Varasuralu Serial Cast : ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో సరికొత్త ఛానల్ సీరియల్స్ ప్రసారమవుతూ ఉంటాయి. జనాలను ఆకట్టుకునే విధంగా ఈ మధ్య కొత్త సీరియల్స్ రావడంతో పాటుగా అతి తక్కువ కాలంలోనే మంచి టీఆర్పీ రేటింగ్ తో ఓల్డ్ సీరియల్స్ కి పోటీ ఇస్తున్నాయి. గత రెండు నెలల్లోనే రెండు సీరియల్స్ రాగా ఇప్పుడు మరో కొత్త సీరియల్ కూడా ప్రేక్షకులు ముందుకు వచ్చేసింది.. ఆ సీరియల్ మరేంటో కాదు వారసురాలు. ఈ సీరియల్ ఇటీవలే ప్రారంభమైంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఈ సీరియల్ ప్రసారమవుతుంది. ప్రతిరోజు మధ్యాహ్నం రెండు గంటల 30 నిమిషాలకు సీరియల్ ప్రసారమవుతుంది.. అయితే ఈ సీరియల్ లో నటించిన నటీనటులు ఎవరు? ఏ పాత్రలో ఎవరు నటించారు అన్నది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..
ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న కొత్త సీరియల్ వారసురాలు. గతంలో వంటలకు కాలాంటి సూపర్ హిట్ సీరియల్ ని నిర్మించిన గగన్ ఈ సీరియల్లో కూడా వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన నటీనటులు మెయిన్ రోడ్ లో నటిస్తున్నారు . వాళ్ళ వివరాలను చూస్తే..
ఈ సీరియల్ లో హీరో పాత్రలో నటిస్తున్న వ్యక్తి సాకేత్.. అందులో నటిస్తున్న హీరో అసలు పేరు సుకేష్ రాజేంద్ర.. ఈయన ఒక తమిళ్ నటుడు. తమిళంలో ఎన్నో సీరియల్స్లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగులో ఇతనికి ఇదే మొదటి సీరియల్.. ఇటీవల ప్రారంభమైన ఈ సీరియల్ ఇతనికి మంచి క్రేజ్ ని తెచ్చి పెట్టింది..
వారసురాలు సీరియల్ లో హీరోయిన్ పేరు మైథిలి.. ఈమె ఒక కన్నడ నటి. ఈమె అసలు పేరు అర్పిత… ఈమె కూడా ఇది కొత్త సీరియల్. తెలుగులో మొదటి సీరియల్ ఇదే. మొదటి సీరియల్ తోనే మంచి రెస్పాన్స్ ను దక్కించుకుంది.
ఈ పాత్రలో బుల్లితెర నటుడు వికాస్ కనిపిస్తున్నాడు. మనసు మమత, మధుర నగర్ లో వంటి సీరియస్లలో నటించి తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నాడు.. ఇప్పుడు మరోసారి వారసురాలు సీరియల్ తో ప్రేక్షకుల మదుకు వచ్చేసాడు.
ఈ సీరియల్లో ఈ పాత్రలో చిట్టి ప్రకాష్ నటిస్తున్నారు. ఈయన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సీరియల్ లో నటించారు.. ఇప్పుడు ఈ సీరియల్ ద్వారా మరోసారి బుల్లితెర ప్రేక్షకులను పలకరించబోతున్నారు..
ఇందులో సౌదామిని పాత్రలో అర్చన నటిస్తున్నారు.. ఈమె గతంలో కార్తీకదీపం అలాగే కుంకుమ పువ్వు, కేరాఫ్ అనసూయ వంటి సూపర్ హిట్ సీరియల్లలో లీడర్లు నటించింది. ఇప్పుడు ఈ సీరియల్ తో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది.
ఈ సీరియల్లో కైలాసనాద్ పాత్రలో ప్రముఖ నటుడు విజయ్ నటిస్తున్నాడు. ఈయన స్టార్ మా లో ప్రసారమవుతున్న మగువ ఓ మగువా, బ్రహ్మ ముడి, శ్రావణ సమీరాలు అంటే సీరియల్స్లలో నటించారు.
హరిచంద్ర ప్రసాద్, నాగేంద్ర ప్రసాద్ ఇద్దరూ ఇందులో అన్నదమ్ములు.. వీరిద్దరి మధ్య ఆస్తి తగాదాలు ఉంటాయి. హరిచంద్ర ప్రసాద్ ఈ ఆస్తినంత నేనే సంపాదించాను అని నాగేంద్రప్రసాద్ కి చిల్లి గవ్వ కూడా ఇవ్వడు. వీరిద్దరికీ ఒక చెల్లెలు ఉంటుంది సౌదామిని. ఆమె భర్త కైలాష్ నాథ్. ఇది ఒక ఫ్రాడ్ పనులు చేస్తూ ఉంటాడు. సౌదామినే కొడుకు హీరో సాకేత్. నాగేంద్ర ప్రసాద్ కూతురు మైధిలి హీరోయిన్. తన కుటుంబాన్ని ఎలాగైనా కలపాలని మైధిలి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆ ఇంటికి నేను వారసురాల్ని అని నిరూపించుకోవాలి అని ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఎన్నో ఇబ్బందులను కూడా ఎదుర్కొంటుంది. మరి చివరికి ఆ ఇంటి వారసురాలు అని అందరికీ తెలిసేలా చేస్తుందా లేదా అన్నది ఈ సీరియల్ స్టోరీ లో చూడాలి..