Mother bravery: కన్నబిడ్డల కోసం ఓ తల్లి చేసిన ప్రాణసంకట పోరాటం చూస్తే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడుస్తుంది. బిహార్లోని సమస్తిపూర్ జిల్లా షాపూర్ పటోరి రైల్వే స్టేషన్లో జరిగిన ఈ ఘటన మాతృత్వానికి నిలువెత్తు రూపంలా నిలిచింది. ఓ మహిళ తన ఇద్దరు చిన్న పిల్లలను తీసుకుని రైల్వే ట్రాక్ దాటుతున్న సమయంలో, ఊహించని విధంగా ఓ రైలు అత్యంత వేగంతో దూసుకొచ్చింది. పక్కకు తప్పుకునే లోపే రైలు దగ్గరకు వచ్చేయడంతో ఆ తల్లికి ఏం చేయాలో పాలుపోలేదు. కానీ, బిడ్డలను ఎలాగైనా కాపాడుకోవాలన్న తపన ఆమెలో ధైర్యాన్ని నింపింది.
క్షణాల్లోనే ఆలోచించి, ఆ తల్లి తన ఇద్దరు పిల్లలను గుండెలకు హత్తుకుని ప్లాట్ఫామ్కు, పట్టాలకు మధ్య ఉన్న అత్యంత ఇరుకైన సందులో పడుకుంది. రైలు పెట్టెలు తనపై నుంచి వేగంగా వెళ్తున్నా, గుండె నిబ్బరంతో పిల్లలను కదలకుండా పట్టుకుంది. రైలు వెళ్లే వరకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని శ్వాస బిగబట్టింది. చివరకు రైలు వెళ్లిన తర్వాత ముగ్గురూ క్షేమంగా బయటపడటంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన చూసిన ప్రయాణికులు ఆ తల్లి సాహసానికి కన్నీళ్లు పెట్టుకున్నారు. అదే సమయంలో, స్టేషన్లో కనీసం వంతెన (ఫుట్ ఓవర్ బ్రిడ్జ్) లేకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయంటూ రైల్వే అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: చంద్రబాబు రూల్స్ పెడతారు.. కానీ ఫాలో అవ్వరు- మాజీ మంత్రి అమరనాథ్
కన్నబిడ్డల కోసం ప్రాణాలను పణంగా పెట్టిన తల్లి
ఇద్దరు పిల్లలతో కలిసి రైల్వే ట్రాక్ దాటే ప్రయత్నం చేసిన మహిళ
అదే సమయంలో అత్యంత వేగంతో దూసుకొచ్చిన రైలు
పిల్లల ప్రాణాలను కాపాడేందుకు తన ప్రాణాన్ని అడ్డం పెట్టిన తల్లి
రైలు వెళ్లే వరకు ప్లాట్ ఫామ్ కు ట్రాక్ కు మధ్యలో పిల్లలను… pic.twitter.com/ogbtDcwFFG
— BIG TV Breaking News (@bigtvtelugu) May 15, 2026