E-Paper
Advertisement

AP Viral News: పరీక్ష రాయాలంటే.. నది దాటాల్సిందే! విద్యార్థుల సాహస యాత్ర!

AP Viral News: పరీక్ష రాయాలంటే.. నది దాటాల్సిందే! విద్యార్థుల సాహస యాత్ర!
Advertisement

AP Viral News:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పార్వతీపురం మన్యం జిల్లాలో విద్యార్థులు, సామాన్య ప్రజలు పడుతున్న కష్టాలు చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. ఆధునిక కాలంలో కూడా ప్రాణాలను పణంగా పెట్టి పరీక్షలకు వెళ్లాల్సి రావడం విచారకరం.

పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం పరిధిలోని గ్రామస్తులు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య నాగావళి నదిపై వంతెన లేకపోవడం. తాజాగా జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షలు ఈ సమస్య తీవ్రతను మరోసారి వెలుగులోకి తెచ్చాయి. పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలంటే విద్యార్థులు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని నదిలో నడుచుకుంటూ వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది.

Advertisement

కొమరాడ మండలం కొట్టు-కొమరాడ మధ్య ప్రవహించే నాగావళి నదిపై వంతెన లేకపోవడంతో దాదాపు 43 గ్రామాల ప్రజలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయినట్లుగా బతుకుతున్నారు. ముఖ్యంగా గర్భిణులు, రోగులు ఆసుపత్రికి వెళ్లాలన్నా, రైతులు తమ పంటను మార్కెట్‌కు తరలించాలన్నా ఈ నదిని దాటక తప్పదు. వంతెన లేని కారణంగా వర్షాకాలంలో ఈ గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంటాయి.

గ్రామస్తులు ఎప్పటి నుంచో పూర్ణపాడు-లాబేసు వంతెన నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో వంతెన పనులు ప్రారంభమైనప్పటికీ.. రకరకాల కారణాలతో అవి మధ్యలోనే నిలిచిపోయాయి. అధికారులు, నాయకులు మారుతున్నా.. వంతెన నిర్మాణం మాత్రం పూర్తి కావడం లేదు. దీంతో అటు విద్యార్థులు, ఇటు కూలీలు నదిలో దిగి ప్రాణాపాయ స్థితిలో ప్రయాణం సాగిస్తున్నారు.

Advertisement

చదువుకోవాలనే తపన ఉన్న విద్యార్థులు, తమ భవిష్యత్తు కోసం ఇంతటి సాహసం చేయడం ప్రభుత్వ వ్యవస్థల వైఫల్యానికి అద్దం పడుతోంది. పరీక్షా సమయాల్లో విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ఉండాలంటే.. అలాగే 43 గ్రామాల ప్రజల ఇబ్బందులు తొలగాలంటే ప్రభుత్వం తక్షణమే స్పందించి నిలిచిపోయిన వంతెన పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Also Read: సుప్రీంకోర్టుకైనా వెళ్తాం.. పేదల జోలికొస్తే వదిలేదే లేదు.. సర్కార్‌పై కేటీఆర్ ఫైర్!

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×