E-Paper
Advertisement

Sai Kiran: 47 ఏళ్ల వయసులో శుభవార్త చెప్పిన సాయికిరణ్.. పోస్ట్ వైరల్!

Sai Kiran: 47 ఏళ్ల వయసులో శుభవార్త చెప్పిన సాయికిరణ్.. పోస్ట్ వైరల్!
Advertisement

Sai Kiran:ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు వరుసగా శుభవార్తలు చెబుతూ అభిమానులను అలరిస్తున్నారు. ఈ క్రమంలోనే అల్లు శిరీష్ ఎంగేజ్మెంట్ చేసుకొని పెళ్లికి సిద్ధమవుతుండగా.. మరోవైపు నారా రోహిత్ తాను ప్రేమించిన హీరోయిన్ సిరి లేళ్ల తో ఏడడుగులు వేశారు. ఇక లావణ్య – వరుణ్ తేజ్ ఈ ఏడాది పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చి శుభవార్త తెలుపగా.. అటు సుహాస్ కూడా మరో కొడుకుకు జన్మనిచ్చి అభిమానులతో ఆ శుభవార్తను పంచుకున్నారు. ఇప్పుడు రామ్ చరణ్, ఉపాసన దంపతులు కూడా మరో శుభవార్త తెలిపారు. అంతేకాదు కవల పిల్లలకు జన్మనివ్వబోతున్నామని చెప్పి అందరిని సంతోషపరిచారు.

47 ఏళ్ల వయసులో వరుస శుభవార్తలు..

ఇప్పుడు మరొక హీరో 47 సంవత్సరాల వయసులో వరుసగా శుభవార్తలు చెబుతూ అభిమానులను అలరిస్తున్నారు. ఆయన ఎవరో కాదు హీరో సాయికిరణ్ (Sai Kiran). ఈయన ఎవరో కాదు అలనాటి సింగర్ రామకృష్ణ కుమారుడు.. హీరో అవ్వాలని ఇండస్ట్రీలోకి వచ్చిన ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ పై రామోజీరావు నిర్మాతగా తెరకెక్కించిన ‘నువ్వే కావాలి’ సినిమాలో సెకండ్ హీరో పాత్రలో నటించి అందులో “అనగనగా ఆకాశం ఉంది” అనే పాటతో ఓవర్ నైట్ లోనే స్టార్ సెలబ్రిటీ అయిపోయారు. ఆ తర్వాత ప్రేమించు, రావే నా చెలియా, డార్లింగ్ డార్లింగ్, ఎంత బాగుండో , బింబిసారా, రౌడీ ఇన్స్పెక్టర్ ఇలా చాలా చిత్రాలలో నటించిన ఈయన హీరోగా మాత్రం నిలదొక్కుకోలేకపోయారు.

Advertisement

ALSO READ:Bigg Boss 9: హౌస్ మేట్స్ నిజ స్వరూపం బయటపెట్టిన మాధురి.. అతడే ఫేక్ అంటూ!

త్వరలో తల్లిదండ్రులు కాబోతున్న సాయికిరణ్ – స్రవంతి..

సినీ ఇండస్ట్రీలో పెద్దగా కలిసి రాకపోవడంతో 2000 సంవత్సరంలోనే సీరియల్స్ లోకి అడుగుపెట్టిన సాయికిరణ్.. ప్రస్తుతం పడమటి సంధ్యారాగం, భానుమతి వంటి సీరియల్స్ లో నటిస్తున్నారు. ఇక్కడ కూడా పదుల సంఖ్యలో సీరియల్స్ చేసి ఇటు బుల్లితెర ఆడియన్స్ ని కూడా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా తెలుగు, తమిళ్, మలయాళం సినిమాలు, సీరియల్స్ లో నటించి మంచి పేరు దక్కించుకున్నారు. ఇకపోతే కెరియర్ తొలినాళ్లల్లో వైష్ణవి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. కానీ వీరి కాపురం కొన్నాళ్లు సజావుగానే సాగింది. ఆ తర్వాత మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకొని విడిపోయారు. ఈ దంపతులకు కుమార్తె కూడా ఉంది. ఇక ఇన్ని రోజులు ఒంటరిగా ఉన్న సాయికిరణ్ కోయిలమ్మ సీరియల్ లో సహనటి స్రవంతి (Sravanthi)తో ప్రేమలో పడి గత ఏడాది వివాహం చేసుకున్నారు. ఇటీవలే ఈమె గర్భం దాల్చగా డెలివరీ కోసం ఇద్దరు ఎదురుచూస్తున్నారు. ఈలోపే తాజాగా సాయికిరణ్ కు స్రవంతి సర్ప్రైజ్ ఇచ్చింది.

భర్తకు మరో సర్ప్రైజ్ ఇచ్చిన స్రవంతి..

Advertisement

తాజాగా తన భర్త కోసం రాయల్ ఎన్ఫీల్డ్ సూపర్ మెటీయర్ 650 బైకును బహుమతిగా అందించింది. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మా ఫ్యామిలీలోకి కొత్త మెంబర్ వచ్చింది. నా భర్తకు కంగ్రాట్స్ అంటూ స్రవంతి రాసుకొచ్చింది. భార్య ఇచ్చిన సర్ప్రైజ్ తో షాక్ అయిన సాయికిరణ్ ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఇంత అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు అంటూ తెలిపారు. త్వరలోనే స్రవంతి పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్న విషయం తెలిసిందే.

Related News

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

కారు యాక్సిడెంట్..జీవితమే వద్దనుకున్నా..పవిత్ర ఎమోషనల్ కామెంట్స్!

ఆ ఒక్క కారణంతో షో నుంచి తప్పించారు..8 నెలలు నరకం చూసా: పాగల్ పవిత్ర

తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ సంజన..బేబీ షవర్ ఫోటోస్ వైరల్!

అరియానా అసహనం.. క్షమాపణలు చెప్పిన ట్రాన్స్ జెండర్స్!

మాధురి కేసులో బిగ్ ట్విస్ట్.. సంచలన నిజాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి భార్య!

బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునను ఏకిపారేస్తున్న నా అన్వేషణ అన్వేష్.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 3rd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు వెనకాలే ఫాలో అవుతున్న రౌడీలు  

Big Stories

Advertisement
×