E-Paper
Advertisement

Shocking Video: కిడ్నాపర్‌‌ను వదిలిరానంటూ బోరున ఏడ్చిన బాలుడి వీడియో వైరల్

Shocking Video: కిడ్నాపర్‌‌ను వదిలిరానంటూ బోరున ఏడ్చిన బాలుడి వీడియో వైరల్
Advertisement

Shocking Video: ఇటీవల దేశంలో కిడ్నాప్ కు సంబంధించిన ఘటనలు తరచూ విపరీతంగా వెలుగుచూస్తున్నాయి. పిల్లలను కిడ్నాప్ చేసి ఇతర రాష్ట్రాలకు తీసుకుని వెళ్తున్నారు. అభం శుభం తెలియని పసికందుల నుంచి మొదలుకుని వయసులోకి వచ్చిన పిల్లల వరకు కిడ్నాప్ చేసి డబ్బుుల సంపాదిస్తున్నారు. ఇలాంటి ఘటనలు తరచూ వందల్లో వెలుగుచూస్తున్నాయి. అయితే కిడ్నాపర్ అనగానే సాధారణంగా మూర్ఖంగా ఉంటారని, పిల్లలను తీసుకెళ్లి చిత్రహింసలు చేస్తారని, లేదా అమ్మేసి డబ్బులు సంపాదిస్తారని అందరు భావిస్తుంటారు. కానీ తాజాగా జరిగిన ఓ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

ఓ అభం శుభం తెలియని చిన్నారిని ఓ వ్యక్తి కిడ్నాప్ చేశాడు. ఈ ఘటన రాజస్థాన్ లోని జైపూర్ లో వెలుగుచూసింది. చిన్న పిల్లవాడు అని కూడా చూడకుండా 14 నెలల క్రితం ఓ బాలుడిని కిడ్నాప్ చేశాడు. 11 నెలలు ఉండగా పిల్లాడు కిడ్నాప్ కు గురయ్యాడు. ఈ తరుణంలో పిల్లవాడి తల్లిదండ్రులు జైపూర్ లోని సంగనేర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ పీఎస్ పరిధిలో ఉండే పృథ్వీ అనే బాలుడిని కిడ్నాప్ చేశారు. అయితే కిడ్నాప్ చేసిన వ్యక్తి బాలుడి తల్లి బంధువే అని పోలీసులు నిర్ధారించారు. బంధువైన తనూజ్ చాహర్ అనే హెడ్ కానిస్టేబుల్ బాలుడిని కిడ్నాప్ చేశాడు.

Advertisement

బాలుడి తల్లి తనూజ్ తో రావడానికి ఇష్టపడలేదని అందుకే బాలుడిని కిడ్నాప్ చేశాడు. దీంతో కిడ్నాప్ అనంతరం తనూజ్ ను అధికారులు సస్పెండ్ చేశారు. పోలీసులకు దొరకకుండా ఉండేందుకు చాలా కాలం పాటు దాక్కుని ఉన్నాడు. ఈ రతుణంలో గడ్డం, జుట్టు పెంచుకుని వేషాన్ని మార్చుకున్నాడు. ఈ తరుణంలో పోలీసులు తాజాగా తనూజ్ ఎక్కడ ఉంటున్నాడో గుర్తించారు. సన్యాసిగా మారిపోయి యమునా నది సమీపంలో గల ఖాదర్ అనే ప్రాంతంలో నివాసం ఉంటున్నట్లు గుర్తించారు.

ఓ గుడిసెలో నివసిస్తూ పిల్లాడిని చూసుకుంటూ బ్రతుకుతున్నాడు. అయితే కిడ్నాప్ చేసినా కూడా తనూజ్ బాలుడిని చాలా గారాభంగా చూసుకున్నాడు. ఈ క్రమంలో తాజాగా తనూజ్ ఆచూకీ తెలుసుకున్న పోలీసులు బాలుడిని తీసుకుని, తనూజ్ ను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో బాలుడు తనూజ్ కు చాలా దగ్గరయ్యాడు. దీంతో బాలుడు తనూజ్ ను వదిలి అస్సలు రాలేకపోయాడు. పోలీసులు బాలుడిని తీసుకుని వెళ్తున్న క్రమంలో బోరున ఏడ్చేశాడు. కిడ్నాప్ చేసినా కూడా ఎంతో ప్రేమగా చూసుకోవడంతో పృథ్వీ వదలడానికి ఇష్టపడలేదు. అయితే పిల్లాడు తనూజ్ ను వదిలి వెళ్తూ బోరున ఏడ్చిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ కిడ్నాపర్ పిల్లవాడిని ఇంత బాగా చూసుకోవడం చూసి నెటిజన్లు కూడా షాక్ అవుతున్నారు.

Advertisement

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×