Hyderabad Traffic Police: మద్యం మత్తులో వాహనాలు నడపొద్దని పోలీసులు ఎంత మొత్తుకుంటున్నా కొందరు వినడం లేదు. పైగా పట్టుబడ్డాక పోలీసులనే బెదిరించే స్థాయికి వెళ్తున్నారు. తాజాగా హైదరాబాద్ పాతబస్తీలో ఓ ఆటో డ్రైవర్ చేసిన పని చూసి ట్రాఫిక్ పోలీసులు అవాక్కయ్యారు. సీజ్ చేసిన తన ఆటోను తిరిగి ఇవ్వకపోతే.. పామును వదులుతానంటూ డ్రైవర్ పోలీసులను బెదిరించాడు.
హైదరాబాద్ పాతబస్తీ పరిధిలోని చంద్రాయణగుట్ట చౌరస్తా వద్ద ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో అటుగా వచ్చిన ఓ ఆటోను ఆపి డ్రైవర్ను పరీక్షించారు. బ్రీత్ అనలైజర్ టెస్టులో అతడికి ఏకంగా 150 రీడింగ్ వచ్చింది. నిబంధనల ప్రకారం పరిమితికి మించి మద్యం సేవించి ఉండటంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి, ఆటోను సీజ్ చేశారు.
అయితే, ఆటోను వదిలి వెళ్ళడానికి ఇష్టపడని డ్రైవర్.. వాహనంలో తన సామాగ్రి ఉందని, అది తీసుకుంటానని చెప్పి ఆటో దగ్గరకు వెళ్లాడు. అకస్మాత్తుగా ఆటోలో దాచిన ఓ పామును బయటకు తీసి తన చేతికి చుట్టుకున్నాడు. నడిరోడ్డుపై పాముతో హల్ చల్ చేస్తూ.. “నా ఆటో నాకు ఇస్తారా.. లేక పామును వదలమంటారా” అంటూ పోలీసులను బెదిరించాడు. ఊహించని ఈ పరిణామంతో పోలీసులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. వారు తేరుకుని అతడిని పట్టుకునేలోపే.. సదరు డ్రైవర్ పాముతో సహా అక్కడి నుంచి పరారయ్యాడు. ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించడంతో పాటు బెదిరింపులకు పాల్పడిన ఆ డ్రైవర్పై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.
హైదరాబాద్లోని చాంద్రాయణగుట్టలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల సమయంలో వింత ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న ఓ ఆటో డ్రైవర్, తన వాహనాన్ని సీజ్ చేయవద్దంటూ పోలీసులను చనిపోయిన పాముతో బెదిరించాడు. ఆటోలో ఉన్న పామును తీసి పోలీసుల వైపు వెళ్లడంతో అక్కడున్న వారు షాక్కు గురయ్యారు. కొన్నేళ్ల… pic.twitter.com/HbRPKYhSlk
— ChotaNews App (@ChotaNewsApp) January 4, 2026