధ్యారాగం, భానుమతి వంటి సీరియల్స్ లో నటిస్తున్నారు. ఇక్కడ కూడా పదుల సంఖ్యలో సీరియల్స్ చేసి ఇటు బుల్లితెర ఆడియన్స్ ని కూడా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా తెలుగు, తమిళ్, మలయాళం సినిమాలు, సీరియల్స్ లో నటించి మంచి పేరు దక్కించుకున్నారు. ఇకపోతే కెరియర్ తొలినాళ్లల్లో వైష్ణవి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. కానీ వీరి కాపురం కొన్నాళ్లు సజావుగానే సాగింది. ఆ తర్వాత మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకొని విడిపోయారు. ఈ దంపతులకు కుమార్తె కూడా ఉంది. ఇక ఇన్ని రోజులు ఒంటరిగా ఉన్న సాయికిరణ్ కోయిలమ్మ సీరియల్ లో సహనటి స్రవంతి (Sravanthi)తో ప్రేమలో పడి గత ఏడాది వివాహం చేసుకున్నారు. ఇటీవలే ఈమె గర్భం దాల్చగా డెలివరీ కోసం ఇద్దరు ఎదురుచూస్తున్నారు. ఈలోపే తాజాగా సాయికిరణ్ కు స్రవంతి సర్ప్రైజ్ ఇచ్చింది.

భర్తకు మరో సర్ప్రైజ్ ఇచ్చిన స్రవంతి..

తాజాగా తన భర్త కోసం రాయల్ ఎన్ఫీల్డ్ సూపర్ మెటీయర్ 650 బైకును బహుమతిగా అందించింది. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మా ఫ్యామిలీలోకి కొత్త మెంబర్ వచ్చింది. నా భర్తకు కంగ్రాట్స్ అంటూ స్రవంతి రాసుకొచ్చింది. భార్య ఇచ్చిన సర్ప్రైజ్ తో షాక్ అయిన సాయికిరణ్ ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఇంత అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు అంటూ తెలిపారు. త్వరలోనే స్రవంతి పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్న విషయం తెలిసిందే.

Related News

Bramhamudi Rudraani : ‘ బ్రహ్మముడి ‘ రుద్రాణి ఆస్తులు ఎన్ని కోట్లు..? హీరోయిన్లు సరిపోరు..

Podarillu Lalitha : ‘పొదరిల్లు’ మహా తల్లి రియల్ లైఫ్.. రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Gundeninda GudiGantalu Today episode: పాపం ప్రభావతి.. బాలును అరెస్ట్ చేసిన పోలీసులు.. మనోజ్ ను కొట్టిన పోలీసులు..

Podarillu Today Episode : అడ్డంగా బుక్కయిన ప్రతాప్.. మాధవ్ దెబ్బకు మైండ్ బ్లాక్.. అన్నదమ్ముల సీన్ హైలెట్..

Illu Illalu Pillalu Today Episodes: గుడ్డిగా నమ్మిమోసపోయిన ధీరజ్.. పోలీస్ స్టేషన్ లో ధీరజ్.. నర్మదకు అడ్డంగా బుక్కయిన శ్రీవల్లి..

Intinti Ramayanam Today Episode: అవని కోసం కన్నీళ్లు పెట్టుకున్న ఆరాధ్య.. నిజం చెప్పిన మీనాక్షి.. పల్లవికి కమల్ వార్నింగ్..

Karthika Deepam 2 Serial Today Episode June 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సుమిత్ర బర్తుడే పార్టీకి వెళ్లిన దక్షిణమూర్తి

Brahmamudi Serial Today Episode June 4th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: సీఈవోగా ఇందు – ప్రకటించిన రేఖ 

Big Stories

×